అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : మున్సిపల్ కమిషనర్

0
181

కర్నూలు సిటీ : 

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
• వార్డుల వారీగా ప్రగతి పనుల పురోగతిపై సమీక్ష
• హాజరైన ఇంజనీరింగ్, అకౌంట్స్, అమినిటీస్ కార్యదర్శులు

నగరంలో వివిధ దశల్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, జాప్యానికి ఆస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ సూచించారు. మంగళవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో ఇంజనీరింగ్, అకౌంట్స్, అమినిటీస్ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు.

నిధులు మంజూరు అయిన వెంటనే పనులు ప్రారంభించి, నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేలా అమినిటీస్ కార్యదర్శులు, ఇంజనీరింగ్ విభాగ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని కమిషనర్ స్పష్టం చేశారు. పనుల్లో అనవసర జాప్యం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతి అభివృద్ధి పనిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. 

పనులు దక్కించుకుని పనులు ప్రారంభించని గుత్తేదారులకు నోటిసులు జారీ చేయాలని, స్పందించకపోతే రద్దు చేసేయాలని స్పష్టం చేశారు. పనుల నమోదు, బిల్లుల సమర్పణ, చెల్లింపుల ప్రక్రియలు సకాలంలో పూర్తయ్యేలా అకౌంట్స్ విభాగం సమన్వయంతో వ్యవహరించాలని తెలిపారు. విభాగాల మధ్య సమన్వయం లోపించకుండా ఇంజనీరింగ్, అకౌంట్స్ విభాగాలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రతి వార్డులో చేపట్టిన పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

కార్యక్రమంలో ఎస్ఈ రమణమూర్తి, ఎంఈ మనోహర్ రెడ్డి, సూపరింటెండెంట్ మంజూర్ బాష, డిఈఈలు, ఏఈలు, అకౌంట్స్ విభాగ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆపరేటర్ ఉద్యోగాలు!!
కర్నూలు : హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్), నాసిక్.. తాత్కాలిక ప్రాతిపదికన ఆపరేటర్...
By Hari Krishna 2025-12-22 08:45:17 0 219
Business & Finance
PSPCL Strike Disrupts Billing and Revenue Collection
The ongoing strike by outsourced meter readers has disrupted billing operations and revenue...
By Navya Sree 2026-06-30 05:37:14 0 32
Telangana
దస్తూరాబాద్: ‘ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి'
దస్తూరాబాద్ మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో సావిత్రిబాయి ఫూలే జయంతిని ఘనంగా...
By Mitappaly Shiavji 2026-01-03 08:05:53 0 499
Andhra Pradesh
గోహత్యల నివారణ ధ్యేయంగా ఏప్రిల్ 27న గో సన్మాన ఆహ్వానం అభియాన్ కార్యక్రమం
*గోహత్యల నివారణే ధ్యేయం గా ఏప్రిల్ 27న ‘గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం*  ...
By Rajini Kumari 2026-04-04 14:57:23 0 232
Manipur
Manipur Strengthens Disaster Management and Resilience
Manipur has continued to strengthen its disaster management framework through improved...
By Fathima Safa 2026-07-01 10:25:06 0 76
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com