యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : టీజీ వెంకటేష్

0
175

కర్నూలు : కర్నూలు సిటీ : 

*

యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం-మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్

క్రీడల అభివృద్ధికి కృషి చేస్తూ యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు.
స్థానిక ఎస్టిబిసి కళాశాల మైదానంలో  టిజిబి, లక్కీ టు వెంకటేశ్వర్లు యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో క్రీడలు అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టమన్నారు.  క్రికెట్ పోటీలలో  80 జట్లు పాల్గొనడం విశేషం అన్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించడమే ధ్యేయంగా టీజీబి,లక్కీ టు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి, తన తనయుడు టీజీ భరత్ పేరు మీద మొదటి బహుమతిగా లక్ష రూపాయలు, రెండవ బహుమతిగా 50వేల రూపాయలను నిర్వాహకులు ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత క్రీడల్లో పాల్గొనడం వల్ల చెడు అలవాట్లకు దూరంగా క్రమశిక్షణ గల పౌరులుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి వారు ఎంచుకున్న రంగాలలో మరింత రాణించేందుకు అవకాశం ఉంటుందని టీజీ తెలిపారు. అలాగే క్రీడల్లో పాల్గొని గెలుపు ఓటములను సమానంగా స్వీకరించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకునే శక్తి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పోటీల నిర్వాహకుడు లక్కీ టు గోపి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన నిందితుడు రియాజ్ పోలీసులకు దొరికిండు.
హైదరాబాద్:  నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసి పరారైన రియాజ్ పోలీసులకు...
By Sidhu Maroju 2025-10-19 12:55:17 0 290
SURAKSHA
Visionary in Governance: The Inspiring Journey of IAS Mandip Singh Brar
Redefining Public Service: How Mandip Singh Brar Championed Citizen-Centric Administration...
By Kalaga Sailaja 2026-07-22 11:35:49 0 30
Andhra Pradesh
శ్రీ వీరుపాక్షి మారెమ్మ ఆలయంలో రాహుకాల పూజలు, అన్నదానం
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం శ్రీ వీరుపాక్షి మారెమ్మ ఆలయంలో రాహుకాలంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో...
By Kothuru Murali 2026-06-13 15:47:24 0 84
Telangana
పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత
చిలుకూరు మండల బేతవోలు గ్రామo సబ్ స్టేషన్ పరిధిలో 21.05.2026 నా చేన్నారి గూడెం, ఆచర్లగూడెం,...
By Nookapangu Manikanta 2026-05-20 12:26:26 0 175
Andhra Pradesh
హార్సిలీహీల్స్ ఘాట్ రోడ్డులో టాటా ఏస్ బోల్తా.. పలువురికి గాయాలు.
మదనపల్లె నుంచి ఆదివారం 10 మంది కుటుంబ సభ్యులతో హార్సిలీహీల్స్ సందర్శనకు వెళ్లిన టాటా ఏస్ వాహనం,...
By Pagadala Venkateswar 2026-03-23 05:52:03 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com