రోడ్డు ప్రమాద బాదితులకు సహాయం చేసేవారిని ఇబ్బందులకు గురిచెయ్యకుండా, వారిని ప్రోత్సహించాలని, హాస్పిటల్ సిబ్బందిని జిల్లా రవాణా శాఖ అధికారి టి.కె.పరంధామ రెడ్డి కోరారు.

0
91
చీరాల : రోడ్డు ప్రమాద బాదితులకు సహాయం చేసేవారిని ఇబ్బందులకు గురిచెయ్యకుండా, వారిని ప్రోత్సహించాలని, హాస్పిటల్ సిబ్బందిని జిల్లా రవాణా శాఖ అధికారి టి.కె.పరంధామ రెడ్డి కోరారు. రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా ఈ రోజు బాపట్ల మరియు చీరాల ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద రవాణా శాఖ అధికారులు హాస్పిటల్ సిబ్బందికి “రహ్ వీర్” ల రక్షణ గురించి వివరించారు. ఈ సందర్భం గా పరంధామ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల సమయంలో బాధితులకు సహాయపడేవారిని రహ్ వీర్ లు గా గుర్తిస్తారని, వారిని బాధితులను హాస్పిటల్ నందు చేర్పించే సమయంలో ఎటువంటి ఇబ్బందులకు గురిచేయకుండా ఉండేదుకు మోటార్ వాహనముల చట్టము సెక్షన్ 134 ఎ ద్వారా రక్షణ కల్పించబడినదని తెలిపారు. హాస్పిటల్ సిబ్బంది గాని, పోలీస్ వారు గాని రహ్ వీర్ లను, వారు స్వచ్ఛందంగా తెలియ జేస్తే తప్ప, పేరు చిరునామా తెలుపమని వత్తిడి చెయ్యరాదని, వారు బాధితులను హాస్పిటల్ నందు చేర్చిన వెంటనే అచ్చటి నుండి వెళ్లిపోవుటకు ఎటువంటి అభ్యంతరం పెట్టరాదని తెలిపారు. రహ్ వీర్ లకు రూ. 25,000/- నగదు బహుమతి కూడా ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ విషయాలను తెలియచేసే గోడ పత్రికలను ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులు మరియు సిబ్బంది బాపట్ల మరియు చీరాల లో గల వివిధ హాస్పిటల్స్ నందు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ డి.బి.వి. రంగారావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, బి. కిషోర్ బాబు, కె, రవినాయక్, మెడికల్ ఆఫీసర్ ఎ. నరేంద్ర కుమార్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు .
డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, బాపట్ల జిల్లా.
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా ప్రతి శుక్రవారం సేవలు.....
అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా ప్రతి శుక్రవారం సేవలు  అబ్దుల్ కలాం ఫౌండేషన్...
By Gadiyapudi Narendra 2025-12-26 14:41:25 0 142
Telangana
విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని మోడి
గుజరాత్ లోని అహ్మదాబాద్, విమానాశ్రయం నుండి టేకప్ అయిన కొద్దిసేపటికే లండన్ వెళ్లవలసిన ఎయిర్ ఇండియా...
By Sidhu Maroju 2025-06-13 14:53:57 0 1K
Andhra Pradesh
కూటమి ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు రక్షణ కరువైంది - వెలంపల్లి శ్రీనివాసరావు
తెలుగుదేశం పార్టీ లో ఉన్న ఆర్యవైశ్య ప్రముకులు ఎందుకు స్పందించడంలేదు ? మీరు ఆర్యవైస్యులు కాదా ? -...
By John Baji 2025-12-29 13:46:22 0 79
Andhra Pradesh
ప్రకాశం- పల్నాడు- బాపట్ల జిల్లాలో విద్యుత్- రాగి వైర్లు దొంగతనాల కేసులో ఐదుగురు ముద్దాయిల అరెస్టు - సుమారు 4 లక్షల 40 వేల విలువైన చోరీ సొత్తు రికవరీ.
ప్రకాశం – పల్నాడు-బాపట్ల జిల్లాల్లో విద్యుత్/రాగి వైర్లు దొంగతనాల కేసులో ఐదుగురు ముద్దాయిల...
By Chennaiah Kati 2026-02-04 06:17:16 0 86
Telangana
మైనంపల్లి కృషితో అభివృద్ధికి మహర్ధశ :₹4.5 కోట్లతో హై టెన్షన్ రోడ్డుపనులకు శ్రీకారం |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మచ్చ బొల్లారం డివిజన్ 133 పరిధిలోని హై టెన్షన్ రోడ్డు ప్రాంత ప్రజల...
By Sidhu Maroju 2026-02-08 08:25:14 0 51
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com