ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోట్ల !!

0
162

కర్నూలు : నంద్యాల : డోన్ :

డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన మొత్తం *రూ.31,38,412/-* (అక్షరాలా ముప్పై ఒక లక్షల ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల పన్నెండు రూపాయలు )విలువైన చెక్కులను గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,గడచిన 15 నెలల కాలంలో డోన్ నియోజకవర్గ పరిధిలోని ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని గౌరవ శాసనసభ్యులు తెలిపారు. ఈ కాల వ్యవధిలో నియోజకవర్గానికి చెందిన మొత్తం 390 మంది లబ్ధిదారులకు రూ.4,02,49,951/-(అక్షరాల నాలుగు కోట్ల రెండు లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఒకటి రూపాయలు)విలువైన ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే గారు వెల్లడించారు.

ఆరోగ్య చికిత్సలు, అత్యవసర వైద్య అవసరాలు, ప్రమాదాలు మరియు ఇతర సంక్షేమ కారణాల నిమిత్తం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ఉపశమనం కలిగించిందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న దానికి ఇది నిదర్శనమని ఎమ్మెల్యే గారు అన్నారు.

భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం అందేలా తగిన చర్యలు తీసుకుంటామని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Bihar
Prashant Kishor Challenges Rahul Gandhi to Spend a Night in Bihar Village
Patna: Jan Suraaj leader Prashant Kishor has targeted Congress MP Rahul Gandhi, challenging him...
By Bharat Aawaz 2025-06-27 09:54:45 0 2K
Andhra Pradesh
విషాదం: ఆటో నడుపుతూనే గుండెపోటుతో డ్రైవర్ మృతి.
అన్నమయ్య జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మదనపల్లి కోటవీధికి చెందిన ఆటో డ్రైవర్ లక్ష్మణరావు,...
By Pagadala Venkateswar 2026-03-07 09:29:09 0 163
Andhra Pradesh
ఇంధనాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్.
స్టాక్ ఉంచుకుని 'నో స్టాక్' బోర్డులు పెట్టే బంకులపై కఠిన చర్యలకు మంత్రి ఆదేశాలు  ఆక్వా, వరి...
By Pagadala Venkateswar 2026-04-30 04:50:08 0 107
Andhra Pradesh
స్వర్ణం వార్డు-స్వర్ణ సచివాలయాలు
ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయా పేరు ను అధికారికంగా మార్చింది.ఇక నుంచి స్వర్ణ...
By Karapati Gopi 2025-12-30 01:02:52 0 291
Andhra Pradesh
ఉత్తరాంధ్రలో జోరుగా సంక్రాంతి సంబరాలు
ఈ రోజు సంక్రాంతి  పండుగ లో విశాఖ పట్నం .శ్రీకాకుళం.విజయ నగరం ఉమ్మడి జిల్లాలలో...
By Mobbu Venkatramana 2026-01-15 05:50:33 0 587
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com