ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్

0
224

కర్నూలు : 

వీధి దీపాల మరమ్మతులను ఆలస్యం చేయొద్దు

• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
• ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు 23 అర్జీలు

నగరంలోని ప్రతి వీధి విద్యుత్ కాంతులతో వెలగాలని, వీధి దీపాలు చెడిపోయిన వెంటనే ఎలాంటి ఆలస్యం లేకుండా మరమ్మతులు చేపట్టి కొత్త దీపాలు అమర్చే విధంగా చొరవ చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఇంజనీరింగ్ విభాగంలోని సంబంధిత అధికారులను ఆదేశించారు. వీధి విద్యుత్ దీపాల కోసం ఇప్పటికే రూ.60 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో త్వరితగతిన కొత్త దీపాలు తెప్పించి, మరమ్మతులకు గురైన వీధి దీపాల స్థానంలో వెంటనే కొత్తవి అమర్చాలని సూచించారు. సోమవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ కాలనీలకు చెందిన ప్రజల నుంచి 23 ఫిర్యాదులను స్వీకరించారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్‌.జి.వి.కృష్ణ, కార్యదర్శి నాగరాజు, ఎస్‌.ఈ జె.రమణ మూర్తి, ఎం.ఈ మనోహర్ రెడ్డి, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, ఆర్‌.ఓ జునైద్, టిడ్కో అధికారి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

వచ్చిన విన్నపాల్లో కొన్ని..

• బుధవారపేట స్మశాన వాటిక వద్ద ముళ్లకంపలను తొలగించాలని, శునకాల బెడద నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ ఇంచార్జీ పి.సురేష్, ప్రదీప్ తదితరులు కోరారు.

• 4వ తరగతి ఉద్యోగుల కాలనీలో తమ ఇళ్ల ఎదుట స్థలం అపరిశుభ్రంగా ఉందని, వెంటనే శుభ్రం చేయాలని సి.హెచ్.బాలచంద్ర విన్నవించారు.

కుంతల కళామందిర్ వద్ద వీధి విద్యుత్ దీపాలు వెలగడం లేదని స్థానికులు రవి కుమార్, బాష తదితరులు ఫిర్యాదు చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తూరంగిలో పీ.టి. స్కూల్ గోల్డెన్ జూబిలీ వేడుకలు ఘనంగా
కాకినాడ సమీపంలోని తూరంగి గ్రామంలో ఉన్న పీ.టి. స్కూల్ (Preachers Training School) స్థాపనకు 50...
By Ratna Sekhar 2026-03-05 18:14:19 0 875
Andhra Pradesh
సీఎం సహాయనిధి పేదలకు కొండంత అండ: ఎమ్మెల్యే.
ఆదివారం రామసముద్రం మండలంలో ఎమ్మెల్యే షాజహాన్ భాష 38 మంది లబ్ధిదారులకు రూ. 59 లక్షల విలువైన సీఎం...
By Pagadala Venkateswar 2026-02-23 06:46:23 0 145
Telangana
వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు
  *వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్* మహబూబాబాద్ జిల్లా తోర్రూరు,డిసెంబర్12:ఎన్నికల...
By Bheeshman King 2025-12-13 13:09:25 0 397
Business & Finance
Gujarat Set to Emerge as a Defence Manufacturing Hub
Defence Minister Rajnath Singh said Gujarat has the potential to emerge as a major defence...
By Navya Sree 2026-07-01 07:47:23 0 83
Andhra Pradesh
Tirumala: తిరుమలలో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు.
    Tirumala: తిరుమలలో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు 19-01-2026 Mon 18:28 | Andhra...
By Pagadala Venkateswar 2026-01-19 16:42:15 0 190
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com