జరిగింది దురదృష్టకరమైన సంఘటన- ఎంఎల్ఏ.|

0
230

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి శాసనసభ్యులు  మర్రి రాజశేఖర్ రెడ్డి  సఫిల్ గూడ శ్రీ విజయ దుర్గ కట్ట మైసమ్మ దేవాలయం వద్ద ఇటీవల జరిగిన దుర్చర్యపై తీవ్రంగా స్పందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. ఇటువంటి అరాచక చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులతో చర్చించామని తెలిపారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాద కోణం ఉందా? లేక ఇతర దురుద్దేశంతో జరిగిందా? అన్న అంశాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డీసీపీ శ్రీధర్ తో మాట్లాడినట్లు పేర్కొన్నారు. 

ప్రజలందరూ ఈ సమయంలో సమన్వయంతో, ఐక్యతతో ముందుకు సాగాలని, భావోద్రేకాలకు లోనయ్యే సమయం కాదని ఎమ్మెల్యే  సూచించారు.

 దేవాలయాలు, ధార్మిక స్థలాలపై ఎలాంటి దాడులు లేదా దుర్చర్యలు జరిగితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రజల శాంతి భద్రతలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం, పోలీస్ శాఖ తీసుకోవాలని ఆయన స్పష్టంగా తెలిపారు. ఇటువంటి ఘటనలు జరగడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.

#sidhumaroju 

Search
Categories
Read More
SURAKSHA
Maharashtra Police Launch Digital Citizen-Centric Portal
The Maharashtra Police are revolutionizing public governance by transitioning vital...
By Lokeshwari Panthadi 2026-07-04 08:02:30 0 60
Andhra Pradesh
చిల్లపల్లి శ్రీనివాస్ జన్మదినం: అన్నదానం చేసిన జనసేన నాయకులు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం నీరుగుట్టువారిపల్లిలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస...
By Pagadala Venkateswar 2026-02-11 11:22:30 0 151
SURAKSHA
Solomon Arokiaraj, IAS: Leading Good Governance
A Distinguished Civil Servant Committed to Transparent Administration, Infrastructure...
By Lokeshwari Panthadi 2026-07-13 11:01:15 0 80
Andhra Pradesh
అనిల్ రావిపూడి కామెంట్స్
మన శంకర్ వరప్రసాద్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడకి వచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి...  ...
By Rajini Kumari 2025-12-30 10:51:48 0 216
Andhra Pradesh
వాట్సాప్ ద్వారా సేవలు : కర్నూలు డిఐజీ
కర్నూలు :కర్నూలు జిల్లా...వాట్సాప్ గవర్నెన్స్  ‘మన మిత్ర’లో  FIR...
By Hari Krishna 2026-01-06 00:04:49 0 235
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com