ఆంధ్రా భోజనం రుచికి జపాన్ దౌత్య సిబ్బంది ఫిదా... సీఎం చంద్రబాబు స్పందన.

0
178

ఢిల్లీలోని ఏపీ భవన్‌లో భోజనం చేసిన జపాన్ దౌత్య సిబ్బంది

ఆంధ్రా థాలీ రుచులు అద్భుతమంటూ సోషల్ మీడియాలో పోస్ట్

వారి పోస్ట్‌పై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

ఆంధ్రా వంటకాలు తమ ఆప్యాయతను చాటుతాయన్న ముఖ్యమంత్రి

జపాన్ ప్రజలను ఏపీకి రెండో ఇల్లుగా భావించి రావాలని ఆహ్వానం

ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో జపాన్ దౌత్య సిబ్బంది ఆంధ్రా భోజనాన్ని ఆస్వాదించారు. సంప్రదాయ వంటకాల రుచిపై వారు ప్రశంసలు కురిపించగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై స్పందిస్తూ వారిని రాష్ట్రానికి సాదరంగా ఆహ్వానించారు.

 

జపాన్ దౌత్యవేత్తల బృందం మంగళవారం ఏపీ భవన్‌లో టీమ్ లంచ్‌లో పాల్గొని, సంప్రదాయ ఆంధ్రా థాలీని రుచి చూసింది. ఈ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ.. "మేము ఘాటైన రుచులతో కూడిన అద్భుతమైన, నిజమైన ఆంధ్రా థాలీని ఆస్వాదించాం. ధన్యవాదాలు!" అని పేర్కొంది.

 

ఈ పోస్ట్‌పై సీఎం చంద్రబాబు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. "మా సంప్రదాయ ఆహారాన్ని మీరు ఆస్వాదించడం చాలా సంతోషంగా ఉంది. జపాన్ వంటకాలైన సుషీ, సషిమి ఎలాగైతే ఆ దేశ సంస్కృతిలో కచ్చితత్వం, సమతుల్యతను ప్రతిబింబిస్తాయో, అలాగే ఆంధ్రా వంటకాలు తమ రుచుల ద్వారా ఆప్యాయతను, ఉదారతను చాటుతాయి" అని చంద్రబాబు పేర్కొన్నారు.

 

అంతేకాకుండా, "మీ కోసం, జపాన్ నుంచి మా రాష్ట్రానికి వచ్చే అతిథుల కోసం ఇంకా ఎన్నో రుచులు వేచి ఉన్నాయి. మీ అందరికీ రెండో ఇల్లయిన ఆంధ్రప్రదేశ్‌కు స్వాగతం పలకడానికి మేం ఎదురుచూస్తున్నాం" అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
రూ.18.54 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ LOCలను పంపిణీ చేసిన డా గొట్టిపాటి లక్ష్మీ
రూ.18.54 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ LOCలను పంపిణీ చేసిన డా గొట్టిపాటి లక్ష్మీ కురిచేడు మండలం,...
By Chennaiah Kati 2026-07-03 05:06:27 0 35
SURAKSHA
Musharraf Ali Faruqui IAS: Powering Telangana's Progress
A dynamic Telangana IAS officer whose leadership in district administration, urban development,...
By Lokeshwari Panthadi 2026-07-15 07:39:25 0 124
Andhra Pradesh
పుంగనూరు: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం కంటేపల్లి గ్రామంలో సీఐ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, ఆదివారం సాయంత్రం...
By Kothuru Murali 2026-03-23 04:51:05 0 168
Telangana
"హరిజనబస్తీ డిసిల్టింగ్‌పై శాంతి శ్రీనివాస్ రెడ్డి ఫోకస్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : హరిజనబస్తీ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న డిసిల్టింగ్ (మట్టిని...
By Sidhu Maroju 2026-04-20 13:00:04 0 139
SURAKSHA
AP Retired Cops: Guardians Of Road Safety Now
Yesterday retire అయిన AP police officers road safety guardians గా కొనసాగుతున్నారు. School zones,...
By Kalaga Sailaja 2026-07-03 13:30:42 0 63
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com