ఎస్ ఐ ఆర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయడానికి సహకరించాలి: కమిషనర్

0
159

కర్నూలు : ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతానికి సహకరించాలి
 కర్నూలు నియోజకవర్గ ఆర్వో, కమిషనర్ పి.విశ్వనాథ్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన

ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేయడానికి రాజకీయ పార్టీల సహకారం అత్యంత కీలకమని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎస్‌ఐఆర్ అనేది ఓటర్ల జాబితాను సమగ్రంగా పరిశీలించి సవరించే ప్రత్యేక ప్రక్రియగా ఆర్వో వివరించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చేయడం, మరణించిన వారు, డూప్లికేట్ పేర్లు తొలగించడం, చిరునామా మారిన ఓటర్ల వివరాలు సరిచేయడం, కొత్తగా అర్హత పొందిన యువ ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఈ విధంగా రూపొందే ఓటర్ల జాబితా పారదర్శకంగా, ఖచ్చితంగా ఉండడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆర్వో పేర్కొన్నారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ప్రజల్లో ఏర్పడే సందేహాలు, అపోహలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సలహా సూచనలతో నివృత్తి చేసి, ఎన్నికల సంఘం అందించిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లేలా సమన్వయంతో ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి అర్హుడైన పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించడం అందరి బాధ్యతగా పేర్కొన్నారు. బూత్ స్థాయి అధికారులు  ఓటిపిలు అడగరని, గుర్తింపు కార్డుతోనే ఇంటింటికీ వచ్చి ధృవీకరణ చేపడతారని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తామని, బీఎల్‌వోలు ప్రజల వద్దకు వచ్చినప్పుడు సహకరించేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు చొరవ చూపాలని ఆర్వో కోరారు.

ఈ సమావేశంలో అదనపు కమిషనర్ ఆర్‌జి‌వి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ కే.వి.సతీష్ కుమార్ రెడ్డి, తహశీల్దార్ రవికుమార్, డిప్యూటీ తహశీల్దార్ ధనుంజయ, ఎస్‌ఈ రమణ మూర్తి, ఎలక్షన్స్ సూపరింటెండెంట్ సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
కోర్టులతో మొట్టికాయలు తినడమే పనిగా పెట్టుకున్న హైడ్రా
బతుకమ్మ కుంట భూమిపై స్టేటస్ కో ఉన్నాక ఎలా అభివృద్ధి చేస్తారని, బోర్డులు తొలగించాలని హైడ్రాను...
By Ponnala Srinivasrao 2026-04-28 02:17:13 0 94
Andhra Pradesh
పేకాట ఆడుతున్న వారిపై ప్రత్తిపాడు పోలీసులు దాడులు...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం గ్రామ శివారులో పేకాట...
By BABJI DADALA 2026-01-01 16:10:43 0 320
Telangana
𝗦𝗮𝗶𝗳𝗮𝗯𝗮𝗱 𝗣𝗼𝗹𝗶𝗰𝗲 & 𝗖𝗖𝗦 𝗛𝘆𝗱𝗲𝗿𝗮𝗯𝗮𝗱 𝗔𝗿𝗿𝗲𝘀𝘁 𝗧𝘄𝗼 𝗦𝗲𝗿𝘃𝗮𝗻𝘁 𝗧𝗵𝗲𝗳𝘁 𝗢𝗳𝗳𝗲𝗻𝗱𝗲𝗿𝘀 – 𝗝𝗲𝘄𝗲𝗹𝗹𝗲𝗿𝘆 𝗪𝗼𝗿𝘁𝗵 ₹𝟭.𝟱 𝗖𝗿 𝗥𝗲𝗰𝗼𝘃𝗲𝗿𝗲𝗱
Hyderabad:  Saifabad Police, in coordination with CCS Hyderabad, arrested two offenders...
By Sidhu Maroju 2025-09-11 14:57:27 0 266
Andhra Pradesh
రాష్ట్రంలో గ్యాస్ ఇందన కొరతలేదు
రాష్ట్రంలో వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ కొరత లేదు • నెల రోజుల్లో లక్ష పీఎన్జీ కనెక్షన్లు...
By Rajini Kumari 2026-03-26 13:39:20 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com