ఆంధ్రా భోజనం రుచికి జపాన్ దౌత్య సిబ్బంది ఫిదా... సీఎం చంద్రబాబు స్పందన.

0
119

ఢిల్లీలోని ఏపీ భవన్‌లో భోజనం చేసిన జపాన్ దౌత్య సిబ్బంది

ఆంధ్రా థాలీ రుచులు అద్భుతమంటూ సోషల్ మీడియాలో పోస్ట్

వారి పోస్ట్‌పై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

ఆంధ్రా వంటకాలు తమ ఆప్యాయతను చాటుతాయన్న ముఖ్యమంత్రి

జపాన్ ప్రజలను ఏపీకి రెండో ఇల్లుగా భావించి రావాలని ఆహ్వానం

ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో జపాన్ దౌత్య సిబ్బంది ఆంధ్రా భోజనాన్ని ఆస్వాదించారు. సంప్రదాయ వంటకాల రుచిపై వారు ప్రశంసలు కురిపించగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై స్పందిస్తూ వారిని రాష్ట్రానికి సాదరంగా ఆహ్వానించారు.

 

జపాన్ దౌత్యవేత్తల బృందం మంగళవారం ఏపీ భవన్‌లో టీమ్ లంచ్‌లో పాల్గొని, సంప్రదాయ ఆంధ్రా థాలీని రుచి చూసింది. ఈ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ.. "మేము ఘాటైన రుచులతో కూడిన అద్భుతమైన, నిజమైన ఆంధ్రా థాలీని ఆస్వాదించాం. ధన్యవాదాలు!" అని పేర్కొంది.

 

ఈ పోస్ట్‌పై సీఎం చంద్రబాబు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. "మా సంప్రదాయ ఆహారాన్ని మీరు ఆస్వాదించడం చాలా సంతోషంగా ఉంది. జపాన్ వంటకాలైన సుషీ, సషిమి ఎలాగైతే ఆ దేశ సంస్కృతిలో కచ్చితత్వం, సమతుల్యతను ప్రతిబింబిస్తాయో, అలాగే ఆంధ్రా వంటకాలు తమ రుచుల ద్వారా ఆప్యాయతను, ఉదారతను చాటుతాయి" అని చంద్రబాబు పేర్కొన్నారు.

 

అంతేకాకుండా, "మీ కోసం, జపాన్ నుంచి మా రాష్ట్రానికి వచ్చే అతిథుల కోసం ఇంకా ఎన్నో రుచులు వేచి ఉన్నాయి. మీ అందరికీ రెండో ఇల్లయిన ఆంధ్రప్రదేశ్‌కు స్వాగతం పలకడానికి మేం ఎదురుచూస్తున్నాం" అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. 

Search
Categories
Read More
Telangana
అల్వాల్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ - పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ మండల రెవెన్యూ అధికారి (MRO) కార్యాలయంలో ఈరోజు కళ్యాణ లక్ష్మీ...
By Sidhu Maroju 2026-03-12 08:01:10 0 100
Education
Opportunity for Researchers! The IKS Division, Ministry of Education, is inviting applications for the Competitive Research Proposals Program 2026–27
The Indian Knowledge Systems (IKS) Division, under the Ministry of Education, Government of...
By Venugopal Gopal 2026-01-17 16:46:35 0 3K
Andhra Pradesh
భూతాపాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ విద్యుత్ ను పొదుపుగా వాడాలి
శ్రీకాకుళంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగిన ఇళ్ల గణన ఫీల్డ్ ట్రైనర్ ట్రైనింగ్ కార్యక్రమంలో...
By Manda Ramkumar 2026-03-28 08:51:50 0 132
Andhra Pradesh
మిర్చి రైతులకు అండగా నిలవాలి.
మిర్చి యార్డుకు వచ్చే రైతులకు అండగా నిలుస్తూ, భరోసా కల్పించడమే లక్ష్యం కావాలని మిర్చి యార్డు వైస్...
By John Baji 2026-02-05 08:47:12 0 180
Andhra Pradesh
అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన శ్రీ వైయస్‌ జగన్‌.
గుంటూరు:మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు, ఆఫీస్‌పై టీడీపీ గుండాల దాడి. సర్వం విధ్వంసం. అంబటి...
By John Baji 2026-02-05 05:33:17 0 183
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com