వివాహిత అనుమానాస్పద మృతి

0
110

భారత్ ఆవాజ్ 

సూర్యమోహన్ మద్దూర్ మండల రిపోర్టర్ 

 

 

వివాహిత అనుమానాస్పద మృతి

 

 

నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట తండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.ఎర్రగుంట తండాకు చెందిన కవిత అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.కవిత మరణం వెనుక తన భర్త వశ్యనాయక్ హస్తం ఉందని ఆయనే తమ కుమార్తెను హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అయితే తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని ఇక్కడి నుండి తరలించడానికి వీల్లేదంటూ మృతురాలి బంధువులు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.పోలీసులను అడ్డుకుంటూ ఘటన స్థలంలోనే బైఠాయించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.పోలీసులు మృతురాలి బంధువులకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కవిత మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Search
Categories
Read More
Telangana
CSB బ్యాంక్ నూతనశాఖ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లి లో CSB బ్యాంకు నూతన శాఖను బ్యాంకు...
By Sidhu Maroju 2026-01-05 07:25:38 0 153
Andhra Pradesh
44వ జాతీయ స్థాయి యోగాసన ఛాంపియన్ షిప్ 2025ను జయప్రదం చేద్దాం...
44వ జాతీయ స్థాయి యోగాసన ఛాంపియన్ షిప్ ...2025ను జయప్రదం చేద్దాం. బాపట్ల శాసనసభ్యులు...
By Gadiyapudi Narendra 2025-12-23 09:46:51 0 450
Andhra Pradesh
ఎంఎస్ బేగ్ ని కలిసిన నవ్యాంధ్ర రచయిత సంఘం నాయకులు
*ఎంఎస్ బేగ్ ను కలిసిన నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు*   విజయవాడ పశ్చిమ ఫిబ్రవరి 21 :...
By Rajini Kumari 2026-02-21 17:11:58 0 110
Telangana
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరిపించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
*ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం..మర్రి రాజశేఖర్ రెడ్డి* తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా...
By Vadla Egonda 2025-06-02 12:00:17 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com