ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్

0
191

కర్నూలు : 

వీధి దీపాల మరమ్మతులను ఆలస్యం చేయొద్దు

• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
• ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు 23 అర్జీలు

నగరంలోని ప్రతి వీధి విద్యుత్ కాంతులతో వెలగాలని, వీధి దీపాలు చెడిపోయిన వెంటనే ఎలాంటి ఆలస్యం లేకుండా మరమ్మతులు చేపట్టి కొత్త దీపాలు అమర్చే విధంగా చొరవ చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఇంజనీరింగ్ విభాగంలోని సంబంధిత అధికారులను ఆదేశించారు. వీధి విద్యుత్ దీపాల కోసం ఇప్పటికే రూ.60 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో త్వరితగతిన కొత్త దీపాలు తెప్పించి, మరమ్మతులకు గురైన వీధి దీపాల స్థానంలో వెంటనే కొత్తవి అమర్చాలని సూచించారు. సోమవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ కాలనీలకు చెందిన ప్రజల నుంచి 23 ఫిర్యాదులను స్వీకరించారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్‌.జి.వి.కృష్ణ, కార్యదర్శి నాగరాజు, ఎస్‌.ఈ జె.రమణ మూర్తి, ఎం.ఈ మనోహర్ రెడ్డి, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, ఆర్‌.ఓ జునైద్, టిడ్కో అధికారి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

వచ్చిన విన్నపాల్లో కొన్ని..

• బుధవారపేట స్మశాన వాటిక వద్ద ముళ్లకంపలను తొలగించాలని, శునకాల బెడద నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ ఇంచార్జీ పి.సురేష్, ప్రదీప్ తదితరులు కోరారు.

• 4వ తరగతి ఉద్యోగుల కాలనీలో తమ ఇళ్ల ఎదుట స్థలం అపరిశుభ్రంగా ఉందని, వెంటనే శుభ్రం చేయాలని సి.హెచ్.బాలచంద్ర విన్నవించారు.

కుంతల కళామందిర్ వద్ద వీధి విద్యుత్ దీపాలు వెలగడం లేదని స్థానికులు రవి కుమార్, బాష తదితరులు ఫిర్యాదు చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సీట్ స్కృే పేరు తో విశాఖ ఉత్చవం
ఉత్తరాంధ్రలో విశాఖ పట్నం నందు విశాఖ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి 24న శని వారం నుంచి మొద లైనాయి...
By Mobbu Venkatramana 2026-01-25 10:13:13 0 488
Andhra Pradesh
పుంగనూరు: చోరీలకు పాల్పడుతున్న వ్యక్తికి జైలు శిక్ష
అన్నమయ్య జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తికి బుధవారం జైలుశిక్ష పడింది. వివరాల్లోకి వెళితే...
By Kothuru Murali 2026-04-30 11:33:27 0 71
Andhra Pradesh
కేంద్ర బడ్జెట్ చారిత్రాత్మకమైనది : సాయి లోకేష్.
అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిలోకేష్ మంగళవారం మదనపల్లిలో మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్ 140...
By Pagadala Venkateswar 2026-02-03 13:08:51 0 106
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : తాళం వేసిన ఇంట్లో చోరీ
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం 106 రామిరెడ్డిగారి పల్లెలో శనివారం తెల్లవారుజామున తాళం...
By Kothuru Murali 2026-05-17 16:45:50 0 36
Andhra Pradesh
మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఖండించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
కృష్ణాజిల్లా గుడివాడ    కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను...
By Rajini Kumari 2026-03-23 14:37:25 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com