యోగి వేమన పద్యాలు సమాజానికి నైతిక విలువలు అందించాయి

0
71

విజయవాడ నగరపాలక సంస్థ

19-01-2026

 

 

 

 *వేమన పద్యాలు సమాజానికి నైతిక విలువలను అందించాయి*

 

 

 

యోగి వేమన పద్యాలు సమాజానికి నైతిక విలువలను అందించాయని విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ మరియు అదనపు కమిషనర్ జనరల్ ఏ. రవీంద్ర రావు అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద యోగివేమన జయంతి పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

 

 

 

 ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగివేమన పద్యాలు సమాజానికి నైతిక విలువలను అందించాయని, వాటిని చిన్నప్పటి నుంచే అభ్యసించడం వల్ల వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందని అన్నారు. సామాజిక సమానత్వం, మానవతా విలువలు, నిజాయితీ, కష్టపడి జీవించడం వంటి అంశాలను యోగివేమన తన పద్యాల రూపంలో తెలిపారని, ఇటువంటి విషయాలని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారు అన్నారు.

 

 

 

 ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె.అర్జునరావు, చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ (ఇంచార్జ్) పి.సత్యకుమారి, పర్యవేక్షణ ఇంజనీర్ (వర్క్స్) చంద్రశేఖర్, ఎస్టేట్ ఆఫీసర్ ఏ.శ్రీధర్, అకౌంట్స్ ఆఫీసర్ బి. సత్యనారాయణ మూర్తి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి.సోమశేఖర్ రెడ్డి, బయాలజిస్ట్ కామేశ్వరరావు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
మానవత్వంతో చలించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు * దర్శి ప్రభుత్వం ఆసుపత్రి అభివృద్ధికి కీలక అడుగు*
మానవత్వంతో చలించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు దర్శి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కీలక...
By Chennaiah Kati 2026-02-08 04:04:14 0 107
Telangana
శ్రీ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ ఈటెల రాజేందర్
మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతీక బోనాల పండుగ.. ఆషాఢ మాసంలో తొలి బోనం ను గోల్కొండ లోని శ్రీ...
By Sidhu Maroju 2025-06-26 12:38:56 0 1K
Andhra Pradesh
S.F.S స్కూల్ రోడ్డు సమస్యపై 24 గంటల్లోనే పరిష్కారం తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
పర్చూరు: పర్చూరు మండలం నాగులపాలెం గ్రామంలో S.F.S స్కూల్ మెయిన్ రోడ్డును కొత్తగా నిర్మించిన హైవే...
By Gadiyapudi Narendra 2026-02-03 16:14:46 0 80
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు మండలంలో జీవో నెంబర్ 188 అమలుకు కమిటీ.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో పంచాయతీ ఆస్తుల పరిరక్షణ కోసం జీవో నెంబర్ 188 అమలు చేయనున్నారు....
By Kothuru Murali 2026-01-14 08:54:40 0 71
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com