అభయ అమృత వర్షిణి బదిరుల పాఠశాలలో పోలీసుల నూతన సంవత్సర వేడుకలు.|

0
158

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అభయ అమృత వర్షిణి బదిరుల (చెవిటి మరియూ మూగ) పాఠశాలలో కమ్యూనిటీ అవుట్ రీచ్ మరియు సమ్ములిత చొరవలో భాగంగా గోపాలపురం డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపి)  పి.సుబ్బయ్య విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.

మారేడుపల్లి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్ హెచ్ ఓ) నోముల వెంకటేష్, సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతి, మరియు సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ వేడుకలో మొత్తం 38 మంది పాఠశాల విద్యార్థులు, పాఠశాల నిర్వహకులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా విద్యార్థుల మధ్యన కేక్ కట్ చేసిన పోలీసు సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏసీపీ మరియు ఇతర పోలీసు అధికారులు విద్యార్థులతో ఆత్మీయంగా సంభాషించి, వారికి ధైర్యాన్ని ఉత్సాహాన్ని అందించారు. విద్యార్థుల మధ్యన సంరక్షణ, మరియు సామాజిక బాధ్యత కలిగి ఉండాలని వారు నొక్కి చెప్పారు. 

తమతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకుని, ఈరోజును చిరస్మరణీయం చేసినందుకు విద్యార్థులు, మరియు నిర్వాహకులు హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. 

హైదరాబాద్ పోలీసుల మానవీయ కోణాన్ని, మరియు స్నేహపూర్వక విధానాన్ని  (people friendly policing)  చాటి చెప్పేలా ఈ కార్యక్రమం సాగింది. 

ఇది పోలీసులకు మరియు ప్రజలకు మధ్య బంధాన్ని బలోపేతం చేసింది.

#sidhumaroju.

Search
Categories
Read More
Telangana
ముస్లిం సోదరులకు తోఫా : మాజీ కార్పొరేటర్ ఉదారత.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బోలారంలోని తుర్కపల్లి జమా...
By Sidhu Maroju 2026-03-14 10:11:26 0 120
Andhra Pradesh
నారా లోకేష్ ఆత్మీయ కలయిక
ఆత్మీయ క‌ల‌యిక‌.. ఇల్లే వేదిక‌  -విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి...
By Rajini Kumari 2026-02-13 09:18:20 0 157
Telangana
"రైల్వే స్టేషన్‌లో.. గంజాయి గుట్టురట్టు”
సికింద్రాబాద్ : దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో...
By Sidhu Maroju 2026-05-08 11:41:01 0 136
Telangana
ఆర్టీసీపై కాంగ్రెస్ కుట్రలు.. ఎవడబ్బ జాగీరు అని డిపోలను ధారాదత్తం చేస్తారు?: తలసాని నిప్పులు.|
సికింద్రాబాద్ : తొంభై ఏళ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన ఆర్టీసీ మనుగడకు కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పు...
By Sidhu Maroju 2026-04-23 06:27:43 0 196
Telangana
'భూమా'సురులనుండి రక్షించండి- భాధితుల ఆవేదన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  తమకు చెందిన స్థలంలో కోర్టు స్టేటస్ కో ఉత్తర్వు ఉండగా కొందరు...
By Sidhu Maroju 2025-11-29 15:56:23 0 171
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com