ఆటలతో ఉద్యోగులలో మానసిక స్థైరం: కమిషనర్

0
169

కర్నూలు : కర్నూలు సిటీ : 

క్రీడలతో ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసం

• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
• మున్సిపల్ ఉద్యోగులకు క్రీడా పోటీలు ప్రారంభం
• ఉద్యోగుల్లో సమన్వయం, పరస్పర సహకారం పెంపునకు దోహదం

క్రీడల్లో పాల్గొనడం వల్ల ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడి తగ్గి, ఉత్సాహం, సానుకూల దృక్పథం పెరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు. శనివారం మున్సిపల్ ఉద్యోగుల కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో కమిషనర్ క్రీడా పోటీలను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. విధుల ఒత్తిడికి దూరంగా క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతుందని పేర్కొన్నారు. క్రీడలు ఉద్యోగుల్లో సమన్వయం, పరస్పర సహకారం, ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్, కౌన్సిల్ హాల్, ఇండోర్ స్టేడియం, ఔట్‌డోర్ స్టేడియంలలో ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. పురుష ఉద్యోగుల కోసం క్రికెట్, షటిల్, వాలీబాల్, క్యారమ్స్, చెస్, క్రీడలు, మహిళా ఉద్యోగుల కోసం త్రోబాల్, బ్యాడ్మింటన్, 100 మీటర్ల రన్నింగ్ రేస్, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్, రంగోలి, షటిల్ క్రీడలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు ఈ క్రీడా పోటీలు నిర్వహించి, సంక్రాంతి పండుగ నాడు మహిళల కోసం ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. 

జట్టు స్పూర్తి, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన పోటీ భావన ఉద్యోగుల పనితీరును మెరుగుపరుస్తాయని పేర్కొంటూ, మున్సిపల్ ఉద్యోగులందరూ ఈ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు.

డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, మేనేజర్ ఎన్.చిన్నరాముడు, కార్యదర్శి నాగరాజు, ఎస్ఈ రమణమూర్తి, ఎంఈ మనోహర్ రెడ్డి, డిసిపి వెంకటరమణ, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగ ప్రసాద్, ఆర్‌ఓ జునైద్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సి ఎస్ ఎస్ నిధులు నూరు శాతం వినియోగించాలి గుంటూరు జిల్లా కలెక్టర్. ఏ తమిమ్ అన్సారియా
 *సీఎస్ఎస్ నిధులు నూరుశాతం వినియోగించాలి* గుంటూరు, డిసెంబర్ 23:-జిల్లాలో కేంద్ర ప్రాయోజిత...
By KOTESWARARAO KVSR 2025-12-23 14:04:42 0 160
Andhra Pradesh
మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం మోట్ల మల్లికార్జునపురం వద్ద విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
మార్కాపురం జిల్లా.  పెద్ద దోర్నాల మండలం మోట్ల మల్లికార్జునపురం వద్ద విషాదకర రోడ్డు ప్రమాదం...
By Chennaiah Kati 2026-03-06 09:08:35 0 146
Andhra Pradesh
Medamalli Balaji: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా మెడమల్లి బాలాజీ పేరు సిఫారసు.
బాలాజీ పేరును ఆమోదించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం  కేంద్రానికి...
By Pagadala Venkateswar 2026-01-29 06:19:42 0 97
Andhra Pradesh
లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ అందచేత !!
కర్నూలు : పాణ్యం నియోజకవర్గానికి చెందిన 75 మంది లబ్ధిదారులకు రూ 40,46,836/- సీఎం రిలీఫ్ ఫండ్...
By Hari Krishna 2025-12-22 11:27:31 0 158
Andhra Pradesh
పుంగనూరు :కొత్త ఇండ్లు వద్ద ద్విచక్ర వాహనం చోరీ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు పట్టణంలో కొత్త ఇండ్ల టీవీఎస్ షోరూమ్ వద్ద ఎన్....
By Kothuru Murali 2026-01-12 08:41:36 0 121
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com