రోడ్డు ప్రమాద బాదితులకు సహాయం చేసేవారిని ఇబ్బందులకు గురిచెయ్యకుండా, వారిని ప్రోత్సహించాలని, హాస్పిటల్ సిబ్బందిని జిల్లా రవాణా శాఖ అధికారి టి.కె.పరంధామ రెడ్డి కోరారు.

0
174
చీరాల : రోడ్డు ప్రమాద బాదితులకు సహాయం చేసేవారిని ఇబ్బందులకు గురిచెయ్యకుండా, వారిని ప్రోత్సహించాలని, హాస్పిటల్ సిబ్బందిని జిల్లా రవాణా శాఖ అధికారి టి.కె.పరంధామ రెడ్డి కోరారు. రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా ఈ రోజు బాపట్ల మరియు చీరాల ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద రవాణా శాఖ అధికారులు హాస్పిటల్ సిబ్బందికి “రహ్ వీర్” ల రక్షణ గురించి వివరించారు. ఈ సందర్భం గా పరంధామ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల సమయంలో బాధితులకు సహాయపడేవారిని రహ్ వీర్ లు గా గుర్తిస్తారని, వారిని బాధితులను హాస్పిటల్ నందు చేర్పించే సమయంలో ఎటువంటి ఇబ్బందులకు గురిచేయకుండా ఉండేదుకు మోటార్ వాహనముల చట్టము సెక్షన్ 134 ఎ ద్వారా రక్షణ కల్పించబడినదని తెలిపారు. హాస్పిటల్ సిబ్బంది గాని, పోలీస్ వారు గాని రహ్ వీర్ లను, వారు స్వచ్ఛందంగా తెలియ జేస్తే తప్ప, పేరు చిరునామా తెలుపమని వత్తిడి చెయ్యరాదని, వారు బాధితులను హాస్పిటల్ నందు చేర్చిన వెంటనే అచ్చటి నుండి వెళ్లిపోవుటకు ఎటువంటి అభ్యంతరం పెట్టరాదని తెలిపారు. రహ్ వీర్ లకు రూ. 25,000/- నగదు బహుమతి కూడా ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ విషయాలను తెలియచేసే గోడ పత్రికలను ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులు మరియు సిబ్బంది బాపట్ల మరియు చీరాల లో గల వివిధ హాస్పిటల్స్ నందు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ డి.బి.వి. రంగారావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, బి. కిషోర్ బాబు, కె, రవినాయక్, మెడికల్ ఆఫీసర్ ఎ. నరేంద్ర కుమార్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు .
డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, బాపట్ల జిల్లా.
 
#Narendra
Search
Categories
Read More
Telangana
Muncipal elections
ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ముందుగా రాష్ట్రంలో 48 గంటల సైలెంట్...
By G k Nookala 2026-02-09 17:59:12 0 126
Andhra Pradesh
రసాయన విపత్తులకు అడ్డుకట్ట లక్ష్యంగా కార్యాచరణ
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, ఏప్రిల్ 24, 2026*  ...
By Rajini Kumari 2026-04-24 13:04:44 0 121
Chandigarh
Political Heat: CM Mann Takes on Centre in Chandigarh
It’s a high-stakes Friday at the Punjab Raj Bhavan area as Chief Minister Bhagwant Mann...
By Dunna Jessicaruth 2026-05-15 09:34:00 0 34
Andhra Pradesh
అయ్యప్ప స్వామి వారిని పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి గారు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, కోటమలై కొండపై వెలసిన శ్రీ అయ్యప్ప స్వామిని గురువారం మాజీ...
By Kothuru Murali 2026-01-02 05:24:26 0 145
Telangana
కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ను కలిసి తమ కాలనీ సమస్యలను విన్నవించిన రాయల్ ఎన్క్లేవ్ నివాసులు
మల్కాజిగిరి జిల్లా / అల్వాల్.   రాయల్ ఎన్‌క్లేవ్ - కాలనీ నివాసితులు సమావేశమై తమ...
By Sidhu Maroju 2025-08-02 15:16:32 0 739
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com