జాతి నిర్మాణంలో ఆంధ్రా యూనివర్సిటీది కీలక పాత్ర: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

0
107

ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) కేవలం ఒక విద్యా ప్రాంగణం కాదని, వ్యక్తిత్వంతో, విలువలతో జాతి నిర్మాణంలో భాగస్వామిగా నిలిచిన భారతీయ వారసత్వ సంపదకు ప్రతీక అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఏయూ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 'మెగా కల్చరల్ ఫెస్ట్ 2026'లో ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ఘనతను స్మరించుకున్నారు.

 

ఈరోజు ఆంధ్రా యూనివర్సిటీ ఈ స్థాయిలో ఉందంటే, ఎందరో విద్యార్థులు ఇక్కడ విద్యను పూర్తి చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరడమే నిదర్శనమని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ విశ్వవిద్యాలయానికి పునాదులు వేసిన మహనీయుడు డాక్టర్ సీఆర్ రెడ్డికి, ఆయన ఆశయానికి అండగా నిలిచిన మాజీ ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు, రామన్ ఎఫెక్ట్‌తో నోబెల్ బహుమతి సాధించిన సర్ సీవీ రామన్‌కు మనస్ఫూర్తిగా ప్రణామాలు అర్పిస్తున్నట్లు తెలిపారు.

 

1926లో ఉన్నత విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో మేధస్సు, సంస్కృతి, జాతి నిర్మాణం అనే మూడు మూల స్తంభాలపై ఏయూని స్థాపించారని గుర్తుచేశారు. ఇక్కడ చదువుకున్న వారు కేవలం ఉద్యోగాలు వెతుక్కోకుండా, వివిధ రంగాలలో సమాజాన్ని ముందుకు నడిపించే నాయకులుగా, మేధావులుగా, వ్యవస్థలలో మార్పు తెచ్చే శక్తిగా నిలిచారని ప్రశంసించారు. ప్రస్తుత విద్యార్థులు కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు.

 

తనకు అత్యంత ఆప్తుడైన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇదే ఆంధ్రా యూనివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ చేసి గోల్డ్ మెడలిస్ట్ అయ్యారని పవన్ కల్యాణ్ గుర్తుచేసుకున్నారు. ఆయన ద్వారానే ఇక్కడి ప్రొఫెసర్ల ప్రతిభ, వర్సిటీ గొప్పదనం గురించి తనకు తెలిసిందని, ఇంతటి గొప్ప విశ్వవిద్యాలయానికి అతిథిగా రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. 

 

"నేను చాలా తక్కువ మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. కానీ ఎంత మౌనంగా ఉండాలనుకున్నా, జీవితం నన్ను కోట్లాది మంది మధ్య మాట్లాడేలా చేసింది" అంటూ ప్రసంగించారు. ప్రపంచంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నా, తరతరాలకు ప్రత్యేకమైన జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నత స్థానంలో నిలిచిన వాటిలో ఏయూ ఒకటని కొనియాడారు.

Search
Categories
Read More
Telangana
ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా SP
ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఖానాపూర్లోని ఎన్నిక కేంద్రాన్ని...
By Mittapelli Saketh 2026-02-17 10:16:30 0 262
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో ఒడిస్సా యువకుడు అనుమానాస్పద మృతి.
నిమ్మనపల్లె మండలం పరిధిలోని బోయకొండ అటవీ ప్రాంతంలో కోళ్ల ఫారాలకు కాపలాగా పనిచేస్తున్న ఒడిస్సా...
By Pagadala Venkateswar 2026-02-16 05:04:54 0 133
Andhra Pradesh
చింతల వంక దగ్గర ఒంటరి ఏనుగు
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మండలానికి సంబంధించిన తూర్పు...
By Kothuru Murali 2025-12-27 17:00:31 0 148
Andhra Pradesh
మంత్రి రాంప్రసాద్ రెడ్డి మదనపల్లి పర్యటనలో భారీ బైక్ ర్యాలీ.
ఆదివారం మదనపల్లె పర్యటనలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ...
By Pagadala Venkateswar 2026-02-02 04:39:11 0 113
Telangana
"అల్వాల్‌, బొల్లారం లో ఆగని దొంగల 'షికారు': రెండ్రోజుల్లో రెండు బైకులు మాయం!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నగర శివార్లలోని అల్వాల్.. బొల్లారం పరిసర ప్రాంతాల్లో వాహన దొంగలు...
By Sidhu Maroju 2026-04-15 16:27:48 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com