మీభూమి మీ హక్కు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

0
181

*ఆత్మకూరు, జనవరి 5:*

 

*అధికారం చేపట్టిన వెంటనే రైతుల హక్కులు హరించే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశాం*

 

*➖ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి*

 

➖ మీ భూమి – మీ హక్కు” నినాదంతో ఆత్మకూరు రూరల్ మండలం నువ్వూరుపాడు గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

 

➖ ప్రభుత్వ రాజముద్ర, క్యూ ఆర్ కోడ్ తో జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేసిన మంత్రి ఆనం

 

*గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలు... తమ ప్రభుత్వం ఇస్తున్న పాస్ పుస్తకాలకు ఉన్న తేడాను రైతులకు అర్థమయ్యేలా వివరించిన మంత్రి ఆనం*

 

➖ గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలు చెల్లని నోటుతో సమానం... విలువ లేనివి

 

➖ తమ ప్రభుత్వం ఇస్తున్న పాస్ పుస్తకాలు రిజర్వ్ బ్యాంకు జారీ చేస్తున్న కరెన్సీ నోట్ల వలె విలువ గలవి... భద్రతాపరంగా చట్టబద్ధత కలిగినవి

 

➖ ప్రభుత్వ రాజముద్రతో జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో వున్న క్యూర్ కోడ్ స్కాన్ చేస్తే భూ యజమానికి సంబంధించిన అన్ని వివరాలు అప్పటికప్పుడే కనిపిస్తాయి*

 

➖ రైతుల భూ హక్కులకు చట్టబద్ధ భద్రత కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

 

➖ 2026 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ లోని లోపాలను పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజలకు,రైతన్నలకు అండగా నిలుస్తాం.: మంత్రి ఆనం

 

➖ నువ్వూరుపాడు గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్లకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసిన మంత్రి ఆనం

 

*ఎవరూ ఊహించని విధంగా సూపర్ సిక్స్ ను విజయవంతంగా అమలు చేశాం : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి*

 

➖ ప్రజలపై భారం పడకుండా ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వమే కోట్లాది రూపాయలు చెల్లిస్తూ ఉచిత బస్సు..స్త్రీ నిధి పథకాన్ని అమలు చేస్తుంది

 

➖ అన్నా క్యాంటీన్ ద్వారా ఇప్పటివరకు నాలుగు కోట్ల మంది భోజనం చేశారు

 

➖ కోట్లాది రూపాయలతో పింఛన్లు క్రమం తప్పకుండా అందిస్తున్నాం

 

➖ గ్యాస్ సంస్థలకు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తూ ప్రజలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అందిస్తుంది

 

➖ త్వరలోనే మూడో విడత అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తాం : మంత్రి ఆనం

 

➖ విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొస్తూ విద్యుత్‌ ట్రూఅప్‌ చార్జీలను పూర్తిగా రద్దు చేశాం... విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తున్నాం : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

 

➖ మెగా డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేసాం... పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను కూడా భర్తీ చేశాం

 

➖ దేశంలో ఎక్కడా లేనివిధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయి... పోర్టులు, ఎయిర్ పోర్ట్ లు, పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తున్నాం

 

➖ ఆగస్టు నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్నాం... దగదర్తి లో ఈ డిసెంబర్ చివరినాటికి విమానాశ్రయాన్ని పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం ముందుకు సాగుతుంది : మంత్రి ఆనం

 

➖ ప్రజలకు సుపరిపాలన అందిస్తూ రామరాజ్య స్థాపనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుంది : మంత్రి ఆన

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మెల్యే సారు మన ఎమ్మార్వో ఆఫీస్ ఒక్కసారి చూడు... అంటూ నగర పంచాయతీ ప్రజల ఆవేదన
గూడూరు ఎమ్మార్వో కార్యాలయ నిర్మాణం జరిగేనా,,, మండలం లోని ఎమ్మార్వో కార్యాలయం శిథిలమై దాదాపు 13...
By mahaboob basha 2025-07-23 14:26:13 0 900
Andhra Pradesh
నిమ్మనపల్లి కేజీబీవీ పాఠశాల‌ను డీఈవో ఆకస్మిక తనిఖీ.
అన్నమయ్య జిల్లా డీఈవో సుబ్రహ్మణ్యం గురువారం నిమ్మనపల్లె కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ...
By Pagadala Venkateswar 2026-02-06 04:28:25 0 112
Andhra Pradesh
పుంగనూరు మండలాల్లో 8 గంటలైనా తగ్గని మంచు
పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలలో శనివారం ఉదయం 8 గంటలైనా పొగమంచు తీవ్రత తగ్గలేదు. దీనితో గ్రామాల...
By Kothuru Murali 2026-01-03 11:05:40 0 166
Maharashtra
Mumbai-Pune Expressway to Close for Power Work Today |
The Mumbai-Pune Expressway will remain closed for one hour today for essential power work....
By Pooja Patil 2025-09-16 05:46:18 0 168
Telangana
భాద్యతలు చేపట్టిన నూతన సర్పంచ్ భాగ్యమ్మ
 డిసెంబర్ 22 (భారత్ అవాజ్):కొత్తగూడ మండలంలోని 24 గ్రామ పంచాయతీలలో సోమవారం రోజున నూతనంగా...
By Bittu Bittu 2025-12-22 16:41:55 0 338
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com