సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హత్య కేసులో ఆరుగురు మహిళలకు జీవిత ఖైదు.|

0
84

హైదరాబాద్ : ఐదేళ్ల క్రితం జరిగిన హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హత్య కేసులో మృతుడి భార్యతో పాటు మరో ఐదుగురు మహిళలకు జీవిత ఖైదు విధిస్తూ జగిత్యాల జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.

 

అల్వాల్ కు చెందిన రాచర్ల పవన్ కుమార్(38) సజీవ దహనం కేసులో న్యాయమూర్తి ఈ తీర్పును వెలువరించారు.

 

ఈ కేసు వివరాల్లోకి వెళితే... జగిత్యాలకు చెందిన విజయ్ కొండగట్టుకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఓ కుట్టిరాన్ని నిర్మించుకున్నాడు. అయితే విజయ్ తమ్ముడు జగన్ అనారోగ్యంతో మృతి చెందాడు.

విజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బావ పవన్ కుమార్ భార్య కృష్ణవేణి లతో కలిసి 2020 అక్టోబర్ 20 న కుటీరానికి చేరుకున్నాడు.

 

అయితే పవన్ కుమార్ తన భర్తకు చేతబడి చేసి చంపించాడని ఆరోపిస్తూ అక్కడే ఉన్న జగన్ భార్య సుమలత భర్తతో కలిసి అతన్ని కుటీరంలో బంధించి పెట్రోల్ ఒంటిపై పోసి నిప్పంటించింది.

 

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గది తాళం తీయగా పవన్ పూర్తిగా దహనమయ్యాడు. 

 

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా పవన్ కుమార్ భార్య కృష్ణవేణి తో పాటు మరో ఐదుగురు మహిళలు ఈ కేసులో నిందితులుగా తేలారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ సాక్షదారాలను పరిశీలించిన న్యాయస్థానం కృష్ణవేణి సహా ఆరుగురు మహిళలకు జీవిత ఖైధు తో పాటు రూ. పదివేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. 

 

#sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ కష్టాలు
*ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*   *ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ట్రాఫిక్ ట్రాఫిక్ డిసిపి...
By Rajini Kumari 2026-01-18 14:15:21 0 74
Andhra Pradesh
గుంటూరు వెస్ట్ డీస్పీ శ్రీ కె. అరవింద్ గారు విద్యార్థులకు మాదగద్రవ్యాల అవగాహన సదస్సు సంకల్పం కార్యక్రమం చేసినారు. గుంటూరు జిల్లా ఎస్పీ మరియు ఐజి ఆదేశాల మేరకు.
గుంటూరు జిల్లా పోలీస్...* *పట్టాభిపురం పోలీస్ స్టేషన్* *తేది: 31.12.2025* _*//“డ్రగ్స్...
By KOTESWARARAO KVSR 2025-12-31 12:18:11 0 205
Bharat Aawaz
Justice for Every Indian – A Call We Can’t Ignore
Fake Encounter or Miscarriage of Justice in Punjab? Two young men, Jaspreet Singh and Ram...
By Citizen Rights Council 2025-07-10 13:24:34 0 1K
Telangana
సంక్రాంతి శోభ - ముగ్గుల ప్రభ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  ప్రజా పాలనలో మహిళలకు పెద్దపీట వేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...
By Sidhu Maroju 2026-01-12 10:07:54 0 126
Andhra Pradesh
అమరావతిలో నిర్వహించిన గణతంత్ర వేడుకలలో పాల్గొన్న కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు !!
కర్నూలు సిటీ :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని  అమరావతిలో  మొదటిసారిగా నిర్వహించిన...
By Hari Krishna 2026-01-26 08:28:12 0 141
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com