ఎం.పి. చేతుల మీదుగా నూతనసంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.|

0
134

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  చిల్కనగర్ డివిజన్ శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, ఈటల రాజేందర్ తో పాటు, శాసనసభ మాజీ సభ్యులు బేతి సుభాష్ రెడ్డి, MBC కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ తడూరి శ్రీనివాస్.పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ...

క్యాలెండర్ మన ఉనికికి చిహ్నం. 

గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు మనం గొప్పగా బ్రతికిన వాళ్ళం. 

సమాజానికి నాగరికత అందించిన వాళ్ళం. 

మిషన్లు వచ్చిన తర్వాత మనం ఆగమైపోయాము.

అయినా పట్టుదలతో చదువుకొని ఉద్యోగాలు సంపాదించి చాలామంది సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

కులంలో ఉన్న పేదవారిని, తల్లిదండ్రులు లేని వారిని, చదువుకు దూరంగా ఉన్నవారిని అక్కున చేర్చుకొని వారికి కావలసిన సాయం అందించాలని మీ అందరిని కోరుతున్నాను. 

ప్రభుత్వం పట్టించుకున్న తర్వాత కూడా ఇంకా దీనమైన బ్రతుకులలో చాలా మంది ఉంటాయి. 

మన సంఘం మన ఐక్యత అలాంటి కుటుంబాలకు మీరు ఒంటరి కాదు మేమంతా ఉన్నాము అని భరోసా కల్పించాలి కుటుంబ సభ్యులుగా వారిని ఆదరించాలని కోరుకుంటున్నాను.

స్మశాన వాటిక కావాలని కోరుతున్నారు.. జాగా ఉంటే నా వంతుగా ప్రయత్నం చేసి వాటిని కేటాయించే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ ఆపద ఉన్నా, అవసరం ఉన్న మాలాంటి వారం మీ వెంట ఉంటామని తెలియజేస్తూ..  అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో ఉప్పల్ అసెంబ్లీ కన్వీనర్ బాలచందర్, చిల్కనగర్ డివిజన్ ప్రెసిడెంట్ దత్తసాయి, ఫణిందర్, సంపత్ ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

#sidhumaroju 

Calendar. innovation

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య: రైతన్నా.. ‘సైబర్ నేరగాళ్ల లింకులతో జాగ్రత్త’.
ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లోకి జమ చేసిన పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు అందాయి. ఈ నేపథ్యంలో...
By Pagadala Venkateswar 2026-03-14 03:12:09 0 89
Andhra Pradesh
మత్తు పదార్థాలతో కుటుంబాలు చిన్నాభిన్నం
మత్తు పదార్దాలు వలన కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-03-03 12:59:40 0 131
Andhra Pradesh
జగ్గయ్యపేటలో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు మంచినీటి సౌకర్యం కొరకు 100 కోట్లు మంజూరు
*ప్ర‌చుర‌ణార్థం* *08-01-2026*   జ‌గ్గ‌య్య‌పేట‌లో డిఫెన్స్...
By Rajini Kumari 2026-01-08 11:41:13 0 120
Andhra Pradesh
కొత్తగూడెంలో ప్రభుత్వ టీచర్ హత్య
కొత్తగూడెంలో ప్రభుత్వ టీచర్ హత్య! తెలంగాణ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం వన్ టౌన్...
By Chennaiah Kati 2026-03-09 13:31:51 0 132
Telangana
ఆశాడమాస బోనాలు.. అమ్మ వార్లను దర్శించుకుని పూజలలో పాల్గొన్న బీజేపీ నాయకులు.
హైదరాబాద్/సికింద్రాబాద్. ఆషాడ మాస లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గం లోని చిలకలగూడ...
By Sidhu Maroju 2025-07-21 07:58:49 0 972
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com