ముఖ్యమంత్రి గారి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారు.

0
162

📍 గుంటూరు, లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో ఈ నెల 3,4, 5వ తేదీల్లో జరగనున్న 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా.చంద్రబాబు నాయుడు గారు 5వ తేదీన హాజరు కానున్నారు.

🚩 గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటనకు సంబంధించి స్పిరిచువల్ సిటీలో జరుగుతున్న ఏర్పాట్లను ఈ రోజు ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారీయా IAS గారు, ఇతర పోలీస్ అధికారులతో కలసి పర్యటించి, జిల్లా ఎస్పీ గారు పరిశీలించారు.

❇️ స్పిరిచువల్ సిటీలో ఏర్పాటు చేసిన సభా వేదికను, సభా ప్రాంగణాన్ని, హెలిపాడ్ నిర్మాణాన్ని, వీవీఐపీ గారి రాకపోకల మార్గాలను పరిశీలించి, సంబంధిత అధికారులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

 ❇️ సభలకు హాజరయ్యే ప్రముఖుల భద్రతను దృష్టిలో పెట్టుకొని,సభా వేదిక, సభా ప్రాంగణం,వీవీఐపీ మార్గాలు, హెలిప్యాడ్ మొదలగు ప్రదేశాల్లో క్షుణ్ణంగా భద్రతా తనిఖీలు చేపట్టాలని, అవసరమైన చోట భారీ కేడింగ్ ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులకి సూచించారు.

👉 ఈ కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా అదనపు ఎస్పీలు శ్రీ ATV రవికుమార్ గారు(L&O), శ్రీ ఏ హనుమంతు గారు(ఏఆర్), ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ గారు, ఎస్బి డీఎస్పీ శ్రీనివాసులు గారు, ఎస్బి సీఐ అలహరి శ్రీనివాస్ గారు, లాలాపేట సీఐ శివ ప్రసాద్ గారు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
అల్వాల్ సర్కిల్ ఫాదర్ బాలయ్య నగర్ కాలనీ సమస్యలు - గత పది నెలలుగా ప్రజల ఇబ్బందులు.
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా :  అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఫాదర్ బాలయ్య నగర్ కాలనీ ప్రజలు...
By Sidhu Maroju 2025-08-31 04:12:28 0 337
Andhra Pradesh
గాలివీడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీడీపీ తెలుగుదేశం పార్టీ గాలివీడు అధ్యక్షుడు లక్కిం శ్రీహరి నాయుడు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ గాలివీడు మండలం ఐ టి డి...
By Benguluri Madhubabu 2026-02-28 05:32:54 0 134
Andhra Pradesh
పగటిపూట ఇంటి నేరాలు చేసే అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 65 చోట్ల దొంగతనాలకు పాల్పడిన నిందితుడు
పగటిపూట ఇంటి నేరాలు చేసే అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 65 చోట్ల...
By Gadiyapudi Narendra 2026-01-17 16:44:07 0 136
Telangana
రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తో కలిసి కాచిగూడ -భగవతి రైల్ వే స్టేషన్ కు మొదటి రైలు ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ జిల్లా/కాచిగూడ.  రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో కలిసి కేంద్ర బొగ్గు గనుల శాఖ...
By Sidhu Maroju 2025-07-19 17:13:19 0 949
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com