కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నూతన DTDO శ్రీ జాదవ్ అంబాజీకి ఘన సన్మానం

0
41

ఆసిఫాబాద్, జులై 22 భారత్ ఆవాజ్ ప్రతినిధి: జిల్లా గిరిజన సంక్షేమ శాఖ నూతన గిరిజన అభివృద్ధి అధికారి (DTDO) గా పదోన్నతిపై బాధ్యతలు స్వీకరించిన శ్రీ జాదవ్ అంబాజీ గారిని రాజ్ గోండ్ సేవా సమితి జాతీయ అధ్యక్షులు సిడెం అర్జు మాస్టర్ నేతృత్వంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అర్జు మాస్టర్ మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం, విద్యాభివృద్ధి, సామాజిక పురోగతికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, ఈ శాఖను ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా నూతన అధికారి సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సన్మాన గ్రహీత శ్రీ జాదవ్ అంబాజీ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి, ఆశ్రమ పాఠశాలల ప్రగతి మరియు సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుకు అంకితభావంతో పనిచేస్తానని, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాలు, అధికారులు, ప్రజల సహకారంతో గిరిజన సంక్షేమ కార్యక్రమాలను మరింత మెరుగ్గా అమలు చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ పోరుబిడ్డ కొమురం భీమ్ ముని మనమడు కుమరం మాధవరావ్, జిల్లా సార్మేడి అధ్యక్షులు కుర్సెంగా మోతిరామ్, పీవీటీజీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు భీంరావ్, రాజ్ గోండ్ సేవా సమితి కార్యవర్గ సభ్యులు కూడ్మేత మారుతి, తాను లతో పాటు సంఘం నాయకులు, సభ్యులు, వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన అధికారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Search
Categories
Read More
Telangana
చినరాయుని చెరువు శుభ్రపరిచే పనులు వేగం - పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక చినరాయుని చెరువును శుభ్రపరిచే ప్రక్రియ వేగవంతమైంది. ఈ...
By Sidhu Maroju 2026-03-10 13:30:28 0 188
Andhra Pradesh
కంచిలీ: ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలు
జె. నారాయణపురం గ్రామానికి చెందిన కర్రి ప్రసాద్ ఒకేసారి మూడు బ్యాంక్ ఉద్యోగాలు సాధించాడు. ఐబీపీఎస్...
By Jeeru Kumar 2026-03-02 11:17:23 0 994
Telangana
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ప్లాన్
🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్: రాబోయే...
By Chunarkar Jagadeesh 2026-06-17 16:19:48 0 180
Andhra Pradesh
పుంగనూరులో రక్తదాన శిబిరం: ప్రాణదాతలుగా నిలవాలని పిలుపు
ప్రపంచ రక్త దాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని, చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి...
By Kothuru Murali 2026-06-13 15:33:18 0 83
Andhra Pradesh
ప్రజల కోసం... ప్రజలతోనే ప్రజాదర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రజల కోసం... ప్రజలతోనే ప్రజాదర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక యర్రగొండపాలెం పట్టణంలోని...
By Chennaiah Kati 2026-07-03 16:53:13 0 53
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com