జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా. డీఎస్ఓ ను వెంటనే సస్పెండ్ చేయాలి - బీఎస్పీ డాక్టర్ గుదే రాజారావు డిమాండ్.

0
110

బాపట్ల

బాపట్ల జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని, దీనికి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నిర్లక్ష్యమే ప్రధాన కారణమని బహుజన సమాజ్ పార్టీ బాపట్ల పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ గుదే రాజారావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న బియ్యం దందాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజారావు మాట్లాడుతూ,పేద ప్రజలకు కిలో రూపాయి లేదా రెండు రూపాయలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని మధ్యవర్తులు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.పేదల వద్ద నుండి కేవలం ₹10లకే బియ్యాన్ని సేకరించి, వాటిని రైస్ మిల్లర్లకు కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలిస్తూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారని పేర్కొన్నారు. ఇంత భారీ స్థాయిలో అక్రమ రవాణా జరుగుతున్నా డీఎస్ఓ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేమిటని ప్రశ్నించారు. ఇది అధికారుల పనితీరుకే నిదర్శనమని, ముఖ్యమంత్రి ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని స్థితిలో అధికారులు ఉన్నారని విమర్శించారు. రేషన్ బియ్యం మాఫియాను అరికట్టడంలో విఫలమైనందుకు రైస్ మిల్లర్లతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలపై ఈ క్రింది చర్యలు తీసుకోవాలని రాజారావు డిమాండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన బాపట్ల జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలి. ఈ దందాపై విజిలెన్స్ లేదా సిఐడి ద్వారా సమగ్ర విచారణ జరిపించాలి. పేదల బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసే మధ్యవర్తులను, సహకరిస్తున్న రైస్ మిల్లర్లను కఠినంగా శిక్షించాలి. పేదల ఆహార హక్కులపై జరుగుతున్న ఈ దాడిని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని, ప్రభుత్వం స్పందించి తక్షణమే విచారణకు ఆదేశించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నరసింహారెడ్డి పోరాటం యువతకు స్ఫూర్తి: డీఆర్వో.
బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన తొలి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం...
By Pagadala Venkateswar 2026-02-22 11:29:02 0 100
Telangana
బాబోయ్ ఇప్పటికే చలి చంపేస్తుంది.. మరీ రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
తెలంగాణలో రోజురోజుకూ చలి తీవ్రత పెరిగిపోతుంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు...
By SivaNagendra Annapareddy 2025-12-23 06:59:46 0 229
Andhra Pradesh
అసౌకర్యంగా మేకల సంత - ఇబ్బందులు పడుతున్న రైతులు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామం "శ్రీ రాజా వత్సవాయి బుచ్చి...
By BABJI DADALA 2025-12-23 09:32:13 0 2K
Telangana
స్టడీ సర్కిల్ లో పోటీ పరీక్షల ఉచిత శిక్షణకు దరఖాస్తులకు ఆహ్వానం... అదన కలెక్టర్ నాగేష్.
మెదక్ గ్రూప్ 1,2,3,4, ఆర్ ఆర్ బి, ఎస్ఐ , కానిస్టేబుల్, ఎస్ ఎస్ సి తదితర పోటీ పరీక్షలకు స్థానిక...
By Gangaram Rangagowni 2026-01-24 08:50:28 0 338
Telangana
దారుణంగా మరణం....
మహబూబాబాద్ జిల్లా: తొర్రూర్ పట్టణ శివారులో దారుణ ఘటన చోటుచేసుకుంది. అమపురం గ్రామానికి చెందిన...
By Gujile Ramu 2026-04-28 07:00:56 0 199
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com