రాజకీయాలకు విరామం - కుటుంబంతో పండగ సంబరం.|
Posted 2026-01-15 14:28:14
0
240
హైదరాబాద్ : బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో సంక్రాంతి సంబరాలను, తన సతీమణి శోభమ్మ, కుమారుడు కేటీఆర్, కోడలు శైలిమ, తన మనవడు హిమాన్షు, మనవరాలు అలేఖ్య తో కలిసి ఘనంగా జరుపుకున్నారు.
ఫామ్ హౌస్ ప్రాంగణాన్ని గొబ్బెమ్మలు, నవధాన్యాలు మరియు చెరుకు గడలతో సాంప్రదాయబద్ధంగా అలంకరించారు. రంగవల్లులతో నిండిన ఫామ్ హౌస్ పల్లెటూరి వాతావరణాన్ని తలపించింది.
గత పండుగలకు విరుద్ధంగా ఎర్రవల్లి వేడుకలకు కెసిఆర్ కూతురు కవిత దూరంగా ఉన్నట్టు తెలిసింది.
ఈ సందర్భంగా కెసిఆర్ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
తన పదేళ్ల పాలనలో తెలంగాణలో సాధించిన వ్యవసాయ పురోగతిని ఆయన గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం మళ్ళీ సుభిక్షంగా మారి, రైతుల జీవితాల్లో వెలుగు నింపాలని ఈ సందర్భంగా కోరుకున్నారు.
#sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మహాత్మా జ్యోతి రావు పూలె జయంతి సందర్బంగా సింగరేణి జిఎం కార్యాలయంలో కార్మికులకు వ్యాసరచన పోటీలు
ఈ నెల 11వ తేదీ శనివారం రోజున మహనీయుడు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా, ఉత్సవాలను ఘనంగా...
ఆటలతో ఉద్యోగులలో మానసిక స్థైరం: కమిషనర్
కర్నూలు : కర్నూలు సిటీ :
క్రీడలతో ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసం• నగరపాలక సంస్థ కమిషనర్...
విజయ్ని అభినందించిన ఏపీ సీఎం చంద్రబాబు.
తమిళనాడు ఎన్నికల్లో గెలిచిన విజయ్కు చంద్రబాబు శుభాకాంక్షలు
సోషల్ మీడియా వేదికగా అభినందనలు...
నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్.
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గుంటూరు నగర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర, సంక్రాంతి...
అన్నమయ్య జిల్లా: బురదలో చిక్కుకొని ఇద్దరు చిన్నారులు మృతి.
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం పట్రపల్లి తండాలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది....