క్షేమంగా వెళ్ళి రండి: మహబూబాబాద్ సి‌ఐ మహేందర్ రెడ్డి

0
357

 

మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్, రవాణా శాఖ సంయుక్త, ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ డాక్టర్ శబరీష్, ల పిలుపుమేరకు జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత మాస ఉత్సవాలు, రోడ్డు భద్రత ట్రాఫిక్ రూల్స్ నిబంధన పై ప్రతి ఒక్కరిలో అవగాహన కార్యక్రమాలు, ప్రచారం నిర్వహించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని  సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే కలెక్టరేట్ ప్రాంగణంలోని అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. క్షేమం ఒకటే కాదు ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు ప్రతి ఒక్కరి బాధ్యత అని అందరూ పక్కాగా పాటిస్తూ ఎదుటి వారికి కూడా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని, మనము మన కుటుంబం పిల్లలకు ట్రాఫిక్ రూల్స్ నిబంధనలపై వివరించాలని సూచించారు. ఉద్యోగానికి లేదా ఇతర ప్రయాణాలు చేసే ముందు వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, కలెక్టరేట్లో అన్ని విభాగాల శాఖ అధికారులు వారి వారి క్షేత్రస్థాయి సిబ్బంది అందరికీ ప్రత్యేక సర్కులర్ జారీ చేసి నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని,నో పార్కింగ్ జోన్ లో వాహనాలు పార్కింగ్ చేయకూడదని, ట్రాఫిక్ సిగ్నల్స్ ,రోడ్డు భద్రత సింబల్స్ నిషితంగా పరిశీలించి వాహనం నడపాలని, అతివేగంతో ప్రయాణం చేయకూడదని, పాదచారులు రోడ్డు దాటే క్రమంలో నిబంధనలు పాటించాలని సూచించారు. అనంతరం క్షేమంగా చేరుకోండి... క్షేమంగా జీవించండి... అనే పోస్టర్ను ఆవిష్కరించారు.ట్రాఫిక్ రూల్స్ నిబంధనలపై జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి దేశీ రామ్ నాయక్, ఉద్యానవన శాఖ అధికారి జి. మరియన్న, డిపిఆర్ఓ పి. రాజేంద్రప్రసాద్, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, మందుల శ్రీరాములు, వెంకటేశ్వర్లు, సంతోష్, ఎస్ఐలు అరుణ్ కుమార్, ప్రశాంత్, కలెక్టరేట్ సిబ్బంది ఏ.రవీందర్, నరేష్ రెడ్డి, ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
PMAY-G: ఏపీకి కేంద్రం తీపికబురు.. ఇకపై ఒక్కో ఇంటికి రూ.2.39 లక్షలు.
ఏపీలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన...
By Pagadala Venkateswar 2026-03-17 03:58:40 0 130
Andhra Pradesh
విజయవాడ లెనిన్ సెంటర్ లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
Breaking...   విజయవాడ లెనిన్ సెంటర్ లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన...
By Rajini Kumari 2026-01-11 09:50:13 0 153
Andhra Pradesh
జగ్గయ్యపేట పట్టణంలోని పదవ వార్డ్ చిరు నగర్ లో పెన్షన్ల పంపిణీ
ప్రెస్ నోట్ తేదీ: 31.12.2026   జగ్గయ్యపేట పట్టణంలోని 10వ వార్డు, చిరునగర్‌లో...
By Rajini Kumari 2026-01-31 10:47:11 0 169
Telangana
ప్రశాంతంగా చేప ప్రసాదం పంపిణీ
మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని హరినాథ్ కుటుంబం, ఎగ్జిబిషన్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో...
By Sidhu Maroju 2025-06-10 10:16:37 0 1K
Andhra Pradesh
కువైట్ లో మినీ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు
కువైట్ లోని అబ్బాసియా ప్రాంతంలో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమానికి రాజంపేట పార్లమెంటు టిడిపి...
By Benguluri Madhubabu 2026-05-16 11:45:53 0 71
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com