రైలు వన్ యాప్ ద్వారా టికెట్లు కొంటే 3 పర్సెంట్ రాయితీ ! రైల్వే

0
113

కర్నూలు # రైల్ వన్ యాప్ ద్వారా టికెట్లు కొంటే 3% రాయితీ

▪️అన్ రిజర్వ్ టికెట్లపై రాయితీ జనవరి 14 నుంచి జులై 14 వరకు.

రైళ్లలో అర్రిజర్వ్డ్ టికెట్లను రైల్ వన్ యాప్ ద్వారా కొని డిజిటల్ విధానంలో చెల్లింపులు చేసేవారికి 3% రాయితీని రైల్వే మంత్రిత్వశాఖ ఇవ్వనుంది. 2026 జనవరి 14 నుంచి జులై 14 వరకు ఇది అమల్లో ఉంటుంది. ఈ యాప్ ద్వారా ఆర్-వ్యాలెట్తో చెల్లింపుల్ని చేసేవారికే ప్రస్తుతం ఈ రాయితీని క్యాష్బ్యాక్ రూపంలో ఇస్తోంది. డిజిటల్ బుకింగ్లను ప్రోత్సహించడానికి ఈ యాప్ ద్వారా జరిగే అన్నిరకాల డిజిటల్ చెల్లింపులకు దీనిని విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. సంబంధిత సాఫ్ట్వేర్లో తగిన మార్పులు చేయాలని 'రైల్వే సమాచార వ్యవస్థ కేంద్రం (క్రిస్)కు మంగళవారం రైల్వేశాఖ ఆదే శాలిచ్చింది. ప్రయాణికుల స్పందన ఎలా ఉందో మే నెలలో తెలియజేస్తే దీనిపై తదుపరి పరిశీలన చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆర్-వ్యాలెట్ ద్వారా ఇప్పటికే ఉన్న రాయితీ కొనసాగుతుందని స్పష్టంచేసింది. ఇతర ఏ ఆన్లైన్ విధానాల్లో కొన్న అన్ రిజర్వ్ టికెట్లకు వర్తించబోదని తేల్చిచెప్పింది.

Search
Categories
Read More
Life Style
Wellness & Sustainable Living
Wellness & Sustainable Living Charu Asopa Leads the Way in Eco-Friendly Living with Solar...
By BMA ADMIN 2025-05-23 09:34:58 0 2K
Telangana
మెదక్ జిల్లాలోని చర్చలలో పిస్ట్ సెలబ్రేషన్స్కు 34 లక్షల మంజూరు... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ జిల్లా రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండగను పురస్కరించుకొని మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్...
By Gangaram Rangagowni 2025-12-25 02:18:06 0 132
Telangana
అల్వాల్ పీఎస్ పరిధిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బటన్‌గూడ బొల్లారం రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో వేప...
By Sidhu Maroju 2025-06-22 08:01:45 0 1K
Andhra Pradesh
మైనర్ బాలురు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులే బాధ్యులని ఆయన హెచ్చరించారు
పుంగనూరు పట్టణంలో సీఐ సుబ్బరాయుడు, సిబ్బంది కలిసి శనివారం వాహనాల తనిఖీని నిర్వహించారు. జిల్లా...
By Kothuru Murali 2026-01-11 08:11:50 0 63
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com