ప్రాణ రక్షణే లక్ష్యం- అల్వాల్ లో మార్మోగిన "అరైవ్ అండ్ అలైవ్" నినాదం .|

0
186

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన _అరైవ్_అండ్_అలైవ్ (arrive and alive) కార్యక్రమంలో భాగంగా అల్వాల్ పోలీస్ యంత్రాంగం భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించింది.

అల్వాల్ లాఅండ్ ఆర్డర్ (L&O) పోలీసు మరియు ట్రాఫిక్ విభాగాల ఆధ్వర్యంలో ఉమ్మడిగా జరిగిన ఈ కార్యక్రమం.. అల్వాల్ పోలీస్ స్టేషన్, జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయం,  మరియు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణాల్లో జరిగింది. 

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి సిబ్బంది, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, పారామెడికల్ వైద్యులతో పాటు  అల్వాల్ పోలీస్ సిబ్బంది భారీ ఎత్తున పాల్గొన్నారు.

నిత్యం పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని, వాహనదారులు పాటించాల్సిన ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ మరియు సీటు బెల్టు ధరించడం యొక్క ప్రాముఖ్యతను అధికారులు వివరించారు.

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించకుండా బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరిస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ప్రతిజ్ఞ (Oath) చేశారు. 

 ఈ సందర్భంగా అల్వాల్ ఎస్ హెచ్ ఓ ప్రశాంత్ మాట్లాడుతూ.. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, నియమాలను పాటించడం వల్ల ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని తెలిపారు. 

ఈ ప్రచార కార్యక్రమానికి సహకరించిన అన్ని విభాగాల అధికారులకు, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. 

#sidhumaroju 

Search
Categories
Read More
Kerala
Thiruvananthapuram: Prime Minister Narendra Modi inaugurated the Vizhinjam International Seaport
Thiruvananthapuram: Prime Minister Narendra Modi on Friday inaugurated the Vizhinjam...
By BMA ADMIN 2025-05-20 05:01:14 0 2K
Andhra Pradesh
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణం: సీఐ
కాకినాడ నగరంలో ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించినప్పుడే సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని...
By Ratna Sekhar 2026-02-19 19:34:00 0 894
Andhra Pradesh
Chandrababu Naidu: ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ... రాష్ట్రంలో భారీగా భూ కేటాయింపులు... పరిశ్రమలు, విద్యాలయాలకు పెద్దపీట.
      Chandrababu Naidu: ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ... రాష్ట్రంలో భారీగా భూ...
By Pagadala Venkateswar 2026-03-13 12:54:18 0 118
Telangana
అందరి భాగస్వామ్యంతో అమలు చేయాలి: మంచిర్యాల కలెక్టర్
'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక '99 రోజుల కార్యచరణము అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పకడ్బందీగా...
By Bonagiri RaviShankar 2026-05-23 02:59:45 0 69
Telangana
75 సంవత్సరాల డైమండ్ జూబ్లి వేడుకలు
కౌకుంట్ల మండలం లోనీ పేరూరు గ్రామంలో ఉన్నటువంటి ZPHS HIGH SCHOOL  నేటికీ 75 సంవత్సరాలు పూర్తి...
By Dodla Nagaraju 2026-04-19 13:07:52 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com