కత్తిపూడి బాధితుడు ముత్తిన రామకృష్ణను పరామర్శించిన BCY పార్టీ అనూష యాదవ్

0
314

కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి దాడికి గురైన ముత్తిన రామకృష్ణను బీసీవై పార్టీ నాయకురాలు డాక్టర్ అనూష యాదవ్ ఆదివారం సాయంత్రం పరామర్శించారు. బాధిత కుటుంబానికి చట్టబద్ధంగా రక్షణ కల్పించాలని, అలాగే దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఒక మనిషిపై విచక్షణారహితంగా దాడి చేసిన దోషులను రక్షించే ప్రయత్నాలు జిల్లాలో ఉన్న ప్రముఖ ప్రజా ప్రతినిధులు కేసు నీరుగారిచే పనిలో నిమగ్నం అవ్వడం వలన బాధిత కుటుంబం భయాందోళనకు గురవుతుందని న్యాయం దక్కదేమో! అని ఆందోళనలో ఉన్నారని, వారందరికీ న్యాయం జరిగే వరకు తను అన్ని విధాల అండగా ఉంటానని అనూష యాదవ్ అన్నారు. 

 

ఈ సంఘటన జరిగిన సందర్భాన్ని బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్రయాదవ్ బాధితుడే స్వయంగా ఫోన్లో వివరించగా, బాధిత కుటుంబానికి తోడుగా ఉంటానని అవసరమైన సందర్భంలో కత్తిపూడి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కత్తిపూడి, సీతంపేట గ్రామాలకు సంబంధించిన పలువురు పెద్దలు, యాదవ్ సోదరులు పాల్గొన్నారు.. #Dadala Babji

Search
Categories
Read More
Telangana
చేపమందు ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశృతి
  హైదరాబాద్ - నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ...
By Sidhu Maroju 2025-06-08 14:50:17 0 1K
Telangana
నిజామాబాద్:41 వ డివిజన్ లో ఘనంగ అంబెత్కర్ జయతి వేడుకలు
 నిజామాబాద్:41డివిజాన్ కార్పోరేటర్ ప్రావింగౌడ్ గరి అధ్వర్యమ్లో అంబెత్కర్ 135 వ జయంతి ఘనంగా...
By Sadaq Sadaq 2026-04-14 11:13:29 0 153
Andhra Pradesh
మదనపల్లెలో భర్త ఇంటి ముందర భార్య ధర్నా
మదనపల్లెలోని ప్రశాంత్ నగర్ లో ఆదివారం భర్త కృష్ణ ఇంటి ముందు భార్య రోజా రాణి ధర్నాకు దిగింది. భర్త...
By Pagadala Venkateswar 2026-01-25 12:33:40 0 132
Andhra Pradesh
పుంగనూరు:సింహ వాహనంపై దర్శనమిచ్చిన గోవిందుడు
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ వేంకటరమణ స్వామివారి వార్షిక...
By Kothuru Murali 2026-02-26 12:50:34 0 99
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com