ముఖ్యమంత్రి గారి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారు.

0
186

📍 గుంటూరు, లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో ఈ నెల 3,4, 5వ తేదీల్లో జరగనున్న 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా.చంద్రబాబు నాయుడు గారు 5వ తేదీన హాజరు కానున్నారు.

🚩 గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటనకు సంబంధించి స్పిరిచువల్ సిటీలో జరుగుతున్న ఏర్పాట్లను ఈ రోజు ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారీయా IAS గారు, ఇతర పోలీస్ అధికారులతో కలసి పర్యటించి, జిల్లా ఎస్పీ గారు పరిశీలించారు.

❇️ స్పిరిచువల్ సిటీలో ఏర్పాటు చేసిన సభా వేదికను, సభా ప్రాంగణాన్ని, హెలిపాడ్ నిర్మాణాన్ని, వీవీఐపీ గారి రాకపోకల మార్గాలను పరిశీలించి, సంబంధిత అధికారులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

 ❇️ సభలకు హాజరయ్యే ప్రముఖుల భద్రతను దృష్టిలో పెట్టుకొని,సభా వేదిక, సభా ప్రాంగణం,వీవీఐపీ మార్గాలు, హెలిప్యాడ్ మొదలగు ప్రదేశాల్లో క్షుణ్ణంగా భద్రతా తనిఖీలు చేపట్టాలని, అవసరమైన చోట భారీ కేడింగ్ ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులకి సూచించారు.

👉 ఈ కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా అదనపు ఎస్పీలు శ్రీ ATV రవికుమార్ గారు(L&O), శ్రీ ఏ హనుమంతు గారు(ఏఆర్), ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ గారు, ఎస్బి డీఎస్పీ శ్రీనివాసులు గారు, ఎస్బి సీఐ అలహరి శ్రీనివాస్ గారు, లాలాపేట సీఐ శివ ప్రసాద్ గారు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
"కానాజిగూడలో జయంతి ఉత్సాహం… అంబేద్కర్‌కు ఘన గౌరవం.!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన...
By Sidhu Maroju 2026-04-14 12:47:40 0 168
Andhra Pradesh
చౌడేపల్లి లో వాస్మోల్ తాగి యువతి ఆత్మహత్యాయత్నం.
అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలానికి చెందిన భవన కార్మికుడు మునీశ్వర్, రోజూ సంపాదించిన కూలీ డబ్బును...
By Pagadala Venkateswar 2026-02-01 07:53:45 0 112
Andhra Pradesh
సోమల: ద్విచక్ర వాహనంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
అన్నమయ్య జిల్లా, సోమల మండలం, ఎస్ నడింపల్లి వద్ద గత నెల 27న ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో...
By Kothuru Murali 2026-05-03 16:37:11 0 67
Telangana
హైకోర్టులో హైడ్రాకు షాక్ - బతుకమ్మ కుంట బోర్డులు తొలగించాలంటూ ఆదేశాలు .|
హైదరాబాద్‌లో హైడ్రాకు మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. బాగ్ అంబర్‌పేట్ ప్రాంతంలోని...
By Sidhu Maroju 2026-03-17 17:14:37 0 168
Andhra Pradesh
పుంగనూరు: బోయకొండ గంగమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యేలు
శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని దిగువపల్లి శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారిని...
By Kothuru Murali 2026-04-04 06:13:48 0 117
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com