వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు

0
391

 

*వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్*

మహబూబాబాద్ జిల్లా తోర్రూరు,డిసెంబర్12:ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారుల ముసుగులో బలవంతపు వసూళ్లు చేస్తున్న ఓ యూట్యూబ్ డిజిటల్ ఛానల్ యాంకర్ గా పనిచేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు తొర్రూరు ఎస్సై ఉపేందర్ తెలిపారు. గురువారం అరెస్టు చేసిన సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ బుధవారం సాయంత్రం 4.30 గంటలకి ములుగు నివాసి ధరావత్ ఆనంద్ పోచంపల్లి గ్రామం పెద్ద వంగరలో తన బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో పాలకేంద్రం దగ్గర ఆగి అక్కడి వైన్ షాప్ లో లిక్కర్ కొనుక్కొని తన కారులో వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు పోలీస్ సైరన్ ఉన్న కారులో వారిని వెంబడించి, దారి మధ్యలో అడ్డగించి వారిని మేము ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులమని,కారును చెక్ చేసి, కారులోని మద్యం పట్టుకొని ఇప్పుడు మీ మీద కేసు అవుతుందని రూ.1లక్ష రూపాయలు ఇస్తేనే మిమ్మల్ని వదులుతామని బెదిరించారని, ఆ క్రమంలో ధరావత్ ఆనంద్ మరియు డ్రైవర్ కుమార్ ను అతని కారును బంధించగా ఇతను బెదిరిపోయి వాళ్ల బామ్మర్ది దగ్గర అప్పటికప్పుడు ఒక లక్ష రూపాయలను సర్దుబాటు చేసి, వీరికి ఇచ్చి కారును అతని డ్రైవర్ ను విడిపించుకున్నారని తెలిపారు. ముగ్గురు వ్యక్తులలో ఒకతను సివిల్ డ్రెస్ లో ఉండగా మిగతా ఇద్దరు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నట్లు తెలిపారు. బుధవారం రాత్రి అతన్ని వాళ్ళ ఇంటి వద్ద పట్టుకుని అరెస్టు చేసి, అతని వద్దనుండి నేరానికి వాడిన కారు, బాధితుల దగ్గర నుండి వసూలు చేసిన రూపాయలలో ఇతను తీసుకున్న రూపాయలు 50,000 అతని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.మిగతా ఇద్దరి నేరస్తుల్లో ఒకరు ఒక ప్రముఖ వార్త పత్రికలో తొర్రూరు విలేకరిగా, మరొకరు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో రిపోర్టర్ గా పనిచేస్తున్నారని, వారిని పట్టుకుని కోర్టు ముందు ప్రవేశపెడతామని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మంత్రి రాంప్రసాద్ రెడ్డి మదనపల్లి పర్యటనలో భారీ బైక్ ర్యాలీ.
ఆదివారం మదనపల్లె పర్యటనలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ...
By Pagadala Venkateswar 2026-02-02 04:39:11 0 151
Andhra Pradesh
నిర్లక్ష్యానికి గురైన రోడ్డు అవస్తులు పడుతున్న స్థానికులు, విద్యార్థులు, రైతులు.
బాపట్ల మండలంలోని బాపట్ల పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న నందరాజుతోట పంట కాలువకి ఆనుకొని ఉన్న రోడ్డు...
By Vadlamudi NagaVenkat 2026-04-04 15:09:50 0 281
Telangana
దుగ్గొండి మండలం మొక్కజొన్న రైతులకు బి ఆర్ ఎస్ పార్టీ నిరస
మొక్కజొన్న రైతులకు మద్దతుగా నర్సంపేట మాజీ శాసన సభ్యులు శ్రీ  పెద్ది సుదర్శన్ రెడ్డి గారు...
By Gujile Ramu 2026-04-22 16:35:43 0 204
Telangana
NZB. ఈ నేల 7న చలో ఇందిరా పార్క్
2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వా మెమో 57 అధరంగ హైకోర్ట్ తిర్పును అమలు చేస్తు పత పెన్షాన్...
By Sadaq Sadaq 2026-03-01 15:03:04 0 149
Andhra Pradesh
Chandrababu Naidu: రేపు నెల్లూరు, కడప జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (ఏప్రిల్ 1) నెల్లూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఒకే రోజు రెండు...
By Pagadala Venkateswar 2026-03-31 10:47:35 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com