వివాహిత అనుమానాస్పద మృతి

0
247

భారత్ ఆవాజ్ 

సూర్యమోహన్ మద్దూర్ మండల రిపోర్టర్ 

 

 

వివాహిత అనుమానాస్పద మృతి

 

 

నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట తండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.ఎర్రగుంట తండాకు చెందిన కవిత అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.కవిత మరణం వెనుక తన భర్త వశ్యనాయక్ హస్తం ఉందని ఆయనే తమ కుమార్తెను హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అయితే తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని ఇక్కడి నుండి తరలించడానికి వీల్లేదంటూ మృతురాలి బంధువులు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.పోలీసులను అడ్డుకుంటూ ఘటన స్థలంలోనే బైఠాయించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.పోలీసులు మృతురాలి బంధువులకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కవిత మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
తాడిపత్రి లో బైక్ ర్యాలీ
తాడిపత్రి పట్టణం లో హనుమాన్ జయంతి సందర్భంగా హిందూసోదరులు బైక్ ర్యాలీ నిర్వహించారు . ఇందులో ఆర్...
By Gitta Raju 2026-04-03 01:06:31 0 316
Andhra Pradesh
పెద్దమండ్యం చెరువు కట్టపై కోళ్ల వ్యర్థాలు.
మదనపల్లె–తంబళ్లపల్లె మార్గంలోని పెద్దమండ్యం బస్టాండ్ సమీప చెరువు కట్ట వద్ద కోళ్ల వ్యర్థాలను...
By Pagadala Venkateswar 2026-07-08 11:25:01 0 45
Andhra Pradesh
పుంగనూరులో వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
పుంగనూరు పట్టణంలోని నానాసాహెబ్‌పేటకు చెందిన బాబా కుమారుడు అహ్మద్ భాషా (46) ఆటో డ్రైవర్ గా...
By Kothuru Murali 2026-06-24 17:10:47 0 73
Uttarkhand
Uttarakhand Strengthens Disaster and Climate Resilience
Uttarakhand has intensified its focus on disaster management and climate resilience to address...
By Fathima Safa 2026-06-16 12:06:03 0 64
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణం ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీ
పుంగనూరు పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,...
By Kothuru Murali 2026-03-15 10:20:42 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com