YS Sharmila: చంద్రబాబు పాపులేషన్ పాలసీపై షర్మిల సెటైర్.

0
156

Andhra

 

YS Sharmila Slams Chandrababus Population Policy

చంద్రబాబు జనాభా విధానంపై వైఎస్ షర్మిల వ్యంగ్యం

ఉన్న పిల్లలకే దిక్కులేదు.. ఇప్పుడు ముగ్గురు ఎందుకని ప్రశ్న

నిరుద్యోగులు ఆటోలు, ట్యాక్సీలు నడుపుకుంటున్నారని ఆవేదన

రాష్ట్ర అప్పులు 12 లక్షల కోట్లకు చేరాయని మండిపాటు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జనాభా నియంత్రణ ఎత్తివేత, ఎక్కువ మంది పిల్లలను కనడంపై అసెంబ్లీలో చేసిన ప్రకటన పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యంగ్యంగా స్పందించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు ముగ్గురు పిల్లలను కనమని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.

 

"చంద్రబాబు పాపులేషన్ పాలసీ హాస్యాస్పదం. ఉన్న బిడ్డలకే దిక్కులేదు... ఇప్పుడు ముగ్గురు పిల్లలను కనాలా? మీరిచ్చే బోడి 25 వేల కోసం మూడో బిడ్డను కనమంటారా? ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆటోలు తోలుకుంటూ, ట్యాక్సీ డ్రైవర్లుగా బ్రతుకుతున్నారు. రాష్ట్రంలో మీరిచ్చిన హామీలు అమలు కాలేదు. మీరు, జగన్ గారు కలిసి రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారు. సంక్షేమ పథకాలకు నిధులు లేవు. ఉద్యోగుల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆరోగ్య శ్రీ పథకానికి 3 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్ పథకానికి 6 వేల కోట్లు బకాయిలు పెట్టారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలో 15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపారు. మాఫియాలు చేసుకుంటూ, రాష్ట్రాన్ని దోచుకుంటూ... బిడ్డలను కనమని చెబితే ఎలా చంద్రబాబు గారూ?" అంటూ షర్మిల ధ్వజమెత్తారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అగ్ని బాధితులను పరామర్శించిన MLA సత్యప్రభ...
కాకినాడ జిల్లా                   ప్రత్తిపాడు...
By BABJI DADALA 2026-03-12 20:59:00 0 476
SURAKSHA
Vijaya K IAS: Empowering Governance Through Dedicated Leadership
A distinguished 2013-batch Andhra Pradesh cadre IAS officer known for transparent governance,...
By Lokeshwari Panthadi 2026-07-16 10:42:33 0 61
Andhra Pradesh
మదనపల్లె: ఐచర్ లారీ బోల్తా.. 15 మంది కూలీలకు గాయాలు.
మదనపల్లె బైపాస్‌లో సోమవారం రాత్రి ఐచర్ లారీ డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ...
By Pagadala Venkateswar 2026-06-30 07:12:47 0 60
Andhra Pradesh
ప్రభుత్వ పాఠశాలల్లో వేకెన్సీ బోర్డులు పెట్టాలి మంత్రి నారా లోకేష్ ఆకాంక్ష
ప్రభుత్వ పాఠశాలల్లో నో వేకెన్సీ బోర్డులు పెట్టాలి.   అదే మంత్రి నారా లోకేష్ గారి ఆకాంక్ష....
By Rajini Kumari 2026-04-20 14:24:05 0 114
Business & Finance
Increase Authorized Capital to Support Business Growth
Increasing your authorized capital allows your company to issue additional shares and raise funds...
By Navya Sree 2026-07-14 07:03:22 0 68
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com