Manikumar: పండుగ పూట అన్నమయ్య జిల్లాలో విషాదం.. పందెం కట్టి మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు టెక్కీలు.

0
188

అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లిలో ఘటన

పందెం కట్టి మద్యం తాగడంతో అపస్మారక స్థితిలోకి టెక్కీలు

అతిగా తాగడమే మృతికి కారణమని పోలీసుల నిర్ధారణ

కొన్ని గంటల్లోనే 19 బీర్లు తాగినట్లు గుర్తింపు

సంక్రాంతి పండుగ వేళ అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పండుగకు సొంతూరికి వచ్చిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అతిగా మద్యం సేవించి మృతిచెందారు. ఈ ఘటన కంభంవారిపల్లి మండలం బండవడ్డిపల్లెలో జరిగింది.

 

వివరాల్లోకి వెళితే.. చెన్నై, బెంగళూరులో పనిచేస్తున్న మణికుమార్ (35), పుష్పరాజ్ (26) సంక్రాంతికి తమ స్వగ్రామానికి వచ్చారు. పండుగ సందర్భంగా ఆరుగురు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో మణికుమార్, పుష్పరాజ్ ఇద్దరూ పోటీపడి మద్యం సేవించారు. దీంతో కొద్దిసేపటికే వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.

 

ఇది గమనించిన స్నేహితులు వారిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా, మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. మొదట కల్తీ మద్యం కారణంగా మరణించారని ఆరోపణలు వచ్చినా, పోలీసులు వాటిని తోసిపుచ్చారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల మధ్య ఇద్దరూ కలిసి 19 బడ్‌వైజర్ టిన్ బీర్లు తాగారని, అతిగా మద్యం తాగడం వల్ల తీవ్ర డీహైడ్రేషన్‌కు గురై మరణించారని ప్రాథమికంగా నిర్ధారించారు. పోస్టుమార్టం నివేదికలో కూడా ఇదే విషయం స్పష్టమైందని పోలీసులు తెలిపారు.

 

మృతుడు మణికుమార్‌కు భార్య, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. పుష్పరాజ్‌కు ఇంకా వివాహం కాలేదు. పండుగ రోజున యువకులు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Search
Categories
Read More
Sports
నకిలీ క్రీడా సంఘాలు – టోర్నమెంట్లపై నాయకులు అవగాహన పెంచుకోవాలి
మంచిర్యాల : రాష్ట్రంలో మరియు జిల్లాల్లో కొన్ని నకిలీ క్రీడా సంఘాలు అధికారిక గుర్తింపు లేకుండానే...
By Avunoori Mahesh 2026-06-10 05:22:12 0 199
Andhra Pradesh
చీరాల–చిలకలూరిపేట మార్గంలో టోల్ ప్లాజా ప్రారంభం – వాహనదారులకు సూచన
చీరాల నుంచి చిలకలూరిపేటకు వెళ్లే మార్గంలో పర్చూరు సమీపంలో ఉన్న టోల్ ప్లాజాను ఈరోజు...
By Vadlamudi NagaVenkat 2026-03-06 04:21:34 0 343
Andhra Pradesh
మహిళల భద్రతే మంత్రి రాంప్రసాద్ రెడ్డి లక్ష్యం టిడిపి రాయచోటి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్
అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని దిగువ అబ్బవరం గ్రామ సచివాలయంలో మంగళవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో...
By Benguluri Madhubabu 2026-06-02 07:56:08 0 153
Andhra Pradesh
పరిశీలిస్తున్న మంత్రాలయం నియోజకవర్గం ఇన్చార్జి ఎన్ రాఘవేందర్ రెడ్డి
తుంగభద్ర నదిలో ప్రమా *దవ *శాత్తు మృ *తి చెందిన వారి మృ *త దే హాలను పోలీస్ శాఖ సహాయంతో కుటుంబ...
By Boya Dasthagiri 2026-03-28 00:55:46 0 298
SURAKSHA
Sharat Chauhan, IAS: Leading Puducherry with Vision
A Distinguished Civil Servant Driving Good Governance and Administrative Excellence in Puducherry...
By Lokeshwari Panthadi 2026-07-17 05:08:24 0 40
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com