ముఖ్యమంత్రి గారి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారు.

0
185

📍 గుంటూరు, లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో ఈ నెల 3,4, 5వ తేదీల్లో జరగనున్న 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా.చంద్రబాబు నాయుడు గారు 5వ తేదీన హాజరు కానున్నారు.

🚩 గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటనకు సంబంధించి స్పిరిచువల్ సిటీలో జరుగుతున్న ఏర్పాట్లను ఈ రోజు ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారీయా IAS గారు, ఇతర పోలీస్ అధికారులతో కలసి పర్యటించి, జిల్లా ఎస్పీ గారు పరిశీలించారు.

❇️ స్పిరిచువల్ సిటీలో ఏర్పాటు చేసిన సభా వేదికను, సభా ప్రాంగణాన్ని, హెలిపాడ్ నిర్మాణాన్ని, వీవీఐపీ గారి రాకపోకల మార్గాలను పరిశీలించి, సంబంధిత అధికారులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

 ❇️ సభలకు హాజరయ్యే ప్రముఖుల భద్రతను దృష్టిలో పెట్టుకొని,సభా వేదిక, సభా ప్రాంగణం,వీవీఐపీ మార్గాలు, హెలిప్యాడ్ మొదలగు ప్రదేశాల్లో క్షుణ్ణంగా భద్రతా తనిఖీలు చేపట్టాలని, అవసరమైన చోట భారీ కేడింగ్ ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులకి సూచించారు.

👉 ఈ కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా అదనపు ఎస్పీలు శ్రీ ATV రవికుమార్ గారు(L&O), శ్రీ ఏ హనుమంతు గారు(ఏఆర్), ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ గారు, ఎస్బి డీఎస్పీ శ్రీనివాసులు గారు, ఎస్బి సీఐ అలహరి శ్రీనివాస్ గారు, లాలాపేట సీఐ శివ ప్రసాద్ గారు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో టీడీపీ సీనియర్ నాయకుడు రవీంద్ర మృతి.
మదనపల్లె పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, గ్రీన్ వ్యాలీ స్కూల్ యజమాని రవీంద్ర...
By Pagadala Venkateswar 2026-02-19 06:23:38 0 129
Telangana
నిజామాబాద్
ఈరోజు 39 వ డివిజన్ లో రోడ్డు విస్తరణలో భాగంగా, మున్సిపల్ అధికారులు, చేపట్టిన కార్యక్రమంలో...
By Sadaq Sadaq 2026-04-30 09:30:03 0 99
Andhra Pradesh
బాణాసంచా ప్రమాదంలో క్షతగాత్రులను పరామర్శించిన కందుల దుర్గేష్
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణాసంచా తయారీ కేంద్ర పేలుడు ఘటనలో...
By Ratna Sekhar 2026-02-28 19:30:29 0 1K
Andhra Pradesh
మాఘ శుద్ధ విదియ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారి...
బాపట్ల: మాఘ శుద్ధ విదియ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని...
By Gadiyapudi Narendra 2026-01-20 12:27:21 0 178
Telangana
నార్త్ జోన్ టాస్క్ పోర్స్ డి.సి.పి. సుదీంద్ర ప్రెస్ మీట్.
సికింద్రాబాద్.. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపును కొంతమంది...
By Sidhu Maroju 2025-06-18 12:26:52 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com