వైయ‌స్సార్సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా సావిత్రీ బాయి పూలే జ‌యంతి వేడుకలు.

0
191

జ‌యంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు, పార్టీ లీగ‌ల్ సెల్ అధ్య‌క్షుడు మ‌ల‌సాని మ‌నోహ‌ర్‌రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి క‌న‌కారావు, పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్ష‌న‌ర్స్ వింగ్ అధ్య‌క్షులు న‌ల‌మారు చంద్ర‌శేఖర్ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్య‌క్షులు నారాయ‌ణ మూర్తి, బీసీ సెల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ద‌స్త‌గిరితోపాటు ప‌లు పార్టీ విభాగాలనాయ‌కులు, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను హాజరు. 

- సావిత్రీ బాయి పూలే జీవితం స్ఫూర్తిదాయకం

- మహిళాభ్యుదయం, మహిళా సాధికారత సాధనలో ఆమె సేవలు చిరస్మరణీయం : వైయస్సార్సీపీ నేతలు

తాడేప‌ల్లి:

మ‌హిళ‌ల్లో అక్ష‌రాస్య‌త పెంచ‌డం ద్వారా మహిళాభ్యుదం, సాధికార‌త సాధ్య‌మ‌ని గ్ర‌హించి అందుకోసం పాటుబ‌డిన మ‌హ‌నీయురాలు సావిత్రీబాయి పూలే అని వైయస్సార్సీపీ నాయ‌కులు కొనియాడారు. సావిత్రీబాయి పూలే జ‌యంతి సందర్భంగా తాడేపల్లి వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. పార్టీ నాయ‌కులు ఆమె చిత్ర‌ప‌టానికి పూల‌మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రీ బాయి పూలే ఆశ‌యాల‌కు అనుగుణంగానే గ‌త వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో విద్యారంగంలో మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గారు వినూత్న మార్పులు తీసుకురావ‌డ‌మే కాకుండా మహిళ‌ల‌ను ఉన్న‌త స్థానాల్లో నిల‌బెట్టి రాజ‌కీయంగా ప్రోత్స‌హించార‌ని గుర్తు చేశారు. ఆఖ‌రి శ్వాస వ‌రకు కూడా ప్ర‌జా సేవ‌లోనే గ‌డిపిన సావిత్రీ బాయి జీవితం నేటి రాజ‌కీయ నాయ‌కుల‌కు ఆద‌ర్శ‌మ‌న్నారు. ఎన్నో అవ‌మానాలు, అవ‌రోధాల‌ను దాటుకుని భ‌ర్త స‌హకారంతో మహిళ‌ల కోసం విద్యాల‌యాలు స్థాపించి వారి అభ్యున్న‌తి కోసం కృషి చేశార‌ని చెప్పారు.

Search
Categories
Read More
Telangana
నర్స్ వృత్తి అమ్మ చేసే సేవ లాంటిదే- ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఈశ్వరీ బాయి మెమోరియల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల ఫేర్ వెల్...
By Sidhu Maroju 2025-12-19 16:26:04 0 193
Andhra Pradesh
క్యూఆర్ కోడ్ ఆధారత డిజిటల్ డోర్ నంబరింగ్ వ్యవస్థపై ఒకటి రెండు మూడు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
విజయవాడ నగరపాలక సంస్థ 16-05-2026     *క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నంబరింగ్...
By Rajini Kumari 2026-05-16 14:42:33 0 67
Telangana
నిజామాబాద్: ఏప్రిల్ 25 కొత్తపార్టీ ప్రకటన
ఏప్రిల్ 25వ  తేధిన తాన పార్టిని ప్రకటిన్‌చానున్నట్లు నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే, జాగృతి...
By Sadaq Sadaq 2026-03-27 13:54:21 0 146
Andhra Pradesh
నిమ్మనపల్లి మండలంలో కోడిపందేలు: 8 మంది అరెస్ట్
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలోని బండ్లపై ప్రాంతంలో కోడిపందేలు ఆడుతున్న ఎనిమిది మందిని...
By Pagadala Venkateswar 2026-01-15 07:10:09 0 134
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com