ఒకరోజు ముందే పింఛన్ల పంపిణీ డాక్టర్ జి లక్ష్మీశ

0
202

*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌*

*ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 31, 2025*

 

*పింఛ‌ను.. స‌రికొత్త‌గా చేతికందెను..*

- *నూత‌న ఏడాది ప్రారంభం నాటికే పేద‌ల చేతిలో పింఛ‌ను మొత్తం*

- *పేద‌ల సేవ‌లో మ‌రో ముంద‌డుగుతో ఎన్‌టీఆర్ భ‌రోసా*

- *ప‌టిష్ట ప‌ర్య‌వేక్ష‌ణ‌, స‌మ‌న్వ‌యంతో స‌జావుగా పెన్ష‌న్ల పంపిణీ*

- *పింఛ‌ను పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌*

 

పేద‌లకు ఎన్‌టీఆర్ భ‌రోసా ద్వారా సామాజిక భ‌ద్ర‌తతోపాటు గౌర‌వ‌ప్ర‌ద జీవితానికి భ‌రోసా ఏర్ప‌డుతోంద‌ని.. పేద‌ల సేవ‌లో మ‌రో ముంద‌డుగుతో ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ మొత్తం నూత‌న ఏడాది ప్రారంభం నాటికే ల‌బ్ధిదారుల చేతికందింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.

ఎన్‌టీఆర్ భ‌రోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా బుధ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. అధికారుల‌తో క‌లిసి విజ‌య‌వాడ అర్బ‌న్ ప‌రిధిలో లెనిన్ సెంట‌ర్ ప్రాంతంలో ల‌బ్ధిదారుల‌కు పెన్ష‌న్ పంపిణీ చేసే కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. వార్డు స‌చివాల‌య కార్య‌ద‌ర్శులు, ప్ర‌భుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్ష‌న్లు అందిస్తున్న ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించారు. కేట‌గిరీల వారీగా ల‌బ్ధిదారుల‌కు పెన్ష‌న్ మొత్తం స‌రైన‌విధంగా అందుతుందా.. లేదా? అనే విష‌యాన్ని అడిగి తెలుసుకున్నారు. సామాజిక భద్రత పెన్షన్ మొత్తం చేతికి అందుకున్న వేళ ఓ అమ్మ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ప్రభుత్వ సహాయం తనకు కొండంత ధైర్యం ఇస్తోందనే భావన ఆమె చిరునవ్వులో కనిపించింది. ఆ పింఛ‌ను మొత్తమే త‌న గౌర‌వప్ర‌ద జీవనానికి పెద్ద అండ‌నే భ‌రోసా క‌నిపించింది. 

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ నూత‌న సంవ‌త్స‌రం ప్రారంభం నాటికే ల‌బ్ధిదారుల‌కు పెన్ష‌న్ మొత్తం అందించాల‌నే ఉద్దేశంతో డిసెంబ‌ర్ 31నే పంపిణీకి ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేసి కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయ‌డం జ‌రిగింద‌న్నారు. జిల్లాలో ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల కింద కొత్త వాటితో కలుపుకొని 2,28,592 పెన్ష‌న్ల‌కు దాదాపు రూ. 98.95 కోట్లు పంపిణీ చేయ‌డం జ‌రుగుతోంద‌ని.. క్షేత్ర‌స్థాయిలో అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి ఇళ్ల వద్ద పెన్ష‌న్ల పంపిణీ స‌జావుగా సాగేలా కృషిచేశార‌న్నారు. ఎక్క‌డా ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌ల‌కు ఆస్కారం లేకుండా అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా పెన్ష‌న్ల మొత్తాన్ని ల‌బ్ధిదారుల ఇళ్ల వ‌ద్దే అందించిన‌ట్లు తెలిపారు. ప్ర‌భుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్నదే ముఖ్య ఉద్దేశ్యమని, అందుకు అధికారులు బాధ్యతాయుతంగా ప‌నిచేస్తున్న‌ట్లు కలెక్టర్ ల‌క్ష్మీశ తెలిపారు.

కార్య‌క్ర‌మంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచార‌రావు, యూసీడీ పీవో పి.వెంక‌ట నారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

(డీఐపీఆర్వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

Search
Categories
Read More
Andhra Pradesh
గిఫ్ట్ ల పేరుతో మోసం !! ప్రజలు జాగ్రత్త !!
కర్నూలు : త్వరలో రాబోతున్నటువంటి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సందర్భంగా సైబర్ నేరగాళ్లు క్రిస్మస్...
By Hari Krishna 2025-12-21 09:47:03 0 173
Telangana
శ్రీనివాస్ కుటుంబానికి అండగా DTF
మహబూబాబాద్/కొత్తగూడ:: సర్పంచ్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా బ్రెయిన్...
By Bittu Bittu 2026-04-11 12:43:41 0 846
Andhra Pradesh
భారత ఆర్థిక మార్కెట్లపై ఒకరోజు వర్క్‌షాప్. - స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్ మార్కెట్ వంటి రంగాల్లో ఉన్న కెరీర్ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన - డాక్టర్ మూర్తి.
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం  బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో భారత ఆర్థిక...
By Ratna Sekhar 2026-03-11 07:11:17 0 228
Andhra Pradesh
కత్తిపూడి బాధితుడు ముత్తిన రామకృష్ణను పరామర్శించిన BCY పార్టీ అనూష యాదవ్
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి...
By BABJI DADALA 2026-01-05 03:25:00 0 316
Andhra Pradesh
ఎస్సీ మొర్చా ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం
ఎస్సీ మోర్చ ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది వివరాలకు వెళితే విశాఖ బీచ్ రోడ్ కామత్ బోజన...
By Mobbu Venkatramana 2026-03-12 14:15:43 0 374
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com