శిక్షణా కానిస్టేబుల్ లకు దిశా నిర్దేశం చేసిన కర్నూలు ఎస్పీ !!

0
227

కర్నూలు : 
కర్నూలు జిల్లా...

చట్టాల గురించి తెలుసుకోవాలి ... సాంకేతిక వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలి.

ట్రైనీ కానిస్టేబుల్స్ కు దిశా నిర్దేశం చేసిన...
జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు. 

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి నూతనంగా ఎంపికై, శిక్షణ నిమిత్తం కర్నూలు  జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంకు (డిటిసి)  విచ్చేసిన 205 మంది ఎపిఎస్పీ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు బుధవారం దిశా నిర్దేశం చేశారు. 

క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. 

జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం ను  జిల్లా ఎస్పీ గారు పరిశీలించారు.

కర్నూలు  అమిలియో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఎపిఎస్పీ ట్రైనీ పోలీసులకు  ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ముందుజాగ్రత్తలతో టిటి ఇంజెక్షన్ లు వేయించారు. 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు ట్రైనీ కానిస్టేబుల్ అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు. 

శిక్షణ సమయంలో క్రమశిక్షణతో మెలగాలన్నారు. కొత్త కొత్త నేరాలకు అనుగుణంగా పోలీసులు మరింతగా సాంకేతిక వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు.

సమన్వయంతో, మానవతా దృక్పథంతో పని చేసి, సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలన్నారు. 

చట్టాల గురించి తెలుసుకోవాలన్నారు. 

శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే ఆ రాష్ట్రం బాగుండి అభివృద్ది చెందుతుందని గౌరవ సిఎం గారు తెలిపారన్నారు. 

కానిస్టేబుళ్ళు క్షేత్ర స్థాయిలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారన్నారు. 

9 నెలల పాటు శిక్షణ లో ఔట్ డోర్, ఇండోర్ శిక్షణతో పాటు టెక్నాలజీ, కమ్యూనికేషన్ స్కిల్స్,  ఆయుధాల వినియోగం  పట్ల శిక్షణ ఇస్తామన్నారు.

మారుతున్న నేరాలకు అనుగుణంగా పోలీసు ఉన్నతాధికారులు శిక్షణ లో మార్పులు చేసారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

శిక్షణలో పొందిపర్చిన ప్రతీ అంశం కూడా మిమ్ములను వృత్తిపరంగా నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకే అని గ్రహించాలన్నారు. 

ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం అంకితభావంతో పనిచేయాలన్నారు. 

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ / డి టి సి ప్రిన్సిపాల్  శ్రీ హుస్సేన్ పీరా, కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్, కర్నూలు డిటిసి డిఎస్పీ / వైస్ ప్రిన్సిపాల్ దుర్గ ప్రసాద్, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి గారు,  సిఐలు , ఆర్ఐలు , ఎస్సెలు, ఆర్ ఎస్సైలు, ఇతర సిబ్బంది, అమీలియా హాస్పిటల్  వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అసిస్టెంట్ గవర్నమెంట్ పీడర్ గా సీనియర్ న్యాయవాది శరత్ చంద్ర ప్రసాద్
*అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు గా సీనియర్ న్యాయవాది పొట్లూరి శరత్ చంద్ర ప్రసాద్*  ...
By Rajini Kumari 2026-02-06 09:30:26 0 151
SURAKSHA
​Rema Rajeshwari: A Trailblazer in Modern Indian Policing
Rema Rajeshwari ::A Trailblazer of Modern PolicingTransforming Communities Through Courage and...
By Kalaga Sailaja 2026-07-11 10:26:04 0 57
Mizoram
PM Lays Foundation for PMJVK Development Projects in Siaha, Mizoram
On July 16, 2025, Union Minister George Kurian virtually inaugurated two new infrastructure...
By Bharat Aawaz 2025-07-17 07:05:03 0 1K
Andhra Pradesh
పుంగనూరు: నల్ల బెల్లం స్వాధీనంపై అప్డేట్
కడప ఎన్ఫోర్స్మెంట్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు...
By Kothuru Murali 2026-04-25 03:44:10 0 95
Andhra Pradesh
మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఆర్డీవో బాధ్యతలు
బొబ్బిలి మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఆర్డీవో రామ్మోహనరావు శనివారం బాధ్యతలు...
By Boiena Rajesh 2026-03-21 05:46:50 0 190
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com