అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : మున్సిపల్ కమిషనర్

0
182

కర్నూలు సిటీ : 

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
• వార్డుల వారీగా ప్రగతి పనుల పురోగతిపై సమీక్ష
• హాజరైన ఇంజనీరింగ్, అకౌంట్స్, అమినిటీస్ కార్యదర్శులు

నగరంలో వివిధ దశల్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, జాప్యానికి ఆస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ సూచించారు. మంగళవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో ఇంజనీరింగ్, అకౌంట్స్, అమినిటీస్ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు.

నిధులు మంజూరు అయిన వెంటనే పనులు ప్రారంభించి, నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేలా అమినిటీస్ కార్యదర్శులు, ఇంజనీరింగ్ విభాగ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని కమిషనర్ స్పష్టం చేశారు. పనుల్లో అనవసర జాప్యం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతి అభివృద్ధి పనిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. 

పనులు దక్కించుకుని పనులు ప్రారంభించని గుత్తేదారులకు నోటిసులు జారీ చేయాలని, స్పందించకపోతే రద్దు చేసేయాలని స్పష్టం చేశారు. పనుల నమోదు, బిల్లుల సమర్పణ, చెల్లింపుల ప్రక్రియలు సకాలంలో పూర్తయ్యేలా అకౌంట్స్ విభాగం సమన్వయంతో వ్యవహరించాలని తెలిపారు. విభాగాల మధ్య సమన్వయం లోపించకుండా ఇంజనీరింగ్, అకౌంట్స్ విభాగాలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రతి వార్డులో చేపట్టిన పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

కార్యక్రమంలో ఎస్ఈ రమణమూర్తి, ఎంఈ మనోహర్ రెడ్డి, సూపరింటెండెంట్ మంజూర్ బాష, డిఈఈలు, ఏఈలు, అకౌంట్స్ విభాగ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎస్ ఐ ఆర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు రంజిత్ రాయల్
*సర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న రంజిత్ రాయల్*   అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడం,...
By Benguluri Madhubabu 2026-06-24 03:41:26 0 129
Andhra Pradesh
ప్రాంతీయ ఉప సంచాలకులు ఆకస్మిక తనిఖీ
విశాఖ పట్నం జిల్లా భీమిలి ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణం లో ఉన్న ఆయుష్ శాఖ ఆసుపత్రిలో సుమారు 30 లక్షల...
By Mobbu Venkatramana 2026-02-27 15:32:02 0 329
Andhra Pradesh
పుంగనూరు: 136 పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ
పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో, పుంగనూరు పరిధిలోని 136 పాఠశాలలకు ఎస్.ఆర్.కె. కిట్లతో...
By Kothuru Murali 2026-06-06 15:10:14 0 87
Uttarkhand
Uttarakhand Advances Renewable Energy and Hydropower
Uttarakhand continues to expand its renewable energy sector by promoting hydropower, solar...
By Fathima Safa 2026-06-27 06:47:51 0 45
BMA
📈 India’s Media & Entertainment Sector Hits ₹2.5 Trillion — Growth Brings New Hope and New Challenges
📈 India’s Media & Entertainment Sector Hits ₹2.5 Trillion - Growth Brings New Hope and...
By BMA ADMIN 2025-05-03 09:19:22 1 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com