అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టిడిపి జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ

0
242

_*నందవరం మండల పరిధిలోని చిన్నకొత్తిలి గ్రామంలో నిర్వహించిన `రైతన్న… మీకోసం` వారోత్సవాలు – డోర్ టు డోర్ కార్యక్రమం | `అన్నదాత సుఖీభవ` కార్యక్రమంలో టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ గారితో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.*_

 

- _*మొదటగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు గ్రామంలో రూ.55 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ సంవత్సరానికి రైతులకు వ్యవసాయ అవసరాల కోసం ప్రభుత్వం రూ. 20,000 ఆర్థిక సహాయం విడుదల చేసిన విషయాన్ని గ్రామ ప్రజలకు వివరించి, రైతులకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహాయంపై అవగాహన కల్పించారు.*_

 

- _*ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ గారు మాట్లాడుతూ స్వర్గీయ శ్రీ బీవీ మోహన్ రెడ్డి గారి తనయుడు ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారితో కలిసి చిన్నకొత్తిలి గ్రామంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నదని పేర్కొన్నారు. తాను టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.*_

 

- _*అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు గ్రామంలోని పలు ప్రాంతాలను సందర్శించి తాగునీటి సరఫరా, కొత్త రోడ్లు, కాలువలు, పారిశుధ్యం, ప్రజా సమస్యలు మరియు ఇతర ప్రభుత్వ పథకాల అమలుపై సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.*_

 

_*ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు, మార్కెట్ కమిటీ చైర్మన్, పీఏసీఎస్ అధ్యక్షుడు, మండల కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, అధికారులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.*_

Search
Categories
Read More
Telangana
కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు
నస్పూర్ కార్పొరేషన్ పరిధిలో 37వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇక్బాల్ ...
By Avunoori Mahesh 2026-04-26 12:56:07 0 139
Andhra Pradesh
చంద్రన్న జన్మదిన వేడుకలు పోస్టర్ ఆవిష్కరణ
చంద్రన్న జన్మదిన వేడుకలు... పోస్టర్ ఆవిష్కరణ... గాంధీనగర్ ప్రెస్ క్లబ్   విజయవాడ:...
By Rajini Kumari 2026-04-19 12:39:33 0 87
Telangana
‎ ‎ప్రధాని మోదీపై 'కాంతార' నటుడు ఫైర్
పదేళ్లు విడగొట్టి.. ఇప్పుడు కలిసి ఉండమంటే ఎలా? ప్రధాని మోదీపై 'కాంతార' నటుడు కిషోర్ నిప్పులు!" 🔥...
By Ponnala Srinivasrao 2026-03-28 02:28:05 0 190
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com