కత్తిపూడి బాధితుడు ముత్తిన రామకృష్ణను పరామర్శించిన BCY పార్టీ అనూష యాదవ్

0
291

కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి దాడికి గురైన ముత్తిన రామకృష్ణను బీసీవై పార్టీ నాయకురాలు డాక్టర్ అనూష యాదవ్ ఆదివారం సాయంత్రం పరామర్శించారు. బాధిత కుటుంబానికి చట్టబద్ధంగా రక్షణ కల్పించాలని, అలాగే దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఒక మనిషిపై విచక్షణారహితంగా దాడి చేసిన దోషులను రక్షించే ప్రయత్నాలు జిల్లాలో ఉన్న ప్రముఖ ప్రజా ప్రతినిధులు కేసు నీరుగారిచే పనిలో నిమగ్నం అవ్వడం వలన బాధిత కుటుంబం భయాందోళనకు గురవుతుందని న్యాయం దక్కదేమో! అని ఆందోళనలో ఉన్నారని, వారందరికీ న్యాయం జరిగే వరకు తను అన్ని విధాల అండగా ఉంటానని అనూష యాదవ్ అన్నారు. 

 

ఈ సంఘటన జరిగిన సందర్భాన్ని బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్రయాదవ్ బాధితుడే స్వయంగా ఫోన్లో వివరించగా, బాధిత కుటుంబానికి తోడుగా ఉంటానని అవసరమైన సందర్భంలో కత్తిపూడి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కత్తిపూడి, సీతంపేట గ్రామాలకు సంబంధించిన పలువురు పెద్దలు, యాదవ్ సోదరులు పాల్గొన్నారు.. #Dadala Babji

Search
Categories
Read More
Andhra Pradesh
పేదల కళ్ళలో సంక్రాంతి వెలుగులు సంక్రాంతి కానుకగా పేదలందరికీ ఇళ్ల పట్టాలు
*పత్రికా ప్రకటన* *విజయవాడ,13.01.2026*    *పేదల కళ్ళలో సం'క్రాంతి' వెలుగులు...*...
By Rajini Kumari 2026-01-13 15:54:27 0 133
Telangana
తెలంగాణలో భారీ వర్షాలు: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్
వాతావరణ హెచ్చరిక: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఏడు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో...
By Triveni Yarragadda 2025-08-11 14:11:19 0 1K
Andhra Pradesh
ఇంధన పొదుపుతో భావితరాలకు భరోసా గుడివాడ వెనిగండ్ల రాము
*ఇంధన పొదుపుతో భావితరాలకు భరోసా: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*   *ఇంధన పొదుపు...
By Rajini Kumari 2025-12-15 07:35:34 0 178
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com