ఆంధ్రా భోజనం రుచికి జపాన్ దౌత్య సిబ్బంది ఫిదా... సీఎం చంద్రబాబు స్పందన.

0
118

ఢిల్లీలోని ఏపీ భవన్‌లో భోజనం చేసిన జపాన్ దౌత్య సిబ్బంది

ఆంధ్రా థాలీ రుచులు అద్భుతమంటూ సోషల్ మీడియాలో పోస్ట్

వారి పోస్ట్‌పై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

ఆంధ్రా వంటకాలు తమ ఆప్యాయతను చాటుతాయన్న ముఖ్యమంత్రి

జపాన్ ప్రజలను ఏపీకి రెండో ఇల్లుగా భావించి రావాలని ఆహ్వానం

ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో జపాన్ దౌత్య సిబ్బంది ఆంధ్రా భోజనాన్ని ఆస్వాదించారు. సంప్రదాయ వంటకాల రుచిపై వారు ప్రశంసలు కురిపించగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై స్పందిస్తూ వారిని రాష్ట్రానికి సాదరంగా ఆహ్వానించారు.

 

జపాన్ దౌత్యవేత్తల బృందం మంగళవారం ఏపీ భవన్‌లో టీమ్ లంచ్‌లో పాల్గొని, సంప్రదాయ ఆంధ్రా థాలీని రుచి చూసింది. ఈ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ.. "మేము ఘాటైన రుచులతో కూడిన అద్భుతమైన, నిజమైన ఆంధ్రా థాలీని ఆస్వాదించాం. ధన్యవాదాలు!" అని పేర్కొంది.

 

ఈ పోస్ట్‌పై సీఎం చంద్రబాబు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. "మా సంప్రదాయ ఆహారాన్ని మీరు ఆస్వాదించడం చాలా సంతోషంగా ఉంది. జపాన్ వంటకాలైన సుషీ, సషిమి ఎలాగైతే ఆ దేశ సంస్కృతిలో కచ్చితత్వం, సమతుల్యతను ప్రతిబింబిస్తాయో, అలాగే ఆంధ్రా వంటకాలు తమ రుచుల ద్వారా ఆప్యాయతను, ఉదారతను చాటుతాయి" అని చంద్రబాబు పేర్కొన్నారు.

 

అంతేకాకుండా, "మీ కోసం, జపాన్ నుంచి మా రాష్ట్రానికి వచ్చే అతిథుల కోసం ఇంకా ఎన్నో రుచులు వేచి ఉన్నాయి. మీ అందరికీ రెండో ఇల్లయిన ఆంధ్రప్రదేశ్‌కు స్వాగతం పలకడానికి మేం ఎదురుచూస్తున్నాం" అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోట్ల!!
కర్నూలు : డోన్ :  డోన్ మండలంలోని ఉడుములపాడు గ్రామంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర...
By Hari Krishna 2026-01-24 12:55:36 0 267
Andhra Pradesh
పుంగనూరు: 200 కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ టూరు మురళి
పుంగనూరు పట్టణంలో నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి చల్లా బాబు ఆదేశాల మేరకు 200 పేద కుటుంబాలకు రంజాన్...
By Kothuru Murali 2026-03-20 06:02:48 0 81
Andhra Pradesh
హోరీజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవం వేడుకలు
వేటపాలెం గ్రామంలో హోరిజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.  ఈ...
By Vadlamudi NagaVenkat 2026-04-04 09:39:21 0 106
Telangana
నిజామాబాద్:మక్కజొన్న కేంద్రం వెంటనే ఏర్పటుచేయాలి
నిజామాబాద్ జిల్లాలో రైతులు పండించిన మక్క పంటకు కొనుగోలు వెంటనే ఏర్పాటుచేయాలని నిజామాబాద్ జిల్లా...
By Sadaq Sadaq 2026-03-16 17:26:55 0 128
Andhra Pradesh
Cow rescued
ప్రొద్దుటూరు గాంధీ రోడ్డులో డ్రైనేజ్ కలువలో పడిపోయిన ఆవును రక్షించేందుకు రాత్రి సమయంలోనే రెస్క్యూ...
By Naveen Kumar 2026-03-06 08:05:36 0 97
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com