రైలు వన్ యాప్ ద్వారా టికెట్లు కొంటే 3 పర్సెంట్ రాయితీ ! రైల్వే

0
195

కర్నూలు # రైల్ వన్ యాప్ ద్వారా టికెట్లు కొంటే 3% రాయితీ

▪️అన్ రిజర్వ్ టికెట్లపై రాయితీ జనవరి 14 నుంచి జులై 14 వరకు.

రైళ్లలో అర్రిజర్వ్డ్ టికెట్లను రైల్ వన్ యాప్ ద్వారా కొని డిజిటల్ విధానంలో చెల్లింపులు చేసేవారికి 3% రాయితీని రైల్వే మంత్రిత్వశాఖ ఇవ్వనుంది. 2026 జనవరి 14 నుంచి జులై 14 వరకు ఇది అమల్లో ఉంటుంది. ఈ యాప్ ద్వారా ఆర్-వ్యాలెట్తో చెల్లింపుల్ని చేసేవారికే ప్రస్తుతం ఈ రాయితీని క్యాష్బ్యాక్ రూపంలో ఇస్తోంది. డిజిటల్ బుకింగ్లను ప్రోత్సహించడానికి ఈ యాప్ ద్వారా జరిగే అన్నిరకాల డిజిటల్ చెల్లింపులకు దీనిని విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. సంబంధిత సాఫ్ట్వేర్లో తగిన మార్పులు చేయాలని 'రైల్వే సమాచార వ్యవస్థ కేంద్రం (క్రిస్)కు మంగళవారం రైల్వేశాఖ ఆదే శాలిచ్చింది. ప్రయాణికుల స్పందన ఎలా ఉందో మే నెలలో తెలియజేస్తే దీనిపై తదుపరి పరిశీలన చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆర్-వ్యాలెట్ ద్వారా ఇప్పటికే ఉన్న రాయితీ కొనసాగుతుందని స్పష్టంచేసింది. ఇతర ఏ ఆన్లైన్ విధానాల్లో కొన్న అన్ రిజర్వ్ టికెట్లకు వర్తించబోదని తేల్చిచెప్పింది.

Search
Categories
Read More
Andhra Pradesh
బాలికా విద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందించాలి – అనురాధ.
అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్షా APC డాక్టర్ నున్నా అనురాధ శుక్రవారం సూచించిన ప్రకారం, కస్తూరిబా...
By Pagadala Venkateswar 2026-02-13 11:25:30 0 128
Bharat
Civil Services Exam Registrations Witness a Slight Decline in Hyderabad Prelims 2025 scheduled for Sunday
Civil Services Exam Registrations Witness a Slight Decline in HyderabadPrelims 2025 scheduled for...
By BMA ADMIN 2025-05-24 08:15:10 0 3K
Telangana
Karimnagar: యుద్ధం ప్రభావంతో మూతపడుతున్న పెట్రోల్ బంకులు!
Karimnagar 
By Sunka Santhosh 2026-03-25 09:45:18 0 227
Andhra Pradesh
పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మెరిసిన ఆణిముత్యాలు (Z
పుంగనూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్షల్లో శహవార్ 600కు 592 మార్కులతో స్కూల్...
By Kothuru Murali 2026-05-01 12:32:37 0 63
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com