ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్ల మోసాలు : కర్నూలు ఎస్పీ

0
191

కర్నూలు : కర్నూలు జిల్లా :

ప్రభుత్వ పథకాల పేరుతో  సైబర్‌ నేరగాళ్ల మోసాలు...

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

మోసపోవడానికి ప్రధాన కారణం.... అత్యాశ, అశ్రద్ద...మోసగాళ్ళ మాటలు నిజమని నమ్మకండి.

పథకాల పేరుతో వచ్చే  తెలియని  ఫేక్ లింకులను క్లిక్‌ చేయవద్దు.

బ్యాంకు ఖాతాల ఓటిపిలు చెబితే మోసపోతారు... జాగ్రత్త!

...డీఐజీ , కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ  శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ !! 

ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్‌, ముద్ర లోన్స్‌, సూర్యఘర్‌, అమ్మవడి వంటి పథకాల పేరుతో  సోషల్ మీడియాలో  ఫేక్ లింకులను పంపి సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఐజీ , కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ  శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు శుక్రవారం తెలిపారు. 

‘ఇది  ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. మీకు రూ. లక్షలలో  రాయితీ’ అంటూ ఆకర్షించి ఖాతాలను కొల్లగొడుతున్నారు.

ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారిని ఎంచుకొని మోసాలకు పాల్పడుతున్నారని,  ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. 

ఆయా పథకాల పేరుతో మొబైల్ కు వచ్చే తెలియని , ఫేక్ల్ లింకులను క్లిక్‌ చేయవద్దన్నారు. 

ఓటీపీలు చెబితే మోసపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.
 

డిఐజి ,  జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ గారి  సూచనలు...

- అపరిచిత లింకులను నమ్మవద్దు.

-  ప్రభుత్వ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించాలి. 

- వ్యక్తిగత సమాచారం షేర్‌ చేయవద్దు. బ్యాంక్‌ ఖాతా వివరాలు, ఓటీపీ, పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దు.

- అపరిచిత కాల్స్‌ వస్తే 1930 నంబరుకు కాల్‌ చేయాలి. అదేవిధంగా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలి.

- ఇలాంటి మోసాల గురించి కుటుంబసభ్యులు, స్నేహితులకు తెలియజేసి సైబర్‌ మోసాల బారిన పడకుండా అవగాహన పెంచాలి.

- ప్రభుత్వ పథకాల సమాచారం కోసం www.gov.in, nic.in లాంటి అధికారిక డొమైన్‌లను మాత్రమే ఉపయోగించాలి అని ఒక ప్రకటనలో తెలియజేశారు

Search
Categories
Read More
Telangana
న్యూయర్ ఫీవర్.. మీటర్ దాటితే జైలుకే..! వాహనదారులకు మాస్ వార్నింగ్!
న్యూయర్ వేడుకల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తూ, హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని వాహనదారులకు...
By SivaNagendra Annapareddy 2025-12-25 06:32:33 0 585
Andhra Pradesh
జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా. డీఎస్ఓ ను వెంటనే సస్పెండ్ చేయాలి - బీఎస్పీ డాక్టర్ గుదే రాజారావు డిమాండ్.
బాపట్ల బాపట్ల జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని, దీనికి...
By Vadlamudi NagaVenkat 2026-04-10 09:59:39 0 146
Andhra Pradesh
కర్నూలు జిల్లాలో దారుణం !!
కర్నూలు :  కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామంలో దారుణ హత్య చోటుచేసుకుంది. మరిది...
By Hari Krishna 2025-12-22 08:21:47 0 232
Lakshdweep
Lakshadweep Drives Livelihood Push for Women’s Empowerment
The Lakshadweep administration has launched a series of dynamic welfare initiatives in the final...
By Lokeshwari Panthadi 2026-06-30 09:57:25 0 116
Andhra Pradesh
శ్రద్ధాంజలి ఘటించిన రవాణా శాఖ మంత్రి
కరిమిరెడ్డి ప్రీతి మృతదేహానికి నివాళులు అర్పించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి...
By Benguluri Madhubabu 2026-01-14 07:54:50 1 917
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com