రైలు వన్ యాప్ ద్వారా టికెట్లు కొంటే 3 పర్సెంట్ రాయితీ ! రైల్వే

0
164

కర్నూలు # రైల్ వన్ యాప్ ద్వారా టికెట్లు కొంటే 3% రాయితీ

▪️అన్ రిజర్వ్ టికెట్లపై రాయితీ జనవరి 14 నుంచి జులై 14 వరకు.

రైళ్లలో అర్రిజర్వ్డ్ టికెట్లను రైల్ వన్ యాప్ ద్వారా కొని డిజిటల్ విధానంలో చెల్లింపులు చేసేవారికి 3% రాయితీని రైల్వే మంత్రిత్వశాఖ ఇవ్వనుంది. 2026 జనవరి 14 నుంచి జులై 14 వరకు ఇది అమల్లో ఉంటుంది. ఈ యాప్ ద్వారా ఆర్-వ్యాలెట్తో చెల్లింపుల్ని చేసేవారికే ప్రస్తుతం ఈ రాయితీని క్యాష్బ్యాక్ రూపంలో ఇస్తోంది. డిజిటల్ బుకింగ్లను ప్రోత్సహించడానికి ఈ యాప్ ద్వారా జరిగే అన్నిరకాల డిజిటల్ చెల్లింపులకు దీనిని విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. సంబంధిత సాఫ్ట్వేర్లో తగిన మార్పులు చేయాలని 'రైల్వే సమాచార వ్యవస్థ కేంద్రం (క్రిస్)కు మంగళవారం రైల్వేశాఖ ఆదే శాలిచ్చింది. ప్రయాణికుల స్పందన ఎలా ఉందో మే నెలలో తెలియజేస్తే దీనిపై తదుపరి పరిశీలన చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆర్-వ్యాలెట్ ద్వారా ఇప్పటికే ఉన్న రాయితీ కొనసాగుతుందని స్పష్టంచేసింది. ఇతర ఏ ఆన్లైన్ విధానాల్లో కొన్న అన్ రిజర్వ్ టికెట్లకు వర్తించబోదని తేల్చిచెప్పింది.

Search
Categories
Read More
Andhra Pradesh
రామసముద్రం: బండరాయిని ఢీకొన్న బైక్ వ్యక్తికి గాయాలు.
రామసముద్రం - పుంగనూరు రహదారిలోని గాంధీనగర్ సమీపంలో సోమవారం సాయంత్రం ఒక బైక్ అదుపుతప్పి రహదారి...
By Pagadala Venkateswar 2026-02-17 05:23:47 0 95
Andhra Pradesh
రాయచోటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆత్మీయ సమావేశం
రాయచోటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నెలవారి సమావేశం చైర్మన్ శివగంగ రెడ్డి అధ్యక్షతన జరిగింది...
By Benguluri Madhubabu 2026-03-22 07:14:31 0 147
Andhra Pradesh
Chandrababu Naidu: ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. సుదీర్ఘంగా చర్చలు జరిపిన నేతలు.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్ గ్రామీణాభివృద్ధి, టీటీడీ వివాదాలపై...
By Pagadala Venkateswar 2026-03-03 11:21:44 0 79
Andhra Pradesh
స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే వెనుగండ్ల రాము
*స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వామ్యలు కావాలి:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*...
By Rajini Kumari 2026-01-12 13:18:58 0 122
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com