పరుగులు పెడుతున్న డోన్ నియోజకవర్గ అభివృద్ధి పనులు :

0
221

కర్నూలు :  డోన్ డోన్ నియోజకవర్గంలో సమగ్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. పట్టణాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది.

ఈ క్రమంలో ఈ రోజు డోన్ పట్టణంలోని ఎస్.సి. బరియల్ గ్రౌండ్‌లో రూ. 9.20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రహరీ గోడ మరియు నీటి సదుపాయాల ఏర్పాటు పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు

ఈ కార్యక్రమంలో గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు పాల్గొని భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,డోన్ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అభివృద్ధి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యంగా ఎస్సీ సమాజానికి సంబంధించిన సౌకర్యాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

బరియల్ గ్రౌండ్ అభివృద్ధితో పరిశుభ్రత, భద్రత, తాగునీటి సౌకర్యాలు మెరుగుపడి ప్రజలకు మరింత ఉపయోగకరంగా మారుతాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేస్తూ నాణ్యమైన పనులు చేపట్టి, నిర్ణీత గడువులో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు క్రిస్టియన్ కమ్యూనిటీ సభ్యులు ,పాస్టర్లు స్థానికులు పాల్గొన్నారు.

 

Search
Categories
Read More
Bihar
Bihar Expands Rural Road Connectivity for Better Access
The Bihar government is accelerating rural road connectivity projects to improve transportation,...
By Fathima Safa 2026-06-24 06:21:18 0 74
Andhra Pradesh
చేనేత సహకార సంఘం YWCS విలీనాన్ని వ్యతిరేకిస్తున్న ఎర్రకోట రాజీవ్ రెడ్డి
చేనేత సహకార సంఘ (YWCS) విలీనన్ని వ్యతిరేకస్తున్నాము.ఎర్రకోట రాజీవ్ రెడ్డి. ఎమ్మిగనూరు చేనేత...
By Boya Dasthagiri 2026-03-31 11:48:39 0 287
Andhra Pradesh
మదనపల్లె: గాలివానకు చెట్టు కూలి కారుకు నష్టం.
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని రామారావు కాలనీలో బుధవారం కురిసిన గాలివాన బీభత్సం...
By Pagadala Venkateswar 2026-05-07 06:01:30 0 90
Telangana
లక్షేటిపేట: చైనా మాంజా వాడితే కేసులు తప్పవు
లక్షెట్టిపేటలో చైనా మాంజా విక్రయాలు, వాడకంపై ఎస్ఐ గోపతి రమేష్ కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు....
By Pinnehasan Odela 2026-01-10 13:20:44 0 222
SURAKSHA
సైబర్ నేరగాళ్లకు చెక్: తెలంగాణ పోలీసుల కొత్త వ్యూహం
స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయిపోతున్న రోజులివి. ఇలాంటి డిజిటల్ దొంగల ఆట...
By Kalaga Sailaja 2026-06-25 07:48:36 0 124
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com