కోడి పందాలు జూదం నిషేధిత ఆటలపై కఠిన చర్యలు

0
69

*కోడి పందాలు, జూదం, నిషేధిత ఆటలపై కఠిన చర్యలు*

 

*నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు*

 

*సంక్రాంతి పండుగ కుటుంబ సభ్యులు, బంధువులు మిత్రులతో ప్రశాంతంగా జరుపుకోవాలి*

 

*సంక్రాంతి వేళ ప్రత్యేక నిఘా – మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్*

 

సంక్రాంతి పండుగను శాంతియుతంగా, సుఖసంతోషాలతో జరుపుకోవాలని మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ ప్రజలను కోరారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు, డీఎస్పీ మురళీకృష్ణ పర్యవేక్షణలో, గ్రామీణ సీఐ ఏవీ బ్రహ్మం సూచనలతో పండుగ సందర్భంగా ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.సంక్రాంతి రోజుల్లో కోడి పందాలు, జూదం, గుండాట వంటి నిషేధిత ఆటలు నిర్వహించినా, వాటిలో పాల్గొన్నా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు మండల పరిధి అంతటా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.నిర్మానుష ప్రాంతాలు, పొలాలు, గ్రామ శివార్లలో నిషేధిత ఆటలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. అవసరమైతే ప్రత్యేక పోలీస్ బృందాలతో దాడులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. యువత కోడి పందాలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇవి కుటుంబాలు, సమాజాన్ని నష్టపరిచే ప్రమాదం ఉందని తెలిపారు.అదేవిధంగా మద్యం సేవించి అల్లరి సృష్టించే అసాంఘిక శక్తులపై కూడా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్రాంతి సెలవుల్లో విహారయాత్రలకు వెళ్లే వారు తమ వివరాలను సమీప పోలీస్ స్టేషన్‌కు ముందుగానే తెలియజేయాలని సూచించారు. ఇది భద్రతా పరంగా ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

మండల పరిధిలో ఎక్కడైనా కోడి పందాలు లేదా నిషేధిత ఆటలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతోనే పండుగను ప్రశాంతంగా నిర్వహించవచ్చని, పోలీస్ శాఖ ప్రజల భద్రతకే ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Pawan Kalyan: తిరుమల లడ్డూ వ్యవహారంలో సీబీఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదు: పవన్ కల్యాణ్.
గత వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యికి...
By Pagadala Venkateswar 2026-02-06 05:06:19 0 41
Andhra Pradesh
KL యూనివర్సిటీ మొదటి విడత ఇంజనీరింగ్ పరీక్ష ఫలితాలు విడుదల
*కె ఎల్ యూనివర్సిటీ మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.* ఆడపిల్లకు చదువే అసలైన...
By Rajini Kumari 2026-01-10 12:42:30 0 64
Andhra Pradesh
అంటువ్యాధుల నియంత్రణను రాష్ట్రస్థాయి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు
అంటువ్యాధుల నియంత్రణకు రాష్ట్ర స్థాయి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు    ...
By Rajini Kumari 2025-12-29 13:11:37 0 71
Andhra Pradesh
జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్., గారు అధికారులను ఆదేశించారు.
బాపట్ల: ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం...
By Gadiyapudi Narendra 2026-01-22 12:38:49 0 83
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com