అభయ అమృత వర్షిణి బదిరుల పాఠశాలలో పోలీసుల నూతన సంవత్సర వేడుకలు.|

0
85

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అభయ అమృత వర్షిణి బదిరుల (చెవిటి మరియూ మూగ) పాఠశాలలో కమ్యూనిటీ అవుట్ రీచ్ మరియు సమ్ములిత చొరవలో భాగంగా గోపాలపురం డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపి)  పి.సుబ్బయ్య విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.

మారేడుపల్లి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్ హెచ్ ఓ) నోముల వెంకటేష్, సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతి, మరియు సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ వేడుకలో మొత్తం 38 మంది పాఠశాల విద్యార్థులు, పాఠశాల నిర్వహకులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా విద్యార్థుల మధ్యన కేక్ కట్ చేసిన పోలీసు సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏసీపీ మరియు ఇతర పోలీసు అధికారులు విద్యార్థులతో ఆత్మీయంగా సంభాషించి, వారికి ధైర్యాన్ని ఉత్సాహాన్ని అందించారు. విద్యార్థుల మధ్యన సంరక్షణ, మరియు సామాజిక బాధ్యత కలిగి ఉండాలని వారు నొక్కి చెప్పారు. 

తమతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకుని, ఈరోజును చిరస్మరణీయం చేసినందుకు విద్యార్థులు, మరియు నిర్వాహకులు హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. 

హైదరాబాద్ పోలీసుల మానవీయ కోణాన్ని, మరియు స్నేహపూర్వక విధానాన్ని  (people friendly policing)  చాటి చెప్పేలా ఈ కార్యక్రమం సాగింది. 

ఇది పోలీసులకు మరియు ప్రజలకు మధ్య బంధాన్ని బలోపేతం చేసింది.

#sidhumaroju.

Search
Categories
Read More
Telangana
జర్నలిస్ట్ ల అక్రమ నిర్బంధం పై సిపికి జర్నలిస్టుల ఫిర్యాదు.
   హైదరాబాద్ /సికింద్రాబాద్.   శాంతిభద్రతల పరిరక్షణలో జర్నలిస్టుల సహాకారం...
By Sidhu Maroju 2025-08-05 17:27:05 0 662
Telangana
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ చరిత్ర.
1813వ సంవత్సరంలో మిలటరీలో పనిచేస్తున్న సికింద్రాబాద్‌కు చెందిన సూరీటి అయ్యప్ప...
By Sidhu Maroju 2025-07-11 07:55:22 0 1K
Andhra Pradesh
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు...
By Benguluri Madhubabu 2026-01-31 04:24:01 0 131
Andhra Pradesh
అఖండ-2 చిత్ర నిర్మాణ సంస్థకు హైకోర్టులో ఊరట
 అఖండ-2 చిత్ర నిర్మాణ సంస్థకు తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో ఊరట లభించింది....
By SivaNagendra Annapareddy 2025-12-12 10:06:18 0 289
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : గార్గేయ స్వామి ఆలయంలో శివరాత్రికి ముమ్మర ఏర్పాట్లు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, దుర్గం కొండపై వెలసిన శ్రీ గార్గేయ మహాముని...
By Kothuru Murali 2026-02-13 06:09:33 0 17
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com