Chandrababu Naidu: జ్యూరిచ్ లో సీఎం చంద్రబాబుకు తెలుగువారి ఆత్మీయ స్వాగతం పలికారు.

0
191

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన సీఎం చంద్రబాబు

జ్యూరిచ్‌లో సీఎంకు ఘనంగా స్వాగతం పలికిన ప్రవాస తెలుగువారు

ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నాలుగు రోజుల పర్యటన

సీఎంతో పాటు మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్

ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్ చేరుకున్నారు. జనవరి 19, సోమవారం ఉదయం ఆయన జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకోగా, యూరప్‌లోని ప్రవాస తెలుగువారు, ఎన్నారై టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ కూడా ఉన్నారు.

 

అనంతరం జ్యూరిచ్‌లో భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "జ్యూరిచ్‌లో నాకు ఆత్మీయ స్వాగతం పలికిన తెలుగు వారికి, ఎన్నారై టీడీపీ శ్రేణులకు ధన్యవాదాలు. యూరోప్‌లోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా జ్యూరిచ్ వచ్చి నా పట్ల చూపిన అభిమానానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మన తెలుగు భాషకు, సంస్కృతికి ప్రతీకలైన మీ అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉంది," అని అన్నారు.

 

జనవరి 19 నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో 'బ్రాండ్ ఆంధ్రప్రదేశ్' ను ప్రపంచానికి పరిచయం చేసి, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు 36 సమావేశాల్లో పాల్గొననున్నారు. అంతకుముందు జ్యూరిచ్ విమానాశ్రయంలో సింగపూర్ దేశాధ్యక్షుడు షణ్ముగరత్నం, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగాతో చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం చంద్రబాబు తన ప్రతినిధి బృందంతో కలిసి రోడ్డు మార్గంలో దావోస్‌కు బయల్దేరి వెళ్లారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రంపచోడవరం ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ నారా భువనేశ్వరి పర్యటన
*For scrolling*   *అల్లూరి సీతారామరాజు జిల్లా**:   రంపచోడవరంలో ఎన్టీఆర్ ట్రస్ట్...
By Rajini Kumari 2025-12-21 14:07:46 0 249
Andhra Pradesh
చిల్లకల్లు గ్రామంలో గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ రంగుల మహోత్సవం
జగ్గయ్యపేట    కన్నుల పండువగా శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారు రంగుల మహోత్సవ...
By Rajini Kumari 2026-01-06 10:58:42 0 203
Manipur
Major Security Crackdown: 5 Insurgents Arrested
Joint security forces launched coordinated anti-insurgency operations across Manipur over the...
By Dunna Jessicaruth 2026-05-25 06:42:05 0 79
Telangana
కాంగ్రెస్‌కు గుడ్‌బై , బీఆర్ఎస్‌లోకి ?మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి
జగిత్యాల జిల్లా రాజకీయాల్లో భారీ మార్పులకు దారితీసే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దశాబ్దాలుగా...
By Ponnala Srinivasrao 2026-03-23 09:04:40 0 184
Delhi - NCR
బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ దూకుడు!!!!!!!!!!!
ఢిల్లీ: బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ దూకుడుబెట్టింగ్ ప్రమోట్‌ చేసిన సెలబ్రిటీల...
By SivaNagendra Annapareddy 2025-12-19 13:42:44 0 245
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com