యోగి వేమన పద్యాలు సమాజానికి నైతిక విలువలు అందించాయి

0
186

విజయవాడ నగరపాలక సంస్థ

19-01-2026

 

 

 

 *వేమన పద్యాలు సమాజానికి నైతిక విలువలను అందించాయి*

 

 

 

యోగి వేమన పద్యాలు సమాజానికి నైతిక విలువలను అందించాయని విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ మరియు అదనపు కమిషనర్ జనరల్ ఏ. రవీంద్ర రావు అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద యోగివేమన జయంతి పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

 

 

 

 ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగివేమన పద్యాలు సమాజానికి నైతిక విలువలను అందించాయని, వాటిని చిన్నప్పటి నుంచే అభ్యసించడం వల్ల వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందని అన్నారు. సామాజిక సమానత్వం, మానవతా విలువలు, నిజాయితీ, కష్టపడి జీవించడం వంటి అంశాలను యోగివేమన తన పద్యాల రూపంలో తెలిపారని, ఇటువంటి విషయాలని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారు అన్నారు.

 

 

 

 ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె.అర్జునరావు, చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ (ఇంచార్జ్) పి.సత్యకుమారి, పర్యవేక్షణ ఇంజనీర్ (వర్క్స్) చంద్రశేఖర్, ఎస్టేట్ ఆఫీసర్ ఏ.శ్రీధర్, అకౌంట్స్ ఆఫీసర్ బి. సత్యనారాయణ మూర్తి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి.సోమశేఖర్ రెడ్డి, బయాలజిస్ట్ కామేశ్వరరావు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు జిల్లాశ్రీ ఎస్పీ వాకుల్ జిందాల్ ఐపీఎస్ గారు విద్యార్థులను కాపాడటమే లక్ష్యంగా సంకల్పం కార్యక్రమం కేఎల్ యూనివర్సిటీ లో నిర్వహించారు.
గుంటూరు  జిల్లా పోలీస్...* *తేది: 30.12.2025* _*//డ్రగ్స్ బారినుండి విద్యార్థులను కాపాడటమే...
By KOTESWARARAO KVSR 2025-12-30 12:06:46 0 303
Kerala
Kerala to Produce Local Snakebite Antivenom on World Snake Day
At a World Snake Day event, Kerala’s Forest Minister A. K. Saseendran announced a plan to...
By Bharat Aawaz 2025-07-17 08:36:02 0 1K
Telangana
సుల్తానాబాద్ : కనగర్తి లో బొడ్రాయి ఉత్సవాలు ప్రారంభం
పెద్దపల్లి మండలం కనగర్తిలో గ్రామ సుభిక్షంగా ఉండాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని బొడ్రాయి...
By Sunka Santhosh 2026-04-29 17:10:23 0 157
Telangana
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: జూన్ 2న సీఎం శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో సభాస్థలాన్ని పరిశీలించిన మాజీ డీసీసీ కొక్కిరాల విశ్వప్రసాద్ రావు
🎤కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): కొమురం భీం...
By Chunarkar Jagadeesh 2026-05-23 07:23:29 0 546
Telangana
నిజామాబాద్. Mp అరవింద్ తో జైత్య పర్యాట న
ఎంపీ అరవింద్ తో  జగిత్యాల్ ప్రయాణంలో పలుగొన్న  జ్యోతి మురళీకృష్ణ9 వ డివిజన్...
By Sadaq Sadaq 2026-03-05 17:45:54 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com