Manikumar: పండుగ పూట అన్నమయ్య జిల్లాలో విషాదం.. పందెం కట్టి మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు టెక్కీలు.

0
116

అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లిలో ఘటన

పందెం కట్టి మద్యం తాగడంతో అపస్మారక స్థితిలోకి టెక్కీలు

అతిగా తాగడమే మృతికి కారణమని పోలీసుల నిర్ధారణ

కొన్ని గంటల్లోనే 19 బీర్లు తాగినట్లు గుర్తింపు

సంక్రాంతి పండుగ వేళ అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పండుగకు సొంతూరికి వచ్చిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అతిగా మద్యం సేవించి మృతిచెందారు. ఈ ఘటన కంభంవారిపల్లి మండలం బండవడ్డిపల్లెలో జరిగింది.

 

వివరాల్లోకి వెళితే.. చెన్నై, బెంగళూరులో పనిచేస్తున్న మణికుమార్ (35), పుష్పరాజ్ (26) సంక్రాంతికి తమ స్వగ్రామానికి వచ్చారు. పండుగ సందర్భంగా ఆరుగురు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో మణికుమార్, పుష్పరాజ్ ఇద్దరూ పోటీపడి మద్యం సేవించారు. దీంతో కొద్దిసేపటికే వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.

 

ఇది గమనించిన స్నేహితులు వారిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా, మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. మొదట కల్తీ మద్యం కారణంగా మరణించారని ఆరోపణలు వచ్చినా, పోలీసులు వాటిని తోసిపుచ్చారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల మధ్య ఇద్దరూ కలిసి 19 బడ్‌వైజర్ టిన్ బీర్లు తాగారని, అతిగా మద్యం తాగడం వల్ల తీవ్ర డీహైడ్రేషన్‌కు గురై మరణించారని ప్రాథమికంగా నిర్ధారించారు. పోస్టుమార్టం నివేదికలో కూడా ఇదే విషయం స్పష్టమైందని పోలీసులు తెలిపారు.

 

మృతుడు మణికుమార్‌కు భార్య, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. పుష్పరాజ్‌కు ఇంకా వివాహం కాలేదు. పండుగ రోజున యువకులు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు
*ప్ర‌చురణార్థం* *14-02-2026*   మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందుకు ఎంపీ కేశినేని...
By Rajini Kumari 2026-02-14 14:50:32 0 143
Telangana
ప్రజా సమస్యలపై జోనల్ కమిషనర్‌ను కలిసిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పలు అత్యవసర పౌర సమస్యలపై మాజీ...
By Sidhu Maroju 2026-03-16 09:28:01 0 99
Jammu & Kashmir
CBI Files Chargesheet Against Former J&K Governor Satya Pal Malik in Kiru Hydropower Corruption Case
CBI Files Chargesheet Against Former J&K Governor Satya Pal Malik in Kiru Hydropower...
By BMA ADMIN 2025-05-23 10:02:15 0 2K
Andhra Pradesh
కడపలో ఘనంగా ప్రారంభమైన శ్రీరామ శోభాయాత్ర
ఈరోజు కడప నగరంలో అయోధ్య రామ మందిరం మూడవ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా కడపలో హిందూ బంధువులు...
By Benguluri Madhubabu 2026-01-22 04:32:02 0 230
Telangana
ఆన్ లైన్ మోసానికి బలైన అల్వాల్ సీనియర్ సిటిజన్
  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  అల్వాల్ సర్కిల్‌లోని వెంకటాపురం డివిజన్‌కు...
By Sidhu Maroju 2025-08-24 10:04:35 0 491
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com