YS Jagan: ప్రభుత్వ వైఫల్యమే కారణం.. కల్తీ పాల ఘటనపై జగన్ ఫైర్.

0
87

రాజమండ్రిలో కల్తీ పాలతో నలుగురి మృతి!

ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ

 

ఒకే పాల వ్యాపారి నుంచి పాలు కొన్న బాధితులు

పలువురి పరిస్థితి విషమం.. ఆసుపత్రిలో చికిత్స

రాజమండ్రిలో కల్తీ పాలు సేవించి నలుగురు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ సంఘటనపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆయన, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

 

ఆహార భద్రత అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని జగన్ ఆరోపించారు. ఈ దారుణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి విషాదాలు జరుగుతున్నాయని, భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు.

 

బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్య శాఖ వెంటనే రంగంలోకి దిగాలని, అవసరమైతే నిపుణులైన వైద్య బృందాలను పంపాలని జగన్ కోరారు. ఆహార భద్రత తనిఖీలను కట్టుదిట్టం చేసి, పాల వంటి నిత్యావసరాలపై ప్రజలకు నమ్మకం కలిగించాలని విజ్ఞప్తి చేశారు.

 

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరంలోని లాలా చెరువు, చౌడేశ్వరి నగర్ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా నలుగురు మరణించారు. మూత్రం రాకపోవడం (అనూరియా) లక్షణాలతో వీరు మృతి చెందగా, దీనికి కల్తీ పాలే కారణమని అనుమానిస్తున్నారు. ఆదివారం రాత్రి ఎస్. శేషగిరిరావు (72), రాధా కృష్ణమూర్తి (74) మరణించారు. అంతకుముందు మరో ఇద్దరు చనిపోయారు.

 

ఈ నెల‌ 15 నుంచి సుమారు 14 మంది అనారోగ్యంతో వివిధ ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. బాధితులంతా ఒకే పాల వ్యాపారి వద్ద పాలు కొనుగోలు చేయడంతో కల్తీ జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Search
Categories
Read More
Telangana
హెచ్‌సీఏలో ‘విశాఖ’ సెగ: రూ. 70 కోట్ల చెల్లింపులపై జింఖానాలో రచ్చ!
హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో అవినీతి ఆరోపణలు మరోసారి ప్రకంపనలు...
By Sidhu Maroju 2026-03-03 13:56:18 0 98
Andhra Pradesh
YSRCP: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి: పార్లమెంటు వద్ద వైసీపీ ఎంపీల నిరసన.
ప్లకార్డులు చేతపట్టి ఆందోళనకు దిగిన వైసీపీ ఎంపీలు ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోందని నినాదాలు...
By Pagadala Venkateswar 2026-02-03 07:12:41 0 129
Andhra Pradesh
Chandrababu Naidu: మన్ కీ బాత్... ప్రధాని మోదీకి థాంక్స్ చెప్పిన సీఎం చంద్రబాబు
'మన్ కీ బాత్' కార్యక్రమంలో అనంతపురం ప్రజలను ప్రశంసించిన ప్రధాని మోదీ జల వనరుల పునరుద్ధరణలో వారి...
By Pagadala Venkateswar 2026-01-25 12:18:00 0 96
West Bengal
Murshidabad Blast Sparks Fear as Police Probe Motive |
A bomb blast rocked Murshidabad district, leaving one person injured and sparking fresh concerns...
By Pooja Patil 2025-09-15 10:38:40 0 215
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com