రైలు వన్ యాప్ ద్వారా టికెట్లు కొంటే 3 పర్సెంట్ రాయితీ ! రైల్వే

0
166

కర్నూలు # రైల్ వన్ యాప్ ద్వారా టికెట్లు కొంటే 3% రాయితీ

▪️అన్ రిజర్వ్ టికెట్లపై రాయితీ జనవరి 14 నుంచి జులై 14 వరకు.

రైళ్లలో అర్రిజర్వ్డ్ టికెట్లను రైల్ వన్ యాప్ ద్వారా కొని డిజిటల్ విధానంలో చెల్లింపులు చేసేవారికి 3% రాయితీని రైల్వే మంత్రిత్వశాఖ ఇవ్వనుంది. 2026 జనవరి 14 నుంచి జులై 14 వరకు ఇది అమల్లో ఉంటుంది. ఈ యాప్ ద్వారా ఆర్-వ్యాలెట్తో చెల్లింపుల్ని చేసేవారికే ప్రస్తుతం ఈ రాయితీని క్యాష్బ్యాక్ రూపంలో ఇస్తోంది. డిజిటల్ బుకింగ్లను ప్రోత్సహించడానికి ఈ యాప్ ద్వారా జరిగే అన్నిరకాల డిజిటల్ చెల్లింపులకు దీనిని విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. సంబంధిత సాఫ్ట్వేర్లో తగిన మార్పులు చేయాలని 'రైల్వే సమాచార వ్యవస్థ కేంద్రం (క్రిస్)కు మంగళవారం రైల్వేశాఖ ఆదే శాలిచ్చింది. ప్రయాణికుల స్పందన ఎలా ఉందో మే నెలలో తెలియజేస్తే దీనిపై తదుపరి పరిశీలన చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆర్-వ్యాలెట్ ద్వారా ఇప్పటికే ఉన్న రాయితీ కొనసాగుతుందని స్పష్టంచేసింది. ఇతర ఏ ఆన్లైన్ విధానాల్లో కొన్న అన్ రిజర్వ్ టికెట్లకు వర్తించబోదని తేల్చిచెప్పింది.

Search
Categories
Read More
Andhra Pradesh
YSR Kadapa: వైఎస్ఆర్ కడప జిల్లాలో 227 గన్ లైసెన్సులు రద్దు.
ఎర్రచందనం స్మగ్లర్లు, కబ్జాదారులు, కిరాయి రౌడీలు, గూండాలకు లైసెన్స్‌లు ఇచ్చినట్లు ఆరోపణలు...
By Pagadala Venkateswar 2026-02-01 08:26:59 0 133
Andhra Pradesh
వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని హోటల్ యజమానిపై అధికారి నిర్వాకం
1/3 కాఫీ ఇవ్వలేదని హోటల్ పై అధికారి ప్రతాపం...    1/3 కాఫీ ఇవ్వలేదని ఓ అధికారి హోటల్...
By Rajini Kumari 2026-02-07 12:11:36 0 111
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com