సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హత్య కేసులో ఆరుగురు మహిళలకు జీవిత ఖైదు.|
హైదరాబాద్ : ఐదేళ్ల క్రితం జరిగిన హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హత్య కేసులో మృతుడి భార్యతో పాటు మరో ఐదుగురు మహిళలకు జీవిత ఖైదు విధిస్తూ జగిత్యాల జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
అల్వాల్ కు చెందిన రాచర్ల పవన్ కుమార్(38) సజీవ దహనం కేసులో న్యాయమూర్తి ఈ తీర్పును వెలువరించారు.
ఈ కేసు వివరాల్లోకి వెళితే... జగిత్యాలకు చెందిన విజయ్ కొండగట్టుకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఓ కుట్టిరాన్ని నిర్మించుకున్నాడు. అయితే విజయ్ తమ్ముడు జగన్ అనారోగ్యంతో మృతి చెందాడు.
విజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బావ పవన్ కుమార్ భార్య కృష్ణవేణి లతో కలిసి 2020 అక్టోబర్ 20 న కుటీరానికి చేరుకున్నాడు.
అయితే పవన్ కుమార్ తన భర్తకు చేతబడి చేసి చంపించాడని ఆరోపిస్తూ అక్కడే ఉన్న జగన్ భార్య సుమలత భర్తతో కలిసి అతన్ని కుటీరంలో బంధించి పెట్రోల్ ఒంటిపై పోసి నిప్పంటించింది.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గది తాళం తీయగా పవన్ పూర్తిగా దహనమయ్యాడు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా పవన్ కుమార్ భార్య కృష్ణవేణి తో పాటు మరో ఐదుగురు మహిళలు ఈ కేసులో నిందితులుగా తేలారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ సాక్షదారాలను పరిశీలించిన న్యాయస్థానం కృష్ణవేణి సహా ఆరుగురు మహిళలకు జీవిత ఖైధు తో పాటు రూ. పదివేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
#sidhumaroju
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz