ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్

0
179

ప్రచుర్ణార్ధం:

 

"నశీర్ అహమ్మద్ చరిత్ర పుస్తకాలను ఉర్దూలోకి అనువదించి ప్రచురిస్తాం"

- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్

 శ్రీ మహమ్మద్ ఫారూఖ్ షుబ్లీ వెల్లడి. 

---

ప్రముఖ చరిత్రకారులు సయ్యద్ నశీర్ అహమ్మద్ రచించిన చరిత్ర గ్రంథాలను ఉర్దూ భాషలోకి అనువదించి ప్రచురిస్తామని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ శ్రీ మహమ్మద్ ఫారూఖ్ షుబ్లీ ప్రకటించారు.

విజయవాడలో జరుగుతున్న 36వ పుస్తక ప్రదర్శన మహోత్సవంలో ఈ ఏడాది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉర్దూ అకాడమీ స్టాల్ వద్ద సోమవారం (11- 01-2026) రాత్రి జరిగిన పుస్తకావిష్కరణ సభలో శ్రీ షుబ్లీ మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటన చేశారు. 

శ్రీ సయ్యద్ నశీర్ అహ్మద్ రచించిన నూతన గ్రంథం "అల్లూరికి అండగా నిలిచిన ఫజులుల్లా ఖాన్ షేక్ మదీనా" ను కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అకాడమీ చైర్మన్ మాట్లాడుతూ భారత స్వాతంత్య్రోద్యమం లో ముస్లింల పాత్రను వివరిస్తూ సయ్యద్ నశీర్ అహమ్మద్ వెలువరించిన చరిత్ర గ్రంథాలను ఉర్దూ భాషలోకి అనువాదం చేస్తామని, ఆ గ్రంథాలను ముద్రించి మన రాష్ట్రం, మన దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ గ్రంథాలయాలకు అందజేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు అకాడమీ చైర్మన్ శ్రీ మహమ్మద్ ఫారూఖ్ షుబ్లీ ప్రకటించిన నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మరియు పార్టీ రాజకీయ కార్యదర్శి శ్రీ టీడీ జనార్ధన్ , సిపిఐ జాతీయ కార్యదర్శి శ్రీ కె రామకృష్ణ , సిపిఐ (ఏం) జాతీయ పాలిటి బ్యూరో సభ్యులు శ్రీ బివి రాఘవులు, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు శ్రీ గొల్ల నారాయణరావు, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పిల్లి సురేంద్రబాబు తదితర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.

===

Search
Categories
Read More
Media Academy
The Media -The Backbone Of Democracy
The Media - Journalism -The Backbone Of Democracy At Its Core, Journalism Is The Lifeblood Of...
By Media Academy 2025-04-28 18:26:36 0 3K
SURAKSHA
Shri Pratyaya Amrit: Transforming Bihar Through Visionary Governance
A distinguished 1991-batch IAS officer of the Bihar cadre, Shri Pratyaya Amrit has become one of...
By Kalaga Sailaja 2026-07-24 09:20:34 0 10
Andhra Pradesh
అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టిడిపి జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ
_*నందవరం మండల పరిధిలోని చిన్నకొత్తిలి గ్రామంలో నిర్వహించిన `రైతన్న… మీకోసం` వారోత్సవాలు...
By Boya Dasthagiri 2026-03-26 00:50:23 0 278
Andhra Pradesh
ఎంఎల్ఏ కి ఘనంగా స్వాగతం
విశాఖ దక్షిణ నియోజక వర్గం నుంచి ఎన్నికైన వంశీ కృష్ణ శ్రీని వాస్ యాదవ్ కు నగరం లోని దిగువ రెల్లి...
By Mobbu Venkatramana 2026-02-04 04:37:32 0 444
Telangana
Hyderabad Metro and Urban Infrastructure Drive Progress
Hyderabad continues to strengthen its urban infrastructure through the expansion of Metro Rail...
By Fathima Safa 2026-07-06 05:56:50 0 72
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com