గుంటూరు నగర పరిధిలో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.

0
192

🚩 గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీ శ్రీ బెల్లం శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో,

గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ సీఐ శ్రీ ఏ. అశోక్ కుమార్ గారు మరియు వెస్ట్ ట్రాఫిక్ సీఐ శ్రీ సింగయ్య గారు తమ సిబ్బందితో కలిసి గుంటూరు నగర పరిధిలో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.

📍ఈ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులను గౌరవ న్యాయస్థానంలో హాజరుపరచగా, గౌరవ న్యాయమూర్తులు క్రింది విధంగా తీర్పులు వెలువరించారు.

📌 గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారు.

* మొత్తం పట్టుబడిన వాహనదారులు:11 మంది.

* ద్విచక్ర వాహనదారులు: 8 మంది.

* 1 వ్యక్తికి రూ. 10,000/- జరిమానా.

* 7 మందికి ఒక్కొక్కరికి రూ. 5,000/- జరిమానా

(మొత్తం జరిమానా మొత్తం : రూ. 45,000/-)

* మద్యం సేవించి వాహనం నడిపిన 3 మందికి 3 రోజుల చొప్పున జైలు శిక్ష విధించబడింది.

📌గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంగ్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారు.

* మొత్తం పట్టుబడిన వాహనదారులు : 6 మంది.

* 3 మందికి ఒక్కొక్కరికి రూ. 7,000/- చొప్పున జరిమానా.

* 2 మందికి ఒక్కొక్కరికి రూ. 5,000/- చొప్పున జరిమానా

(మొత్తం జరిమానా మొత్తం : రూ. 31,000/-)

* 1 వ్యక్తికి 3 రోజులు జైలు శిక్ష విధించబడింది.

* మొత్తం పట్టుబడిన వాహనదారులు: 17 మంది.

* మొత్తం విధించిన జరిమానా: 13 మందికి రూ. 76,000/-

* మొత్తం జైలు శిక్షలు: 4 మంది

👉 ప్రజలు తమ భద్రత దృష్ట్యా ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం వాహనాలు నడిపిన వారికే కాకుండా, తోటి వాహనదారులకు కూడా ప్రమాదకరంగా ఉంటుందని, ఇటువంటి ఘటనలపై ఇకముందు కూడా కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.

Search
Categories
Read More
Technology
Samsung Begins Production of Its Slimmest Phone Yet — The Galaxy S25 Edge — in India
Samsung Begins Production of Its Slimmest Phone Yet — The Galaxy S25 Edge — in India...
By BMA ADMIN 2025-05-22 18:14:35 0 2K
Andhra Pradesh
సితార సెంటర్ వద్ద వంగవీటి మోహనరంగా జంక్షన్ వద్ద ఘన నివాళి
ప్రజల మాటలు ప్రజల బాటలో నిలిచి ప్రయాణించిన గొప్ప నాయకులు వంగవీటి మోహన రంగా గారు.   ...
By Rajini Kumari 2025-12-26 09:45:14 0 183
Andhra Pradesh
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గారి ముందస్తు జయంతి ఉత్సవాలు
పుంగనూరు మండలం బండ్లపల్లి పంచాయతీ నల్లూరు పల్లి గ్రామంలో ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 9.30 గంటలకు...
By Kothuru Murali 2026-04-11 06:23:46 0 66
Telangana
భీమారం నిబంధన ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలి
భీమారం నిబంధన ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలి లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్దేశిత...
By Pinnehasan Odela 2026-04-09 14:31:54 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com