రాజకీయాలకు విరామం - కుటుంబంతో పండగ సంబరం.|
Posted 2026-01-15 14:28:14
0
242
హైదరాబాద్ : బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో సంక్రాంతి సంబరాలను, తన సతీమణి శోభమ్మ, కుమారుడు కేటీఆర్, కోడలు శైలిమ, తన మనవడు హిమాన్షు, మనవరాలు అలేఖ్య తో కలిసి ఘనంగా జరుపుకున్నారు.
ఫామ్ హౌస్ ప్రాంగణాన్ని గొబ్బెమ్మలు, నవధాన్యాలు మరియు చెరుకు గడలతో సాంప్రదాయబద్ధంగా అలంకరించారు. రంగవల్లులతో నిండిన ఫామ్ హౌస్ పల్లెటూరి వాతావరణాన్ని తలపించింది.
గత పండుగలకు విరుద్ధంగా ఎర్రవల్లి వేడుకలకు కెసిఆర్ కూతురు కవిత దూరంగా ఉన్నట్టు తెలిసింది.
ఈ సందర్భంగా కెసిఆర్ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
తన పదేళ్ల పాలనలో తెలంగాణలో సాధించిన వ్యవసాయ పురోగతిని ఆయన గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం మళ్ళీ సుభిక్షంగా మారి, రైతుల జీవితాల్లో వెలుగు నింపాలని ఈ సందర్భంగా కోరుకున్నారు.
#sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నరీస్ తో లోకేష్ బేటి
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో మంత్రి లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ...
నూతన సంవత్సరలో వేడుకల్లో పాల్గొన్న కోడుమూరు ఎమ్మెల్యే:
కర్నూలు : కోడుమూరు : 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కోడుమూరు నియోజకవర్గానికి చెందిన...
మద్రాస ఫౌండేషన్ నిర్మాణం !!
కర్నూలు : డోన్ : ద్రోణాచలం :
ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్...
Gir Lions: Heat, Not Disease, Killed 8 Cubs
Gujarat officials confirmed that extreme heat, not disease, killed eight Asiatic lion cubs in the...
Shri K. Surendra Mohan, IAS: Driving Farm Reforms
From district administration to the corridors of the Telangana Secretariat, Shri K. Surendra...