కలెక్టర్ గారికి సమస్యలపై వినతిపత్రం - క్షేత్ర సహాయకుల సంక్షేమ సంఘం

0
300

 

ఈ రోజు కాకినాడ జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ, గౌరవ కలెక్టరు గారికి మరియు పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (PADA),వారికి VBGRAMG క్రొత్త విధానంలో మనలను GRS ల గుర్తించాలని, ఉద్యోగ భద్రత తో కూడిన సాలరీల పెంపు మరియు దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ సమస్యలపై  కలెక్టర్ గారి కార్యాలయంలో సంబంధదిత అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది....

ప్రధానమైన డిమాండ్స్:

1. దేశం లో ఒకే విధంగా GRS గా ఉన్న వ్యవస్థను అంధ్రప్రదేశ్ లో కూడా GRS సహాయకులు కొనసాగిస్తూ మమ్మల్ని గుర్తిస్తారని కోరుచున్నాము.

2. FTE ఉద్యోగులుగా అందరిని కూడా గుర్తించి తగు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుచూ FTE ని పూర్తిస్థాయిలో అమలు చేయవలసినదిగా కోరుచున్నాము.

3. మండల స్థాయిలో గ్రామ పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీకి బదిలీ సౌకర్యం కల్పించి ప్రభుత్వాలు మారుతున్నప్పుడు, పరిస్థితులు మారుతున్నప్పుడు గ్రామ స్థాయిలో కలిగె రాజకీయ వత్తిడులు కారణంగా మాకు బదిలీ సౌకర్యం కల్పించాలని సవినయముగా కోరుచున్నాము.

4. ప్రస్తుతం ధరలకు అనుగుణంగా మా యొక్క జీతభత్యాలు కనీసం వేతనం 29,000 వచ్చే విధముగా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో మాకు కేటాయించిన 1/3 పూర్తి స్థాయిలో మాకు చెందేటట్టుగా మాకు న్యాయం చేస్తారని సవినయంగా కోరుచున్నాము.

5. గ్రాడ్యుటీ మరియు హెల్త్ కార్డులు నగదు రహిత వైద్య సేవలు ప్రమాద బీమాను పెంచి(10లక్షలు వరకు), వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకములు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో గుబ్బల సత్యవేణి,సుర్ల గోవిందురాజులు (గాంధీ)సహాయకార్యదర్శులు:కట్టా నాగరాజు, తాలుం మాణిక్యలరావు (నాని)కోశాధికారి:అడబాల శ్రీను, సహాయ కోశాధికారి: గుత్తుల గోపి, ప్రచార కార్యదర్శులు:గొల్లపల్లి ప్రదీప్ కుమార్, నిమ్మగంటి శ్రీనివాస్ వి. వెంకటేశ్వరరావు

మహిళా విభాగం:అధ్యక్షులు : చల్లా ఉషా, ఉప అధ్యక్షులు : సబ్బరవు అనిత, కార్యవర్గ సభ్యులు,  సహాయకుల సంక్షేమ సంఘం పాల్గొన్నారు... #Dadala Babji

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. ఏపీ ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో కీలక భేటీ.
సీఎం చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక జలవనరుల అంశాలపై కేంద్ర...
By Pagadala Venkateswar 2026-02-10 09:44:17 0 87
Andhra Pradesh
సోషల్ మీడియాలో విపరీత ధోరణులపై చర్చ జరగాలి మంత్రి లోకేష్
సోషల్ మీడియాలో విపరీత ధోరణులపై చర్చ జరగాలి: మంత్రి లోకేష్    - ఏపీయూడబ్ల్యూజే...
By Rajini Kumari 2025-12-20 13:52:18 0 128
Andhra Pradesh
రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు..
రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు.. ఏపీ: కొత్త ఏడాదిలో రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలు...
By Gadiyapudi Narendra 2025-12-28 16:36:26 0 192
Andhra Pradesh
రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు-2026
రెవెన్యూ ఉద్యోగులు క్రీడల పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎపిఆర్ఎస్ఏ అధ్యక్షులు కె. శ్రీరాములు...
By Manda Ramkumar 2026-03-26 10:14:06 0 112
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com