రాజకీయాలకు విరామం - కుటుంబంతో పండగ సంబరం.|

0
202

హైదరాబాద్ : బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో సంక్రాంతి సంబరాలను, తన సతీమణి శోభమ్మ, కుమారుడు కేటీఆర్, కోడలు శైలిమ, తన మనవడు హిమాన్షు, మనవరాలు అలేఖ్య తో  కలిసి ఘనంగా జరుపుకున్నారు. 

ఫామ్ హౌస్ ప్రాంగణాన్ని గొబ్బెమ్మలు, నవధాన్యాలు మరియు చెరుకు గడలతో సాంప్రదాయబద్ధంగా అలంకరించారు. రంగవల్లులతో నిండిన ఫామ్ హౌస్ పల్లెటూరి వాతావరణాన్ని తలపించింది.

గత పండుగలకు విరుద్ధంగా ఎర్రవల్లి వేడుకలకు కెసిఆర్ కూతురు కవిత దూరంగా ఉన్నట్టు తెలిసింది.

 ఈ సందర్భంగా కెసిఆర్ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

 తన పదేళ్ల పాలనలో తెలంగాణలో సాధించిన వ్యవసాయ పురోగతిని ఆయన గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం మళ్ళీ సుభిక్షంగా మారి, రైతుల జీవితాల్లో వెలుగు నింపాలని ఈ సందర్భంగా కోరుకున్నారు.

#sidhumaroju 

Search
Categories
Read More
Telangana
ప్రధాని సభను విజయవంతం చేయండి, పారేపల్లి మహేష్
రేపు జరగబోయే ఛలో పరేడ్ గ్రౌండ్ విశ్వ గురువు ప్రధాని నరేంద్ర మోడీ సభ తో రాష్ట్రానికి పదివేల కోట్ల...
By Nookapangu Manikanta 2026-05-09 09:26:31 0 76
Telangana
"అల్వాల్ వెంకటేశ్వర నగర్‌లో భక్తి పారవశ్యంతో హనుమాన్ జయంతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ డివిజన్ పరిధిలోని వెస్ట్ వెంకటాపురం వెంకటేశ్వర నగర్ కాలనీలో గల...
By Sidhu Maroju 2026-05-12 09:38:49 0 101
Andhra Pradesh
పలమనేరులో విద్యార్థులతో డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ
2026 ఏప్రిల్ 21, మంగళవారం పలమనేరు నియోజకవర్గంలో జిల్లా ఎస్పీ తుషార్ డుడి ఆదేశాల మేరకు, డీఎస్పీ...
By Kothuru Murali 2026-04-21 15:05:56 0 68
Telangana
చారిత్రాత్మక బొల్లారం స్టేషన్ కు మహర్దశ- ఎంపి చొరవతో నిలిచిన రాయలసీమ ఎక్స్ ప్రెస్.|
హైదరాబాద్ (బొల్లారం): మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని చారిత్రాత్మక బొల్లారం రైల్వే స్టేషన్...
By Sidhu Maroju 2026-02-21 05:03:03 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com