జరిగింది దురదృష్టకరమైన సంఘటన- ఎంఎల్ఏ.|

0
172

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి శాసనసభ్యులు  మర్రి రాజశేఖర్ రెడ్డి  సఫిల్ గూడ శ్రీ విజయ దుర్గ కట్ట మైసమ్మ దేవాలయం వద్ద ఇటీవల జరిగిన దుర్చర్యపై తీవ్రంగా స్పందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. ఇటువంటి అరాచక చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులతో చర్చించామని తెలిపారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాద కోణం ఉందా? లేక ఇతర దురుద్దేశంతో జరిగిందా? అన్న అంశాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డీసీపీ శ్రీధర్ తో మాట్లాడినట్లు పేర్కొన్నారు. 

ప్రజలందరూ ఈ సమయంలో సమన్వయంతో, ఐక్యతతో ముందుకు సాగాలని, భావోద్రేకాలకు లోనయ్యే సమయం కాదని ఎమ్మెల్యే  సూచించారు.

 దేవాలయాలు, ధార్మిక స్థలాలపై ఎలాంటి దాడులు లేదా దుర్చర్యలు జరిగితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రజల శాంతి భద్రతలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం, పోలీస్ శాఖ తీసుకోవాలని ఆయన స్పష్టంగా తెలిపారు. ఇటువంటి ఘటనలు జరగడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.

#sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
వేసవి జాగ్రత్తలు తప్పనిసరి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
బాపట్ల జిల్లా: జిల్లాలో మార్చి, ఏప్రిల్, మే, నెలల్లో ఎండలు తీవ్రత క్రమేపి పెరగనునుందని, దీనితో...
By Gadiyapudi Narendra 2026-03-05 18:05:23 0 134
Andhra Pradesh
CCS పోలీస్ స్టేషన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు
*సిసిఎస్ పోలీస్ స్టేషన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు*     *ఈ సందర్భంగా ఏ డి సి పి*...
By Rajini Kumari 2025-12-20 14:03:46 0 188
Andhra Pradesh
*మహిళా దినోత్సవ వేడుకలలో మాజీ సైనికుల రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు*
బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం లోని మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణంలో బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి...
By Vadlamudi NagaVenkat 2026-03-08 17:24:23 0 771
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: పోలీసుల స్పెషల్ వీడియో
అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం మహిళల భద్రతకు పెద్దపీట వేస్తోంది. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు...
By Pagadala Venkateswar 2026-03-07 09:24:08 0 87
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com