హిందూ స్మశాన వాటికను కాపాడండి - కాలనీవాసుల మొర.|

0
246

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : ఆల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలో నూతనంగా ఏర్పాటు అయిన 190 డివిజన్ లో గతంలో హిందూ స్మశానవాటిక గురించి తుర్కపల్లి బంధం బావి వద్ద సర్వే నంబర్ 8 లో సుమారు 2.38 ac (రెండు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలు) హిందూ స్మశానవాటికను తుర్కపల్లి, బంధం బావి, పెన్షన్ పుర, బుడగ జంగాల కాలనీ వాసులకోసం ఏర్పాటు చేశారు.ఇప్పుడు ఈ స్మశాన వాటికలో దాదాపు 1.38 ac (ఎకరా ముప్పై ఎనిమిది గుంటలు) ఆక్రమించుకొని ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నారు. మిగితా ఎకరం కూడా అణ్యాక్రాంత మవుతోంది. కనీసం వున్న ఈ కాస్త భూమినైనా కాపాడాలని కాలనీల వాసులు డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా దీనిపై రాజకీయ నాయకులకు, అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్న పలితం లేదని వాపోయారు. వున్న స్మశాన వాటికలో అంత్యక్రియలు అయిన తర్వాత కనీసం శుభ్రపరుచు కోవడానికి నీటి వసతి కూడా లేదని తెలిపారు. 

ఇప్పటి కైనా అధికారులు స్పందించి ఒక బోరు నీటి సౌకర్యంతో పాటు, చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి కనీస వసతులను కల్పిస్తూ, ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 

ఈ ధర్నా కార్యక్రమంలో.. మహేష్, సూర్యకుమార్, కొలపురం నర్సంగ్రావు, చంద్ర కుమార్, భాస్కర్, బాలయ్య, బలరాం,శోభన్ బాబు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
పశు ఆరోగ్య శిబిరాల ద్వారా పసుగణ రంగానికి పునర్ వైభవం
*Press Release*     *పశు ఆరోగ్య శిబిరాల ద్వారా పశుగణ రంగానికి పునర్వైభవం*  ...
By Rajini Kumari 2026-01-19 11:18:11 0 164
Andhra Pradesh
పుంగునూరు శుభరాత్రి డిగ్రీ కళాశాలలో ప్రారంభమైన అడ్మిషన్లు
పుంగనూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్...
By Kothuru Murali 2026-05-25 15:49:53 0 78
Telangana
నిజామాబాద్
Heartiest birthday wishes to the Hon’ble President of India, Smt. Droupadi Murmu Ji. Her...
By Sadaq Sadaq 2026-06-20 12:01:54 0 155
Andhra Pradesh
కోటి సంతకాల సేకరణలో భాగంగా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు పేరుని నాని జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పల హారిక గారు తదితరులు పాల్గొన్నారు
*కోటి సంతకాల సేకరణ లో భాగంగా కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా తాడేపల్లి...
By Rajini Kumari 2025-12-15 11:37:55 0 204
Andhra Pradesh
మదనపల్లిలో ఆటోలపై స్పెషల్ డ్రైవ్.
మదనపల్లి జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి అశోక్ ప్రతాప్ రావు ఆధ్వర్యంలో అమ్మ చెరువు మిట్ట వద్ద...
By Pagadala Venkateswar 2026-02-28 07:24:48 0 142
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com