అల్వాల్ పీఎస్ పరిధిలో హత్య కలకలం.|

0
202

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పి.ఎస్. ఎస్ హెచ్ ఓ  ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం,  ఈ నెల 4వ తేదీ తెల్లవారు జామున ఆనంద్ రావు నగర్ కు చెందిన తిలక్ రాజ్ (28) పై లక్ష్మణ్ యాదవ్, సోను యాదవ్, రాము, మరియు అంజి అనే వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తిలక్ రాజ్ కు తీవ్ర గాయాలయ్యాయి.  

క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం  వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితుడు ఆదివారం మధ్యాహ్నం సుమారు 2:30 ప్రాంతంలో మృతి చెందినట్లు ఆయన తెలిపారు. 

పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో నిందితులు మరియు మృతుడు బంధువులని కుటుంబ కలహాల కారణాల గానే ఈ ఘటన జరిగినట్టు తేలిందన్నారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు నిందితులను వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 

ఈ ఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే  తెలియజేస్తామని ఆయన తెలిపారు.

#sidhumaroju

 

Search
Categories
Read More
Andhra Pradesh
మీ భూమి – మీ హక్కు పెద్దారవీడు మండలం, గొబ్బూరు గ్రామ సచివాలయం వద్ద ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం.
మీ భూమి – మీ హక్కు పెద్దారవీడు మండలం, గొబ్బూరు గ్రామ సచివాలయం వద్ద ప్రభుత్వ రాజముద్రతో...
By Chennaiah Kati 2026-02-06 11:00:57 0 207
Andhra Pradesh
మదనపల్లె : ఆర్ఓ పల్లవికి వరస్ట్ వారెంట్.
మదనపల్లె మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ జీవి పల్లవికి హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్లాన్...
By Pagadala Venkateswar 2026-04-13 05:47:22 0 127
Andhra Pradesh
అధ్వానంగా మారిన వేలంక రోడ్డు
కిర్లంపూడి మండలం వేలంక గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంతో అధ్వానంగా తయారయిందని...
By Nandika Jayababu 2026-03-18 07:54:51 0 503
Andhra Pradesh
ఆంధ్రా భోజనం రుచికి జపాన్ దౌత్య సిబ్బంది ఫిదా... సీఎం చంద్రబాబు స్పందన.
ఢిల్లీలోని ఏపీ భవన్‌లో భోజనం చేసిన జపాన్ దౌత్య సిబ్బంది ఆంధ్రా థాలీ రుచులు అద్భుతమంటూ సోషల్...
By Pagadala Venkateswar 2026-01-21 06:05:37 0 175
Telangana
హిందూ స్మశాన వాటికను కాపాడండి - కాలనీవాసుల మొర.|
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : ఆల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలో నూతనంగా ఏర్పాటు అయిన 190 డివిజన్ లో...
By Sidhu Maroju 2025-12-17 06:01:26 0 247
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com