ఒకరోజు ముందే పింఛన్ల పంపిణీ డాక్టర్ జి లక్ష్మీశ

0
239

*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌*

*ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 31, 2025*

 

*పింఛ‌ను.. స‌రికొత్త‌గా చేతికందెను..*

- *నూత‌న ఏడాది ప్రారంభం నాటికే పేద‌ల చేతిలో పింఛ‌ను మొత్తం*

- *పేద‌ల సేవ‌లో మ‌రో ముంద‌డుగుతో ఎన్‌టీఆర్ భ‌రోసా*

- *ప‌టిష్ట ప‌ర్య‌వేక్ష‌ణ‌, స‌మ‌న్వ‌యంతో స‌జావుగా పెన్ష‌న్ల పంపిణీ*

- *పింఛ‌ను పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌*

 

పేద‌లకు ఎన్‌టీఆర్ భ‌రోసా ద్వారా సామాజిక భ‌ద్ర‌తతోపాటు గౌర‌వ‌ప్ర‌ద జీవితానికి భ‌రోసా ఏర్ప‌డుతోంద‌ని.. పేద‌ల సేవ‌లో మ‌రో ముంద‌డుగుతో ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ మొత్తం నూత‌న ఏడాది ప్రారంభం నాటికే ల‌బ్ధిదారుల చేతికందింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.

ఎన్‌టీఆర్ భ‌రోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా బుధ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. అధికారుల‌తో క‌లిసి విజ‌య‌వాడ అర్బ‌న్ ప‌రిధిలో లెనిన్ సెంట‌ర్ ప్రాంతంలో ల‌బ్ధిదారుల‌కు పెన్ష‌న్ పంపిణీ చేసే కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. వార్డు స‌చివాల‌య కార్య‌ద‌ర్శులు, ప్ర‌భుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్ష‌న్లు అందిస్తున్న ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించారు. కేట‌గిరీల వారీగా ల‌బ్ధిదారుల‌కు పెన్ష‌న్ మొత్తం స‌రైన‌విధంగా అందుతుందా.. లేదా? అనే విష‌యాన్ని అడిగి తెలుసుకున్నారు. సామాజిక భద్రత పెన్షన్ మొత్తం చేతికి అందుకున్న వేళ ఓ అమ్మ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ప్రభుత్వ సహాయం తనకు కొండంత ధైర్యం ఇస్తోందనే భావన ఆమె చిరునవ్వులో కనిపించింది. ఆ పింఛ‌ను మొత్తమే త‌న గౌర‌వప్ర‌ద జీవనానికి పెద్ద అండ‌నే భ‌రోసా క‌నిపించింది. 

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ నూత‌న సంవ‌త్స‌రం ప్రారంభం నాటికే ల‌బ్ధిదారుల‌కు పెన్ష‌న్ మొత్తం అందించాల‌నే ఉద్దేశంతో డిసెంబ‌ర్ 31నే పంపిణీకి ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేసి కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయ‌డం జ‌రిగింద‌న్నారు. జిల్లాలో ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల కింద కొత్త వాటితో కలుపుకొని 2,28,592 పెన్ష‌న్ల‌కు దాదాపు రూ. 98.95 కోట్లు పంపిణీ చేయ‌డం జ‌రుగుతోంద‌ని.. క్షేత్ర‌స్థాయిలో అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి ఇళ్ల వద్ద పెన్ష‌న్ల పంపిణీ స‌జావుగా సాగేలా కృషిచేశార‌న్నారు. ఎక్క‌డా ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌ల‌కు ఆస్కారం లేకుండా అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా పెన్ష‌న్ల మొత్తాన్ని ల‌బ్ధిదారుల ఇళ్ల వ‌ద్దే అందించిన‌ట్లు తెలిపారు. ప్ర‌భుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్నదే ముఖ్య ఉద్దేశ్యమని, అందుకు అధికారులు బాధ్యతాయుతంగా ప‌నిచేస్తున్న‌ట్లు కలెక్టర్ ల‌క్ష్మీశ తెలిపారు.

కార్య‌క్ర‌మంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచార‌రావు, యూసీడీ పీవో పి.వెంక‌ట నారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

(డీఐపీఆర్వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

Search
Categories
Read More
Entertainment
Riteish Deshmukh’s 'Raja Shivaji' Makes Historic Box Office Run
Riteish Deshmukh’s ambitious historical epic Raja Shivaji has entered the elite ₹100 crore...
By Dunna Jessicaruth 2026-05-18 11:49:50 0 120
Andhra Pradesh
ఇవాళ 9 మందిMLA లతో భేటీ కానున్న పవన్ కళ్యాణ్
*అమరావతి : జనసేన ఎమ్మెల్యేలతో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమావేశం.*   *ఒక్కో...
By Rajini Kumari 2025-12-19 12:48:30 0 212
Andhra Pradesh
నందిగామ కృష్ణ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో చలివేంద్రం
నందిగామ పట్టణంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (నందిగామ బ్రాంచ్ )వారు బాటసారుల దాహార్తిని...
By Patan Khuddus 2026-05-08 10:42:51 0 267
Telangana
కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు
నస్పూర్ కార్పొరేషన్ పరిధిలో 37వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇక్బాల్ ...
By Avunoori Mahesh 2026-04-26 12:56:07 0 179
Andhra Pradesh
Chandrababu Naidu: ఏపీలో జననాల రేటు దారుణంగా పడిపోతోంది: సీఎం చంద్రబాబు.
కుటుంబ నియంత్రణ నుంచి పాపులేషన్ మేనేజ్‌మెంట్ వైపు ఏపీ అడుగులు 2047 నాటికి రాష్ట్ర జనాభాలో...
By Pagadala Venkateswar 2026-03-05 12:14:26 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com