ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్

0
178

ప్రచుర్ణార్ధం:

 

"నశీర్ అహమ్మద్ చరిత్ర పుస్తకాలను ఉర్దూలోకి అనువదించి ప్రచురిస్తాం"

- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్

 శ్రీ మహమ్మద్ ఫారూఖ్ షుబ్లీ వెల్లడి. 

---

ప్రముఖ చరిత్రకారులు సయ్యద్ నశీర్ అహమ్మద్ రచించిన చరిత్ర గ్రంథాలను ఉర్దూ భాషలోకి అనువదించి ప్రచురిస్తామని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ శ్రీ మహమ్మద్ ఫారూఖ్ షుబ్లీ ప్రకటించారు.

విజయవాడలో జరుగుతున్న 36వ పుస్తక ప్రదర్శన మహోత్సవంలో ఈ ఏడాది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉర్దూ అకాడమీ స్టాల్ వద్ద సోమవారం (11- 01-2026) రాత్రి జరిగిన పుస్తకావిష్కరణ సభలో శ్రీ షుబ్లీ మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటన చేశారు. 

శ్రీ సయ్యద్ నశీర్ అహ్మద్ రచించిన నూతన గ్రంథం "అల్లూరికి అండగా నిలిచిన ఫజులుల్లా ఖాన్ షేక్ మదీనా" ను కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అకాడమీ చైర్మన్ మాట్లాడుతూ భారత స్వాతంత్య్రోద్యమం లో ముస్లింల పాత్రను వివరిస్తూ సయ్యద్ నశీర్ అహమ్మద్ వెలువరించిన చరిత్ర గ్రంథాలను ఉర్దూ భాషలోకి అనువాదం చేస్తామని, ఆ గ్రంథాలను ముద్రించి మన రాష్ట్రం, మన దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ గ్రంథాలయాలకు అందజేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు అకాడమీ చైర్మన్ శ్రీ మహమ్మద్ ఫారూఖ్ షుబ్లీ ప్రకటించిన నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మరియు పార్టీ రాజకీయ కార్యదర్శి శ్రీ టీడీ జనార్ధన్ , సిపిఐ జాతీయ కార్యదర్శి శ్రీ కె రామకృష్ణ , సిపిఐ (ఏం) జాతీయ పాలిటి బ్యూరో సభ్యులు శ్రీ బివి రాఘవులు, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు శ్రీ గొల్ల నారాయణరావు, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పిల్లి సురేంద్రబాబు తదితర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.

===

Search
Categories
Read More
Andhra Pradesh
బంగ్లా గ్రామంలో వికసించిన మే పుష్పం
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, బంగ్లా గ్రామంలో ఆదివారం అరుదుగా కనిపించే మే పుష్పం వికసించింది....
By Kothuru Murali 2026-05-24 17:24:46 0 83
Telangana
మల్కాజిగిరిలో బీజేపీ SIR అవగాహన సదస్సు.. కాంగ్రెస్, ఎంఐఎంపై ఈటల విమర్శలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో భారతీయ జనతా పార్టీ...
By Sidhu Maroju 2026-06-23 08:07:55 0 115
Andhra Pradesh
పుంగనూరు: అంబటి ఇంటి మీద దాడి పై స్పందించిన పెద్దిరెడ్డి
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిపై పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...
By Kothuru Murali 2026-02-01 09:46:56 0 185
Telangana
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఏకగ్రీవాలు రద్దు చేయాలి.
చిలుకూరు మండల కేంద్రంలో  రాష్ట్ర క్యాబినెట్ ఏప్రిల్ 23, 2026 న తీసుకున్న నిర్ణయం ప్రకారం 908...
By Nookapangu Manikanta 2026-05-18 11:44:46 0 170
Andhra Pradesh
హెల్దీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు, లోకేశ్ యోగాసనాలు.. బాబా రామ్‌దేవ్‌తో కలిసి సాధన!
  హెల్దీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు, లోకేశ్ యోగాసనాలు.. బాబా...
By Pagadala Venkateswar 2026-06-21 07:48:36 0 61
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com